AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎమ్మెల్యే ఇంటి దాడి ఘటనలో ఉగ్రవాదుల హస్తం..!

మంగళవారం నాడు బెంగళూరులో చోటుచేసుకున్న ఘర్షణలపై ఆ రాష్ట్ర హోం శాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే దాడిలో ధ్వంసమైన ప్రభుత్వ ఆస్తుల నష్టాన్ని విధ్వంసకారుల..

ఎమ్మెల్యే ఇంటి దాడి ఘటనలో ఉగ్రవాదుల హస్తం..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 13, 2020 | 8:34 PM

Share

మంగళవారం నాడు బెంగళూరులో చోటుచేసుకున్న ఘర్షణలపై ఆ రాష్ట్ర హోం శాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే దాడిలో ధ్వంసమైన ప్రభుత్వ ఆస్తుల నష్టాన్ని విధ్వంసకారుల వద్ద నుంచి వసూలు చేయనున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. ఇదిలావుంటే తాజాగా.. ఈ దాడిలో ఉగ్రవాదుల హస్తం ఉందని మంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస మూర్తి ఇంటిపై జరిగిన దాడి వెనుక ఇస్లామిక్‌ ఉగ్రవాదుల పాత్ర ఉందని గురువారం ప్రకటించారు.

గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యేకు, అనుచరులకు మధ్య తీవ్రమైన భేదాభిప్రాయాలున్నాయని.. అంతే కాకుండా ఎమ్మెల్యేకూ, సోషల్ డెమోక్రెటిక్ పార్టీ ఆఫ్ ఇండియాకు మధ్య పెద్ద ఎత్తున భేదాబిప్రాయాలు బయటకు వస్తున్నాయి. అయితే ఈ క్రమంలో సోషల్ మీడియా పోస్టును ఆధారంగా చేసుకుని.. ముందస్తు ప్లాన్‌ ప్రకారమే కుట్ర పన్ని.. సోషల్ డెమోక్రెటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దాడికి పాల్పడినట్లు మంత్రి తెలిపారు.ఈ విషయంపై అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నామని.. ఇప్పటికే ఎస్‌డీపీఐ పాత్రకు సంబంధించిన పలు వీడియోలు లభించాయని హోంమంత్రి బసవరాజ్ తెలిపారు.

Read More :

రాజస్థాన్‌లో తాజాగా మరో 608 పాజిటివ్‌ కేసులు

“మహా” పోలీసులను వణికిపోస్తున్న కరోనా మహమ్మారి