AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: బంగ్లాదేశ్‌కు 20 బ్రాడ్ గేజ్ లోకోమోటివ్‌లను అందించిన భారతీయ రైల్వే.. కారణం ఏమిటంటే..?

Indian Railways: బంగ్లాదేశ్, భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం ఆ దేశానికి 20 బ్రాడ్ గేజ్(బి.జి) లోకోమోటివ్‌లను ప్రారంభించారు. ఈ మేరకు న్యూఢిల్లీలోని రైల్ భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వర్చువల్‌గా..

Indian Railways: బంగ్లాదేశ్‌కు 20 బ్రాడ్ గేజ్ లోకోమోటివ్‌లను అందించిన భారతీయ రైల్వే.. కారణం ఏమిటంటే..?
Union Minister Ashwini Vaishnav flagged off virtually for broad gauge locomotives
శివలీల గోపి తుల్వా
|

Updated on: May 24, 2023 | 1:50 PM

Share

Indian Railways: బంగ్లాదేశ్, భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం ఆ దేశానికి 20 బ్రాడ్ గేజ్(బి.జి) లోకోమోటివ్‌లను ప్రారంభించారు. ఈ మేరకు న్యూఢిల్లీలోని ఇండియన్ రైల్వేస్ రైల్ భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వర్చువల్‌గా జెండా వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బంగ్లాదేశ్ నుంచి రైల్వే మంత్రి మొహ్మద్ నూరుల్ ఇస్లాం సుజన్ కూడా వర్చువల్‌గా పాల్గొన్నారు. అయితే అక్టోబరు 2019లో బంగ్లా ప్రధాన మంత్రి షేక్ హసీనా భారతదేశ పర్యటన సందర్భంగా చేసిన ముఖ్యమైన నిబద్ధతను నెరవేర్చే క్రమంలో ఈ డీజిల్ లోకోమోటివ్‌లను భారత ప్రభుత్వం మంజూరు చేస్తూ బంగ్లా దేశ్‌కు అప్పగించడం జరిగింది. బంగ్లాదేశ్ అవసరాలకు అనుగుణంగా ఆ దేశంలో పెరుగుతున్న ప్రయాణీకులు, రైల్వే లోకోమోటివ్‌ల అవసరాలను తీర్చడం కోసం భారతదేశంలోని లోకోమోటివ్‌లను తగు మార్పులు చేసి బంగ్లాదేశ్‌కు అందించడం జరిగినది.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య నాగరికత, సాంస్కృతిక, సామాజిక , ఆర్థిక, రాజకీయ రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు ఇరు దేశాల ప్రధానులు చురుకైన పాత్ర పోషిస్తున్నారు. సరిహద్దులో రైలు కనెక్టివిటీని మెరుగుపరచడంలో, బలోపేతం చేయడంలో ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని మెరుగుపరచడంలో భారతీయ రైల్వే కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతానికి గెడా- దర్సనా.. బెనాపోల్-పెట్రాపోల్.. సింగాబాద్- రోహన్‌పూర్.. రాధికాపూర్- బిరోల్..హల్దిబారి-చిలహతి మధ్య బి.జి కనెక్టివిటీ పనిచేస్తోంది. అఖౌరా-అగర్తలా, మహిహాసన్-షాబాజ్‌పూర్ మధ్య మరో రెండు క్రాస్ బోర్డర్ రైలు కనెక్టివిటీల పనులు జరుగుతున్నాయి. వీటిని త్వరలో పూర్తి చేసి ప్రారంభించే అవకాశం ఉందని వైష్ణమ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఈ సంర్భంగా బంగ్లాదేశ్ రైల్వే మంత్రి నూరుల్ ఇస్లాం సుజన్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ‘భారత ప్రభుత్వం మాకు అండగా నిలిచినందుకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గతంలో జూన్ 2020లో భారత ప్రభుత్వం బంగ్లాదేశ్‌కు 10 లోకోమోటివ్‌లను గ్రాంట్‌ చేసింది. బ్రాడ్ గేజ్ లోకోమోటివ్‌లను అందించినందుకు భారత్‌కి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ లోకోమోటివ్‌ల సరఫరా గూడ్స్, ప్యాసింజర్ రైళ్లను మెరుగుపరచడానికి సహాయపడుతుంది, రైల్వే రంగానికి సంబంధించి రెండు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న సహకారం రోజురోజుకు పెరుగుతుందని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల  కోసం ఇక్కడ  క్లిక్ చేయండి.. 

Follow Us
క్షణం క్షణం భయం..4 ఏళ్లుగా ట్రెండింగ్‌లో ఉన్న హర్రర్ మూవీ ఇదే
క్షణం క్షణం భయం..4 ఏళ్లుగా ట్రెండింగ్‌లో ఉన్న హర్రర్ మూవీ ఇదే
కేరళ స్టోరీ 2 విడుదలకు అంతా సిద్ధమేనా.. అసలు వస్తుందా..?
కేరళ స్టోరీ 2 విడుదలకు అంతా సిద్ధమేనా.. అసలు వస్తుందా..?
ఆ ఒక్కడిపై అందరి కళ్లు.. తిక్కరేగి చెలరేగాడో సఫారీల ఖేల్ ఖతమే..
ఆ ఒక్కడిపై అందరి కళ్లు.. తిక్కరేగి చెలరేగాడో సఫారీల ఖేల్ ఖతమే..
కుబేరుడికి ఇష్టమైన రాశులు ఇవే.. వీళ్ళు జీవితాంతం కోటీశ్వరులు..
కుబేరుడికి ఇష్టమైన రాశులు ఇవే.. వీళ్ళు జీవితాంతం కోటీశ్వరులు..
చాణక్య నీతి: ఈ 6 లక్షణాలున్నవారు ఎప్పుడూ ధనవంతులు కాలేరు..!
చాణక్య నీతి: ఈ 6 లక్షణాలున్నవారు ఎప్పుడూ ధనవంతులు కాలేరు..!
వరుసగా ఫ్లాప్స్.. అయినా తగ్గని క్రేజ్..!
వరుసగా ఫ్లాప్స్.. అయినా తగ్గని క్రేజ్..!
మీ బైక్‌లో పెట్రోల్ ట్యాంక్‌ ఫుల్‌ అయినట్లు ఎలా తెలుస్తోంది..?
మీ బైక్‌లో పెట్రోల్ ట్యాంక్‌ ఫుల్‌ అయినట్లు ఎలా తెలుస్తోంది..?
లొంగిపోయిన మావోయిస్ట్‌ పార్టీ అగ్రనేతలు..
లొంగిపోయిన మావోయిస్ట్‌ పార్టీ అగ్రనేతలు..
సండే స్పెషల్.. ఫిష్ కుర్మా ఇలా వండితే తినేకొద్దీ తినాలనిపిస్తుంది
సండే స్పెషల్.. ఫిష్ కుర్మా ఇలా వండితే తినేకొద్దీ తినాలనిపిస్తుంది
ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీకి వాడే ప్లాస్టిక్‌ గిన్నెల్లో కాలకూట విషం
ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీకి వాడే ప్లాస్టిక్‌ గిన్నెల్లో కాలకూట విషం