Coronavirus: గత 24గంటల్లో దేశవ్యాప్తంగా 92 మంది మృతి.. కరోనా కేసులు ఎన్ని నమోదయ్యాయంటే..?
India Coronavirus updates: భారత్లో కరోనావైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా ఇటీవల తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు కాస్త.. మళ్లీ విజృంభిస్తుండటంతో అంతటా ఆందోళన..
India Coronavirus updates: భారత్లో కరోనావైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా ఇటీవల తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు కాస్త.. మళ్లీ విజృంభిస్తుండటంతో అంతటా ఆందోళన నెలకొంది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో ఆతరువాత కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కరోనా వ్యాక్సినేషన్ రెండో విడత కార్యక్రమం కూడా సోమవారం ప్రారంభమైంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,48,54,136 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే నిన్న కరోనా కేసులు కొంచెం తక్కువగానే నమోదయ్యాయి.
సోమవారం గత 24గంటల్లో దేశవ్యాప్తంగా 12,286 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,24,527 (1.11కోట్లు) కు చేరింది. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా గత 24గంటల్లో దేశవ్యాప్తంగా 91 మంది మరణించారు. వీరితో కలిపి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,57,248 కు చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్ను విడుదలచేసింది.
కాగా.. నిన్న దేశవ్యాప్తంగా కరోనా కేసులతోపాటు డిశ్చార్జ్ల సంఖ్య కూడా సమానంగా పెరిగింది. నిన్న కరోనా నుంచి 12,464 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు 1,07,98,921 మంది బాధితులు కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 1,68,358 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 97.07 శాతానికి చేరగా.. మరణాల రేటు 1.41 శాతంగా ఉంది. నిన్న దేశవ్యాప్తంగా 7,59,283 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. వీటితో కలిపి మార్చి 1వ తేదీ వరకు మొత్తం 21,76,18,057 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్స్ పేర్కొంది.
Also Read: