AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాలలో నేటి నుంచి మార్చి 1 వరకు ఆ రైళ్లు రద్దు.. పూర్తి వివరాలివే..

మెయింటెనెన్స్, ఆపరేషనల్‌ వర్క్‌ కారణాల వల్ల దక్షిణ మధ్య రైల్వే.. తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించే పలు రైళ్లను తాత్కాలికంగా కొద్దిరోజుల పాటు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు..

Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాలలో నేటి నుంచి మార్చి 1 వరకు ఆ రైళ్లు రద్దు.. పూర్తి వివరాలివే..
Indian Railways
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 12, 2023 | 11:30 AM

Share

మెయింటెనెన్స్, ఆపరేషనల్‌ వర్క్‌ కారణాల వల్ల దక్షిణ మధ్య రైల్వే.. తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించే పలు రైళ్లను తాత్కాలికంగా కొద్దిరోజుల పాటు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే తన అధికారిక ట్విట్టర్‌లో ప్రకటన విడుదల చేసింది. నిన్న(ఫిబ్రవరి 11) రైల్వేస్ చేసిన ప్రకటన ప్రకారం.. నాన్-ఇంటర్‌లింకింగ్ పనుల వల్ల పాక్షికంగా కొన్ని రైళ్లను రద్దయ్యాయి. ఇంకా ఆ ప్రకటనలో మునుమాక-శావల్యాపురం-సంతమాగులూరు మధ్య నాన్ ఇంటర్ లింకింగ్ పనులు జరుగుతున్నాయని, దాని కారణంగా నేటి నుంచి మార్చి 1 వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఇండియన్ రైల్వేస్ తెలిపింది. రద్దు చేసిన ట్రైన్ల వివరాలను కూడా తన ప్రకటనలో పొందుపర్చింది దక్షిణ మధ్య రైల్వే. కాచిగూడ, సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్లే ట్రైన్లతో పాటు కాచికూడ, మెదక్ మధ్య తిరిగే రైళ్లు కూడా ఈ ప్రకటనలో ఉన్నాయి.

ఈ మరమ్మతు పనుల నేపథ్యంలో.. గుంటూరు (Guntur)-కాచిగూడ (17251) రైలును నేటి నుంచి ఈ నెల 28 వరకు, కాచిగూడ-గుంటూరు (17252) రైలును రేపటి నుంచి మార్చి 1 వరకు రద్దు చేస్తున్నట్టు తెలిపింది. అలాగే, కాచిగూడ-మెదక్ (Medak) (07577) రైలును రేపటి నుంచి మార్చి 1వ తేదీ వరకు, మెదక్-కాచిగూడ (07578) రైలును రేపటి నుంచి మార్చి 1 వరకు రద్దు చేస్టున్నట్టు తెలిపింది. వీటితోపాటు మచిలీపట్టణం-కర్నూలు సిటీ (07067) రైలును 14, 16,18, 21, 23 25, 28 తేదీల్లో, కర్నూలు సిటీ-మచిలీపట్టణం (07068) రైలును 15, 17, 19, 22, 24, 26, మార్చి 1 తేదీల్లో రద్దు చేస్తున్నట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు.త

ఇవి కూడా చదవండి

తెలుగు రాష్ట్రాలలో తాత్కలికంగా రద్దైన ట్రైన్స్ వివరాలు.. 

అలాగే గుంటూరు-సికింద్రాబాద్ (17254) ఎక్స్‌ప్రెస్ రైలును దొనకొండ-గుంటూరు మధ్య పాక్షికంగా రద్దు చేసినట్టు తెలిపారు. సికింద్రాబాద్-గుంటూరు (17254) ఎక్స్‌ప్రెస్ రైలు దొనకొండ-గుంటూరు మధ్య ఈ నెల 18 నుంచి 27 వరకు రద్దు చేశారు. గుంటూరు-డోన్(17228) రైలును 12-28, డోన్-గుంటూరు (17227) రైలును 13 నుంచి మార్చి 1వ తేదీ వరకు రద్దు చేశారు. గుంటూరు-తిరుపతి (17261) 19 నుంచి 28 వరకు, తిరుపతి-గుంటూరు (17262) రైలు గుంటూరు-మార్కాపురం స్టేషన్ల మధ్య రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు
రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది
రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది
పచ్చి కూరగాయల స్వీట్ హల్వా .. ఒక్కసారి తింటే మర్చిపోలేని రుచి
పచ్చి కూరగాయల స్వీట్ హల్వా .. ఒక్కసారి తింటే మర్చిపోలేని రుచి
రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం నుంచి సూపర్ న్యూస్
రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం నుంచి సూపర్ న్యూస్
ఆ మూవీపై రామ్ చరణ్ ప్రశంసలు..
ఆ మూవీపై రామ్ చరణ్ ప్రశంసలు..
క్యాబేజీ, క్యాలీఫ్లవర్లలో పురుగులను ఎలా తొలగించాలి?
క్యాబేజీ, క్యాలీఫ్లవర్లలో పురుగులను ఎలా తొలగించాలి?