AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India-China: గత నాలుగేళ్లగా చైనా నుంచి తగ్గుతున్న దిగుమతులు… ఆ దేశానికి పెరుగుతున్న ఎగుమతులు..

India-China: భారత్‌, చైనా సరిహద్దుల దగ్గర నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, డ్రాగన్ కంట్రీ కంత్రి నేచర్.. మేకిన్‌ ఇండియాను పటిష్టపరిచే విధానం, చైనా వైఖరిపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత ఇలా..

India-China: గత నాలుగేళ్లగా చైనా నుంచి తగ్గుతున్న దిగుమతులు... ఆ దేశానికి పెరుగుతున్న ఎగుమతులు..
Surya Kala
|

Updated on: Feb 04, 2022 | 6:03 PM

Share

India-China: భారత్‌, చైనా సరిహద్దుల దగ్గర నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, డ్రాగన్ కంట్రీ కంత్రి నేచర్.. మేకిన్‌ ఇండియాను పటిష్టపరిచే విధానం, చైనా వైఖరిపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత ఇలా ఏదైనా కావొచ్చు.. ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపించింది. చైనా ద్వంద్వ వైఖరితో విసిగిపోయిన భారత ప్రభుత్వం చైనాను దూరం పెట్టడానికి అన్ని రకమైన నిర్ణయాలను తీసుకుంది. చైనా దిగుమతులను తగ్గించే విధంగా చర్యలు తీసుకుంది. ఈ నేపధ్యంలో రాజ్యసభలో శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ లిఖితపూర్వక సమాధానం చెప్పారు.

చైనా నుంచి క్రమంగా దిగుమతులు తగ్గుతున్నాయని.. అదే సమయంలో భారత్ నుంచి చైనాకు పెరుగుతున్న ఎగుమతులు పెరిగాయని తెలిపారు. 2017-18లో చైనా నుంచి 76.38 మిలియన్ డాలర్ల మేర దిగుమతులు జరిగినట్లు చెప్పారు. 2020-21 నాటికి 65.21 మిలియన్ డాలర్లకు దిగుమతులు తగ్గినట్లు పేర్కొన్నారు. అదే సమయంలో 2017-18లో చైనాకు ఎగుమతులు 13.33 మిలియన్ డాలర్లు ఉండగా.. 2020-21 నాటికి 21.19 మిలియన్ డాలర్లకు ఎగుమతులు చేరుకున్నాయని తెలిపారు.

గత నాలుగేళ్లలో 63.05 మిలియన్ డాలర్ల నుంచి 44.02 మిలియన్ డాలర్లకు దిగుమతులు తగ్గాయని.. చైనాతో జరిగే వాణిజ్యంలో సమతూకాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తున్నామని అనుప్రియ పటేల్ చెప్పారు.

ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం ద్వారా దిగుమతి భారాన్ని తగ్గించుకుంటూ దేశీయంగా తయారీని ప్రోత్సహిస్తున్నాం. ఈ పథకం జాబితాలో యాక్టివ్ ఫార్మా ఇంగ్రెడియంట్స్, వైద్య పరికరాలు, ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, వైట్ గూడ్స్ (ఏసీలు, ఎల్ఈడీలు), స్పెషాలిటీ స్టీల్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, హై ఎఫిషియన్సీ సోలార్ పీవీ ప్యానెళ్లు, డ్రోన్లు – డ్రోన్ విడిభాగాలు వంటివి ఉన్నాయన్నారు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్

Also Read:

గోరు వెచ్చని నీటిలో చిటికెడు నల్ల ఉప్పు.. పరగడుపున తాగితే అద్భుత ప్రయోజనాలు..?