Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సరిహద్దులు చెరిపి వేసేందుకు సిద్దమవుతోన్న భారత రైల్వేస్‌.. రూ. 44 వేల కోట్లతో రైల్వే లైన్‌ నిర్మాణం!

1882లో బ్రిటీష్ వారు టోంక్‌పూర్-బాగేశ్వర్ రైలు మార్గాన్ని మొదటిసారిగా సర్వే చేశారు. ప్లాన్ మ్యాప్ ఆధారంగా కొత్త సర్వే జరిగింది.

సరిహద్దులు చెరిపి వేసేందుకు సిద్దమవుతోన్న భారత రైల్వేస్‌.. రూ. 44 వేల కోట్లతో రైల్వే లైన్‌ నిర్మాణం!
Indian Railways
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 22, 2024 | 10:17 PM

సరిహద్దులు చెరిపి వేసేందుకు సిద్దమవుతోంది భారత రైల్వే శాఖ. ఈసారి భారతీయ రైల్వే దాదాపు చైనా సరిహద్దుకు చేరుకోనుంది. ప్రణాళిక దాదాపు ముగిసింది. భారతీయ రైల్వే త్వరలో ఉత్తరాఖండ్ మీదుగా చైనా సరిహద్దు వరకు రైళ్లను నడపనుంది. చంపావత్ జిల్లాలోని తనక్‌పూర్ – బాగేశ్వర్ మధ్య ఈ రైలును నిర్మించనున్నారు. 169 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ సర్వే పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ రైలు మార్గం హిమాలయాలలోని పర్వత ప్రాంతం గుండా వెళుతుంది. ఈ రైలు చైనా సరిహద్దుకు సమీపంలోని పితోర్‌గఢ్ – బాగేశ్వర్‌కు చేరుకుంటుంది.

ఈ కొత్త రైల్వే లైన్ చాలా కీలకమని భారత రైల్వే అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే పితోర్‌గఢ్ జిల్లా చైనాతో మాత్రమే కాకుండా నేపాల్ అంతర్జాతీయ సరిహద్దుతో కూడా అనుసంధానించబడి ఉంది. తోనక్పూర్ భారతదేశం-నేపాల్ సరిహద్దులో ఉన్న ప్రాంతం. ఇది ఉత్తరాఖండ్‌లోని నేపాల్ సరిహద్దులో భారతదేశంలోని చివరి రైల్వే స్టేషన్. ఈ మార్గంలో సర్వే తోపాటు పిల్లర్ల ఏర్పాటు పనులు కూడా ప్రారంభమయ్యాయి.

రైల్వే వర్గాల సమాచారం ప్రకారం, పిథోరఘర్ జిల్లాలోని హిమాలయ డ్రైనేజీ ప్రాంతంలో మొత్తం ఐదు పాస్‌లు ఉన్నాయి. లంపియా ధుర, లేవిధుర, లిపులేఖ్, ఉంటా జయంతి, దర్మా పాస్ ఉన్నాయి. అవన్నీ ఐదు వేల మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నాయి. దీంతో అక్కడికి త్వరగా చేరుకోవడం కష్టమే కాకుండా సైన్యం సరుకులు తీసుకెళ్లడం కూడా కష్టమే. రోడ్డు మార్గంలో తనక్‌పూర్ నుండి పితోర్‌ఘర్ మీదుగా చైనా సరిహద్దుకు చేరుకోవడానికి దాదాపు 16 గంటల సమయం పడుతోంది. కొత్త రైల్వే లైన్‌ వేసిన తర్వాత రెండు మూడు గంటల్లో చేరుకోవచ్చని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి.

1882లో బ్రిటీష్ వారు టోంక్‌పూర్-బాగేశ్వర్ రైలు మార్గాన్ని మొదటిసారిగా సర్వే చేశారు. ప్లాన్ మ్యాప్ ఆధారంగా కొత్త సర్వే జరిగింది. ప్రాథమిక సర్వే ప్రకారం, 169.99 కి.మీ పొడవు గల లైన్‌కు దాదాపు 44,140 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇందుకోసం మొత్తం 452 హెక్టార్ల భూమిని సేకరించారు. ఈ రైలు మార్గం మొత్తం 65 సొరంగాల గుండా వెళుతుంది. పూర్ణగిరి సమీపంలోని పొడవైన సొరంగం దాదాపు 6 కి.మీ. లైన్ల మధ్య 135 వంతెనలు ఉంటాయి. ఈ ఏడాది ఏప్రిల్ 18 నుంచి టోంక్‌పూర్‌లో సర్వే పనులు ప్రారంభమయ్యాయి. త్వరలో ఈ ప్రాజెక్ట్‌ పూర్తి చేసుకోనున్నట్లు భారత రైల్వేస్‌ పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..