AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హోర్ముజ్‌లో మరోసారి ఉద్రిక్తత.. గల్ఫ్‌లో చిక్కుకున్న భారత ట్యాంకర్లు.. రంగంలోకి దిగిన కేంద్రం

హోర్ముజ్ జలసంధి చుట్టూ మళ్లీ భద్రతా సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో పర్షియన్ గల్ఫ్‌లో చిక్కుకుపోయిన భారత ప్రయోజనాలకు చెందిన కనీసం తొమ్మిది చమురు, ఎల్పీజీ ట్యాంకర్లకు సురక్షిత మార్గం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం దౌత్యపరమైన చర్యలు వేగవంతం చేసింది. బ్లూమ్‌బెర్గ్ కథనం ప్రకారం, ఈ అంశంపై ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరపడంతో పాటు, అక్కడ పనిచేస్తున్న భారతీయ నావికుల భద్రతకు కూడా కేంద్రం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.

హోర్ముజ్‌లో మరోసారి ఉద్రిక్తత.. గల్ఫ్‌లో చిక్కుకున్న భారత ట్యాంకర్లు.. రంగంలోకి దిగిన కేంద్రం
Indian Tankers In Gulf
Balaraju Goud
|

Updated on: Jul 09, 2026 | 11:48 AM

Share

హోర్ముజ్ జలసంధి చుట్టూ మళ్లీ భద్రతా సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో పర్షియన్ గల్ఫ్‌లో చిక్కుకుపోయిన భారత ప్రయోజనాలకు చెందిన కనీసం తొమ్మిది చమురు, ఎల్పీజీ ట్యాంకర్లకు సురక్షిత మార్గం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం దౌత్యపరమైన చర్యలు వేగవంతం చేసింది. బ్లూమ్‌బెర్గ్ కథనం ప్రకారం, ఈ అంశంపై ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరపడంతో పాటు, అక్కడ పనిచేస్తున్న భారతీయ నావికుల భద్రతకు కూడా కేంద్రం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.

హోర్ముజ్ జలసంధిలో మరోసారి భద్రతా పరిస్థితులు దిగజారడంతో ముడి చమురు, ఎల్పీజీని తరలిస్తున్న నౌకల రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ప్రస్తుతం తొమ్మిది ట్యాంకర్లలో మొత్తం 198 మంది భారతీయ నావికులు చిక్కుకుపోయి, జలసంధి గుండా ప్రయాణించేందుకు అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. నౌకల కదలికలను భారత ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని, విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇరాన్ అధికారులతో నేరుగా చర్చలు జరపనుందని నివేదిక పేర్కొంది.

జూన్‌లో ఒమన్ గల్ఫ్‌లో వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు మరణించిన ఘటన తర్వాత కేంద్రం మరింత అప్రమత్తమైంది. ఫిబ్రవరి చివర్లో ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి భారతదేశానికి రావాల్సిన సుమారు 50 నౌకలు హోర్ముజ్ జలసంధిని దాటినప్పటికీ, సాధారణ పరిస్థితులతో పోలిస్తే దిగుమతులు గణనీయంగా తగ్గాయి. సంఘర్షణలకు ముందు భారత ముడి చమురు దిగుమతుల్లో సుమారు 40 శాతం, ఎల్‌ఎన్‌జీ సరఫరాలో 60 శాతం, ఎల్‌పీజీ దిగుమతుల్లో దాదాపు 90 శాతం ఈ జలసంధి ద్వారానే జరిగేవి.

ఇదే సమయంలో అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్ మద్దతుతో జరిగిన నౌకలపై దాడులకు ప్రతీకారంగా అమెరికా 80కిపైగా లక్ష్యాలపై వైమానిక దాడులు జరిపినట్లు ప్రకటించింది. దీనికి ప్రతిస్పందనగా బహ్రెయిన్, కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసినట్లు ఇరాన్ వెల్లడించింది. ఈ పరిణామాల మధ్య అంతర్జాతీయ చమురు సరఫరాపై అనిశ్చితి నెలకొనగా, హోర్ముజ్ జలసంధిలో పరిస్థితులు ఎప్పుడు సాధారణ స్థితికి వస్తాయన్న అంశంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మీ అలవాట్లే మీ భవిష్యత్తు.. బద్ధకం వల్ల ఏం జరుగుతుందో తెలిపే కథ
మీ అలవాట్లే మీ భవిష్యత్తు.. బద్ధకం వల్ల ఏం జరుగుతుందో తెలిపే కథ
మైదానంలోకి హార్దిక్ పాండ్యా రీఎంట్రీ డేట్ ఫిక్స్
మైదానంలోకి హార్దిక్ పాండ్యా రీఎంట్రీ డేట్ ఫిక్స్
శబరిమలలో రోజుకు 5 పడి పూజలు.. 2040 వరకు బుకింగ్స్, కొత్త నిర్ణయం
శబరిమలలో రోజుకు 5 పడి పూజలు.. 2040 వరకు బుకింగ్స్, కొత్త నిర్ణయం
క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్స్ చేసేటప్పుడు అదనంగా 2 శాతం అడుగుత
క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్స్ చేసేటప్పుడు అదనంగా 2 శాతం అడుగుత
ఆయనతో సినిమా చేయడం అంటే హాలీవుడ్ ప్రాజెక్ట్ చేసినట్టే
ఆయనతో సినిమా చేయడం అంటే హాలీవుడ్ ప్రాజెక్ట్ చేసినట్టే
దీని ముందు చికెన్, మటన్ కూడా పనికిరావు.. చిటికెలోనే రెడీ ..
దీని ముందు చికెన్, మటన్ కూడా పనికిరావు.. చిటికెలోనే రెడీ ..
శ్రీ గణేశుడి 108 పవిత్ర నామాలు.. ఒక్కో పేరులో దాగున్న అర్థం ఇదే!
శ్రీ గణేశుడి 108 పవిత్ర నామాలు.. ఒక్కో పేరులో దాగున్న అర్థం ఇదే!
దుమ్ముదుమారం.. 22Aపై చర్చకు బీఆర్ఎస్ డిమాండ్..
దుమ్ముదుమారం.. 22Aపై చర్చకు బీఆర్ఎస్ డిమాండ్..
శంషాబాద్‌లో బుల్లెట్ ట్రైన్ల మెగా హబ్.. ప్రభుత్వం నుంచి అప్డేట్..
శంషాబాద్‌లో బుల్లెట్ ట్రైన్ల మెగా హబ్.. ప్రభుత్వం నుంచి అప్డేట్..
టాక్సిక్ డిజాస్టర్‌పై హీరో యష్ ఫస్ట్ రియాక్షన్..
టాక్సిక్ డిజాస్టర్‌పై హీరో యష్ ఫస్ట్ రియాక్షన్..