India Covid-19: దేశంలో తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన రికవరీలు.. నిన్న ఎన్ని మరణాలంటే..?

Coronavirus Updates in India: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. సెకండ్ వేవ్ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టినప్పటికీ.. కొన్ని

India Covid-19: దేశంలో తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన రికవరీలు.. నిన్న ఎన్ని మరణాలంటే..?
India Corona
Follow us

|

Updated on: Aug 09, 2021 | 10:00 AM

Coronavirus Updates in India: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. సెకండ్ వేవ్ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టినప్పటికీ.. కొన్ని రోజుల నుంచి పెరుగుతున్న కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. కాగా.. ఆదివారం కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో (ఆదివారం) దేశవ్యాప్తంగా 35,499 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా మరో 447 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 31969954 కి చేరగా.. మరణాల సంఖ్య 4,28,309 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

ఇదిలాఉంటే.. నిన్న దేశవ్యాప్తంగా కరోనా నుంచి 39,686 మంది కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం కోలుకున్నవారి సంఖ్య 3,11,39,457 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,02,188 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా.. రికవరీ రేటు 97.40 శాతానికి పెరిగినట్లు ప్రభుత్వం తెలిపింది.

కాగా.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ ప్రారంభం నాటినుంచి ఇప్పటివరకు 50,86,64,759 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 16,11,590 వ్యాక్సిన్ డోసులు వేసినట్లు కేంద్రప్రభుత్వం తెలిపింది.

ఆగస్టు 08 ఆదివారం నాటికి దేశంలో మొత్తం 48,17,67,232 కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. ఆదివారం ఒక్కరోజే 13,71,871 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.

Also Read:

Accident: నిద్రలోనే మృత్యు ఒడిలోకి.. గుడిసెలోకి దూసుకొచ్చిన ట్రక్కు.. 8 మంది దుర్మరణం..

Chalo Indravelli: ఆత్మగౌరవ దండోరా పేరుతో కాంగ్రెస్‌ పోరాటం.. ఇంద్రవెల్లిలో హై టెన్షన్‌..