AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Explainer: రైళ్లల్లో మరో కొత్త శకం .. తొలి ర్యాపిడ్ రైలును ప్రారంభించనున్న ప్రధాని మోడీ..

నేటి నుంచి ఈ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానుండగా.. ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్ 17కిలోమీటర్ల పొడవైన ప్రాధాన్యతా విభాగంలో సాహిబాబాద్ నుంచి దుహై డిపో మధ్య ఐదు స్టేషన్ల మీదుగా పరుగులు తీయనున్నాయి. ఈ ర్యాపిడ్‌ రైళ్లు పూర్తి ఎయిర్‌ కండిషన్డ్‌గా తయారు చేయడంతోపాటు ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని అనేక ఫీచర్లు ఏర్పాటు చేశారు.

Explainer: రైళ్లల్లో మరో కొత్త శకం .. తొలి ర్యాపిడ్ రైలును ప్రారంభించనున్న ప్రధాని మోడీ..
Namo Bharat Train
Surya Kala
|

Updated on: Oct 20, 2023 | 6:12 AM

Share

భారత్‌లో వందేభారత్‌ తరహాలో మరో కొత్త రైళ్లు పట్టాలెక్కనున్నాయి. దేశంలోనే తొలి ర్యాపిడ్ రైలును ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించనున్నారు. దేశంలో ఇప్పటికే సెమీ హైస్పీడ్ రైళ్లుగా వందే భారత్ ట్రైన్స్ పరుగులు పెడుతున్నాయి. ఇప్పుడు అంతకంటే వేగంతో ప్రయాణించే రైళ్లతో మరో కొత్త శకం మొదలు కాబోతోంది. ప్రయాణికుల మెరుగైన సేవలందించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ప్రాజెక్టును రూపొందించింది. దానిలో భాగంగా.. తొలి ర్యాపిడ్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. గంటకు 160 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ రైళ్లలో అనేక అధునాతన వసతులు ఏర్పాటు చేశారు. దేశంలోనే తొలిసారి ఢిల్లీ-ఘజియాబాద్‌ రీజనల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ కారిడార్‌లో సాహిబాబాద్‌-దుహై డిపో మధ్య దూసుకెళ్లనున్నాయి.

నేటి నుంచి ఈ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానుండగా.. ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్ 17కిలోమీటర్ల పొడవైన ప్రాధాన్యతా విభాగంలో సాహిబాబాద్ నుంచి దుహై డిపో మధ్య ఐదు స్టేషన్ల మీదుగా పరుగులు తీయనున్నాయి. ఈ ర్యాపిడ్‌ రైళ్లు పూర్తి ఎయిర్‌ కండిషన్డ్‌గా తయారు చేయడంతోపాటు ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని అనేక ఫీచర్లు ఏర్పాటు చేశారు. ప్రతి ర్యాపిడ్‌ రైలులో ఒక కోచ్‌ను మహిళల కోసం రిజర్వు చేశారు.

ఈ రైళ్లు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రతి 15 నిమిషాలకు ఒకటి చొప్పున సర్వీసులందిస్తాయి. ప్రతి రైలులో ఆరు కోచ్‌లు.. ఏకకాలంలో 1700 మంది కూర్చొని, నిలబడి ప్రయాణించేలా ఏర్పాటు చేశారు. స్టాండర్డ్‌ కోచ్‌లో 72 సీట్లు, ప్రీమియం కోచ్‌లో 62 సీట్లు చొప్పున ఉంటాయి. ఇక.. స్టాండర్డ్‌ కోచ్‌లలో కనీస టికెట్‌ ధర 20 రూపాయలు కాగా.. గరిష్ఠ ధర 50 రూపాయలుగా నిర్ణయించారు. అలాగే, ప్రీమియం కోచ్‌లలో అయితే కనీస టికెట్‌ ధర 40 రూపాయలు కాగా.. గరిష్ఠ ధర 100 రూపాయలు నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బ్రేక్ డ్యాన్స్‏తో టాలీవుడ్‏ను షేక్ చేసిన హీరోయిన్..
బ్రేక్ డ్యాన్స్‏తో టాలీవుడ్‏ను షేక్ చేసిన హీరోయిన్..
ఏసీ కోచ్‌లో మీకు బెడ్ షీట్ ఇవ్వలేదా..? ఇలా చేస్తే రీఫండ్..
ఏసీ కోచ్‌లో మీకు బెడ్ షీట్ ఇవ్వలేదా..? ఇలా చేస్తే రీఫండ్..
నాగుపాము పడగపై కనిపించే ఆ సింబల్ ఏంటి?
నాగుపాము పడగపై కనిపించే ఆ సింబల్ ఏంటి?
రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. మీ కోసమే ఈ కొత్త ఏటీఎం
రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. మీ కోసమే ఈ కొత్త ఏటీఎం
వైట్‌ బాల్‌తో హీరో.. రెడ్ బాల్‌తో జీరో.. టీమిండియా పాలిట విలన్..?
వైట్‌ బాల్‌తో హీరో.. రెడ్ బాల్‌తో జీరో.. టీమిండియా పాలిట విలన్..?
తెలంగాణలో MBBS, BDS ఫీజులు ఖరారు.. 4 ఏళ్ల పాటు పాత ఫీజులే..
తెలంగాణలో MBBS, BDS ఫీజులు ఖరారు.. 4 ఏళ్ల పాటు పాత ఫీజులే..
హీరోగా విమర్శలు.. డైరెక్టర్‏గా బ్లాక్ బస్టర్ హిట్స్.. ఎవరో గుర్తు
హీరోగా విమర్శలు.. డైరెక్టర్‏గా బ్లాక్ బస్టర్ హిట్స్.. ఎవరో గుర్తు
IRCTC: హైదరాబాద్ నుంచి అండమాన్‌కు 7 రోజుల టూర్.. బరాటాంగ్ సహా..
IRCTC: హైదరాబాద్ నుంచి అండమాన్‌కు 7 రోజుల టూర్.. బరాటాంగ్ సహా..
ఎన్నో కళలలో ప్రపంచాన్ని చుట్టేదామని బయల్దేరింది..గమ్యం చేరకుండానే
ఎన్నో కళలలో ప్రపంచాన్ని చుట్టేదామని బయల్దేరింది..గమ్యం చేరకుండానే
మొబైల్ ద్వారా రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేయడం ఎలా..?
మొబైల్ ద్వారా రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేయడం ఎలా..?