రాజస్థాన్లో తాజాగా మరో 608 పాజిటివ్ కేసులు
రాజస్థాన్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 608 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు..
రాజస్థాన్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 608 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 56,708కి చేరింది. వీటిలో కరోనా నుంచి కోలుకుని 41,819 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 14,056 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గురువారం ఉదయం 10.30 గంటల వరకు నమోదైన కేసుల వివరాలను రాజస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కాగా, దేశ వ్యాప్తంగా గురువారం నాడు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లొ కొత్తగా 66,999 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23,96,638కి చేరింది.
608 fresh #COVID19 cases reported in the state today till 1030 hours. The total number of positive cases in the state is now 56,708 including 14,056 active cases, 41,819 recovered cases and 833 deaths: Rajasthan Health Department pic.twitter.com/GnIDy7P4zG
— ANI (@ANI) August 13, 2020