
రోడ్లు వేయడం కూడా ఒక అభివృద్ధేనా.. దానికీ గప్పాలు కొట్టుకోవడమేనా.. అని అంటుంటారు కొందరు అత్యుత్సాహవంతులు. ఓ డేటా చెబుతా వినండి. కొత్తగా హైవేలు పడిన చోట.. ఆ చుట్టుపక్కల జిల్లాల్లో బ్యాంకులు ఇచ్చే లోన్లు 20 టు 30 పర్సెంట్ పెరిగింది. అంటే అర్థం.. అక్కడ కొత్త వ్యాపారాలు మొదలయ్యాయని. ఈ రోడ్లే.. పంట నష్టాన్ని తగ్గించాయంటే నమ్మగలరా. పోస్ట్-హార్వెస్ట్లాస్ అంటారు. కూరగాయలు, పండ్లు ఎంత త్వరగా మార్కెట్కు తీసుకెళ్తే అంత లాభం. అదే జరిగింది హైవేలు, ఎక్స్ప్రెస్వేలు వేయడం వల్ల. అంతేనా.. కూరగాయలు, పండ్ల ధరలు కూడా తగ్గుతాయి. ఉదాహరణకు, మీరట్ టు ప్రయాగ్రాజ్ వెళ్లడానికి ఒకప్పుడు 12 గంటలు పట్టేది. ఇప్పుడు గంగా ఎక్స్ప్రెస్వేతో అది 6 గంటలకు తగ్గుతుంది. అంటే ఒక లారీ డ్రైవర్ రోజుకు రెండు ట్రిప్పులు వేయగలడు. దీనివల్ల వస్తువుల ధరలు తగ్గి సామాన్యుడికి మేలు జరుగుతుంది. ఇలా ఒక్కటని కాదు.. ఎన్నో ఇంటర్ లింక్స్ ఉన్నాయ్ ఈ రోడ్లతో. స్ట్రెయిట్గా.. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పిన ఒక స్టేట్మెంట్కి వద్దాం. హైదరాబాద్ నుంచి అమరావతికి జస్ట్ 70 నిమిషాల్లో చేరుకోవచ్చు అన్నారు. అంటే గంటా పది నిమిషాల్లో వెళ్లొచ్చు. అయితే మాత్రం ఏంటి లాభం అంటారేమో....