Indian Railways: బంగ్లాదేశ్‌కు 20 బ్రాడ్ గేజ్ లోకోమోటివ్‌లను అందించిన భారతీయ రైల్వే.. కారణం ఏమిటంటే..?

Indian Railways: బంగ్లాదేశ్, భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం ఆ దేశానికి 20 బ్రాడ్ గేజ్(బి.జి) లోకోమోటివ్‌లను ప్రారంభించారు. ఈ మేరకు న్యూఢిల్లీలోని రైల్ భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వర్చువల్‌గా..

Indian Railways: బంగ్లాదేశ్‌కు 20 బ్రాడ్ గేజ్ లోకోమోటివ్‌లను అందించిన భారతీయ రైల్వే.. కారణం ఏమిటంటే..?
Union Minister Ashwini Vaishnav flagged off virtually for broad gauge locomotives
Follow us

|

Updated on: May 24, 2023 | 1:50 PM

Indian Railways: బంగ్లాదేశ్, భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం ఆ దేశానికి 20 బ్రాడ్ గేజ్(బి.జి) లోకోమోటివ్‌లను ప్రారంభించారు. ఈ మేరకు న్యూఢిల్లీలోని ఇండియన్ రైల్వేస్ రైల్ భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వర్చువల్‌గా జెండా వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బంగ్లాదేశ్ నుంచి రైల్వే మంత్రి మొహ్మద్ నూరుల్ ఇస్లాం సుజన్ కూడా వర్చువల్‌గా పాల్గొన్నారు. అయితే అక్టోబరు 2019లో బంగ్లా ప్రధాన మంత్రి షేక్ హసీనా భారతదేశ పర్యటన సందర్భంగా చేసిన ముఖ్యమైన నిబద్ధతను నెరవేర్చే క్రమంలో ఈ డీజిల్ లోకోమోటివ్‌లను భారత ప్రభుత్వం మంజూరు చేస్తూ బంగ్లా దేశ్‌కు అప్పగించడం జరిగింది. బంగ్లాదేశ్ అవసరాలకు అనుగుణంగా ఆ దేశంలో పెరుగుతున్న ప్రయాణీకులు, రైల్వే లోకోమోటివ్‌ల అవసరాలను తీర్చడం కోసం భారతదేశంలోని లోకోమోటివ్‌లను తగు మార్పులు చేసి బంగ్లాదేశ్‌కు అందించడం జరిగినది.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య నాగరికత, సాంస్కృతిక, సామాజిక , ఆర్థిక, రాజకీయ రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు ఇరు దేశాల ప్రధానులు చురుకైన పాత్ర పోషిస్తున్నారు. సరిహద్దులో రైలు కనెక్టివిటీని మెరుగుపరచడంలో, బలోపేతం చేయడంలో ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని మెరుగుపరచడంలో భారతీయ రైల్వే కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతానికి గెడా- దర్సనా.. బెనాపోల్-పెట్రాపోల్.. సింగాబాద్- రోహన్‌పూర్.. రాధికాపూర్- బిరోల్..హల్దిబారి-చిలహతి మధ్య బి.జి కనెక్టివిటీ పనిచేస్తోంది. అఖౌరా-అగర్తలా, మహిహాసన్-షాబాజ్‌పూర్ మధ్య మరో రెండు క్రాస్ బోర్డర్ రైలు కనెక్టివిటీల పనులు జరుగుతున్నాయి. వీటిని త్వరలో పూర్తి చేసి ప్రారంభించే అవకాశం ఉందని వైష్ణమ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఈ సంర్భంగా బంగ్లాదేశ్ రైల్వే మంత్రి నూరుల్ ఇస్లాం సుజన్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ‘భారత ప్రభుత్వం మాకు అండగా నిలిచినందుకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గతంలో జూన్ 2020లో భారత ప్రభుత్వం బంగ్లాదేశ్‌కు 10 లోకోమోటివ్‌లను గ్రాంట్‌ చేసింది. బ్రాడ్ గేజ్ లోకోమోటివ్‌లను అందించినందుకు భారత్‌కి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ లోకోమోటివ్‌ల సరఫరా గూడ్స్, ప్యాసింజర్ రైళ్లను మెరుగుపరచడానికి సహాయపడుతుంది, రైల్వే రంగానికి సంబంధించి రెండు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న సహకారం రోజురోజుకు పెరుగుతుందని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల  కోసం ఇక్కడ  క్లిక్ చేయండి.. 

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..