హాథ్రస్ ఘటనను సుమోటో కేసుగా స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ
ఉత్తరప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన దారుణమైన ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం సీరియస్సయ్యింది.. సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునే ఆ ఘటనలో 19 ఏళ్ల ఓ దళిత యువతిని అగ్రకులానికి చెందిన నలుగురు వ్యక్తులు...
ఉత్తరప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన దారుణమైన ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం సీరియస్సయ్యింది.. సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునే ఆ ఘటనలో 19 ఏళ్ల ఓ దళిత యువతిని అగ్రకులానికి చెందిన నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి ఆపై తీవ్రంగా హింసించారు.. ఆమె అరవకుండా నాలుక కోసేశారు. వెన్నెముక విరిచేశారు.. ఈ ఘోర ఘటనలో గాయపడిన ఆ దళిత యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.. కాగా, ఈ ఘటనను సుమోటో కేసుగా స్వీకరించినట్టు జాతీయ మానవ హక్కుల సంఘం తెలిపింది.. దీనిపై వివరణ ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర డీజీపీకి నోటీలు జారీ చేసింది.. ఈ దుర్మార్గమైన సంఘటన సెప్టెంబర్ 14న జరిగింది.. తన తల్లి, సోదరుడితో కలిసి గడ్డి కోసం పొలానికి వెళ్లిన యువతి.. ఆపై కనిపించకుండా పోయింది.. తీవ్రగాయాలతో ఆ యువతిని సెప్టెంబర్ 22న కనుగొన్నారు.. బాధితురాలిని మొదట అలీఘడ్లోని జవహర్లాల్ నెహ్రూ కాలేజీ అండ్ హాస్పిటల్లో చేర్పించారు.. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుప్రతిలో చేర్చారు.. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఆమె కన్నుమూసింది. ఈ ఘటనపై దేశం యావత్తు కదిలింది.. నిరసనలు హోరెత్తాయి.. ఆందోళనలు జరుగుతున్నాయి.. ఇంత జరుగుతున్నా బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత యువతి మృతదేహాన్ని ఆమె స్వస్థలానికి తీసుకొచ్చిన పోలీసులు హుటాహుటిన అంత్యక్రియలు నిర్వహించారు.. పోలీసుల చర్యపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..