AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ప్రపంచంలో తయారయ్యే వ్యాక్సిన్‌లలో 50 శాతం భారత్‌ ఉత్పత్తి చేస్తుంది’ కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రటరీ పుణ్య

భారత్‌ ఫార్మాస్యూటికల్స్‌లో గ్లోబల్ లీడర్‌గా అవతరించిందని, మూడవ అతిపెద్ద ఉత్పత్తిదారుగా, జనరిక్ మెడిసిన్‌ కీలక సరఫరాదారుగా నిలిచినట్లు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్య పేర్కొన్నారు. ఈ రంగంలో భారత్‌ ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలకు గణనీయమైన సహకారం అందిస్తున్నట్లు తెలిపారు..

'ప్రపంచంలో తయారయ్యే వ్యాక్సిన్‌లలో 50 శాతం భారత్‌ ఉత్పత్తి చేస్తుంది' కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రటరీ పుణ్య
Vaccine Manufacturing In India
Srilakshmi C
|

Updated on: Oct 17, 2024 | 8:08 PM

Share

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 8 బిలియన్ల వ్యాక్సిన్ డోస్‌లను తయారు చేసి పంపిణీ చేయగా.. వాటిలో సగం భారత్‌లోనే తయారయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రటరీ పుణ్య సలీల శ్రీవాస్తవ తెలిపారు. గురువారం యుఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్ నిర్వహించిన వార్షిక ఇండియా లీడర్‌షిప్ సమ్మిట్ 2024లో ఆమె ఈ మేరకు ప్రసంగించారు. భారత్‌ ఫార్మాస్యూటికల్స్‌లో గ్లోబల్ లీడర్‌గా అవతరించిందని, మూడవ అతిపెద్ద ఉత్పత్తిదారుగా, జనరిక్ మెడిసిన్‌ కీలక సరఫరాదారుగా నిలిచినట్లు పుణ్య తన ప్రసంగంలో తెలిపారు. ఈ రంగంలో భారత్‌ ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలకు గణనీయమైన సహకారం అందించేందుకు దారితీస్తుందన్నారు. ఇందులో US హెల్త్‌కేర్‌ సిస్టమ్‌ సహకారం కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.

యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా వెలుపల అత్యధిక సంఖ్యలో US FDA- ఆమోదించబడిన ఔషధ కర్మాగారాలు కలిగి ఉండటమే అందుకు నిదర్శనం. అమెరికా వెలుపల ఉన్న US FDA- ఆమోదించబడిన ప్యాంట్‌లలో వీటి సంఖ్య దాదాపు 25 శాతంగా ఉంది. భారత్‌ కంపెనీల్లో తయారు చేసిన మందుల పంపిణీ ద్వారా 2022లో US హెల్త్‌కేర్ సిస్టమ్‌కి 219 బిలియన్ డాలర్లు పొదుపును అందించాయి. 2013 – 2022 మధ్య మొత్తం 1.3 ట్రిలియన్ డాలర్ల పొదుపును అందించాయని ఆమె పేర్కొన్నారు. మందులు మాత్రమే కాకుండా వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో కూడా భారత్‌ ముందుంది. ప్రపంచ వ్యాక్సిన్ల తయారీలో గణనీయమైన వాటాతో ముందుగు సాగుతుంది. భారత్‌ ‘ప్రపంచ ఫార్మసీ’గా దాని పాత్రను నొక్కి చెబుతుందని ఆమె చెప్పారు. ప్రపంచంలో తయారయ్యే వ్యాక్సిన్‌లలో 50 శాతం ఒక్క భారత్‌లోనే తయారవుతున్నట్లు పుణ్య తెలిపారు.

గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది బిలియన్ల వ్యాక్సిన్ డోస్‌లను తయారు చేసి పంపిణీ చేయగా, నాలుగు బిలియన్ డోస్‌లు భారత్లోనే తయారు చేసినట్లు ఆమె చెప్పారు. పటిష్టమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను నిర్ధారించడానికి భారత్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ను సంస్కరించిందని, జాతీయ వైద్య కమిషన్ చట్టం, ఇతర సంబంధిత చట్టాలలో కాలం చెల్లిన నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌లను భర్తీ చేసిందని ఆమె పేర్కొన్నారు. ఇది వైద్య, నర్సింగ్ కాలేజీల సంఖ్య, నమోదులో గణనీయమైన పెరుగుదలకు దారితీసిందన్నారు. ఇది ఆరోగ్య సంరక్షణలో వృత్తిపరమైన లభ్యతలో అసమానతలను పరిష్కరిస్తుందని ఆమె చెప్పారు. పర్యవసానంగా జాతీయ, ప్రపంచ అవసరాలను తీర్చగల ఆరోగ్య శ్రామిక శక్తిని ఉత్పత్తి చేయడానికి భారత్‌ సిద్ధంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రయత్నాలు భారత్‌లో ఆరోగ్య సంరక్షణ నాణ్యత, స్థాయి, ఖర్చు క్రమంగా మెరుగుపరిచాయని పుణ్య పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

2013-2014.. 2021-2022 మధ్య కాలంలో మొత్తం ఆరోగ్య వ్యయం వాటా 25 శాతం తగ్గడమే మా విస్తరించిన ఆరోగ్య సంరక్షణ సేవలకు నిదర్శనమని ఆమె చెప్పారు. హెల్త్‌ కేర్‌ సెక్టార్‌లో ఇండో-యుఎస్ భాగస్వామ్యంపై పుణ్యా మాట్లాడుతూ.. కోవిడ్‌ వంటి మహమ్మారిని ఎదుర్కోవడంలో సంసిద్ధత, యాంటీ-మైక్రోబయల్ రెసిస్టెన్స్‌లలో.. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ( NCDC), యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్‌ ప్రివెన్షన్ (CDC) మధ్య ఉన్న బలమైన భాగస్వామ్యాన్ని తెలుపుతుంది. US CDC సహకారంతో నిర్వహిస్తున్న NCDC, ICMR ఫీల్డ్ ఎపిడెమియాలజీ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లను (FETP) భారత్‌ అభినందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఇప్పటివరకు 200 మందికి పైగా ఎపిడెమిక్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ (EIS) అధికారులు ట్రైనింగ్‌ పొందారని, మరో 50 మంది శిక్షణ పొందుతున్నారని ఆమె అన్నారు. బయో-ఫార్మాస్యూటికల్ సప్లై చైన్‌, ప్రపంచ సరఫరా గొలుసులను ఆప్టిమైజ్ చేయడానికి, బలోపేతం చేయడానికి బయో-5 కూటమి ద్వారా సింగిల్-సోర్స్ సరఫరాదారులపై ఆధారపడటాన్ని తగ్గించనున్నట్లు తెలిపారు.

ఉమ్మడి వ్యూహాత్మక ఫ్రేమ్‌వర్క్‌ను ప్రారంభించడానికి భారత్‌-యుఎస్ కూడా అంగీకరించాయి. 2023లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ క్యాన్సర్‌పై పోరాటానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. US-భారత్ క్యాన్సర్ మూన్‌షాట్ డైలాగ్‌ ఆగస్టులో ప్రారంభించినట్లు తెలిపారు. యుఎస్-ఇండియా బయోమెడికల్ పరిశోధన సహకారాన్ని పెంపొందించడం, గర్భాశయ క్యాన్సర్‌పై దృష్టి సారించడం దీని ప్రధాన లక్ష్యమని పుణ్య పేర్కొన్నారు. ఇది AIIMS, టాటా మెమోరియల్ హాస్పిటల్ వంటి సంస్థలతో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నట్లు ఆమె తెలిపారు. ఇది ‘వన్‌ వరల్డ్, వన్‌ హెల్త్’ విజన్‌ను ప్రతిబింబిస్తుందన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో క్యాన్సర్ పరీక్షలు, రోగనిర్ధారణకు 7.5 మిలియన్ డాలర్ల నిధులు కేటాయించామన్నారు. రేడియోథెరపీ, క్యాన్సర్ నివారణకు GAVI, క్వాడ్ ప్రోగ్రామ్‌ల కింద ప్రపంచ దేశాలకు భారత్‌ 40 మిలియన్ల వ్యాక్సిన్లు అందిస్తుందని తెలిపారు. ఆరోగ్య సంరక్షణలో భారత్‌-యుఎస్ ఉమ్మడి భాగస్వామ్యం ఆరోగ్య సవాళ్లను పరిష్కరించడానికి సహకారం అందిస్తుందని పుణ్య తన ప్రసంగంలో స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.

Follow Us