AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆరు నెలల తర్వాత ఖైదీ ములాఖత్‌కు అనుమతి

కరోనా వ్యాప్తి వల్ల గత ఆరు నెలలుగా నిలిచిపోయిన ఖైదీల ములాఖత్ కు అక్టోబరు 1వ తేదీ నుంచి జైళ్ల శాఖ అధికారులు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది

ఆరు నెలల తర్వాత ఖైదీ ములాఖత్‌కు అనుమతి
Balaraju Goud
|

Updated on: Oct 01, 2020 | 12:21 PM

Share

కరోనా మహమ్మారి దెబ్బకు అన్నిరంగాలు స్తంభించిపోయాయి. బహిరంగ ప్రదేశాల్లో ఉండే వారితో పాటు జైళ్లల్లోని ఖైదీలు సైతం కరోనా బారినపడ్డారు. దీంతో జైళ్లలో నిలిచిన ఖైదీలను కలుసుకునే అవకాశాన్ని నిలిపివేశారు. తాజా కేంద్ర ఆన్ లాక్ ప్రక్రియ ప్రారంభించడంతో ములాఖత్‌లకు ఎట్టకేలకు ఢిల్లీ జైళ్లశాఖ అనుమతించింది. కరోనా వ్యాప్తి వల్ల గత ఆరు నెలలుగా నిలిచిపోయిన ఖైదీల ములాఖత్ కు అక్టోబరు 1వ తేదీ నుంచి జైళ్ల శాఖ అధికారులు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జైళ్లలో ఖైదీలకు కరోనా సోకుతుండటంతో మార్చి 23వ తేదీ నుంచి ఖైదీలను కుటుంబసభ్యులు కలవడంపై నిషేధించారు. అయితే, తమ కుటుంబసభ్యులను కలిసేందుకు తమను అనుమతించాలని కోరుతూ గత రెండు నెలలుగా పలువురు ఖైదీలు జైలు అధికారులకు లేఖలు రాశారు. దీంతో స్పందించిన ఢిల్లీ జైళ్ల శాఖ ఖైదీల మిలాఖత్ కు ఒకే చెప్పింది.

ఖైదీలను కలిసేందుకు వచ్చే కుటుంబసభ్యులు వారికోసం కొత్త బట్టలు తీసుకురావాలని జైలు అధికారులు సూచిస్తున్నారు. ఢిల్లీలోని మూడు జైళ్లలో 14వేల మంది ఖైదీలున్నారు. ఒక ఖైదీ నెలకు ఒకసారి వారి కుటుంబసభ్యుడిని కలిసేందుకు అనుమతిస్తారు. ఖైదీల ములాఖత్ కోసం వచ్చేవారు కచ్చితంగా కొవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. జైలు వద్ద సందర్శకులకు థర్మల్ స్కాన్ నిర్వహించిన అనంతరం కలుసుకునేందుకు అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు. ఇదిలావుంటే, ఢిల్లీలోని తిహార్, మండోలి, రోహిణి జైళ్లలో 83 మంది ఖైదీలు, 207 మంది జైలు ఉద్యోగులకు కరోనా సోకిందని జైళ్ల శాఖ తెలిపింది.

Follow Us
ఉచిత గ్యాస్ సిలిండర్ల లబ్దిదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఉచిత గ్యాస్ సిలిండర్ల లబ్దిదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
ముంచుకొస్తున్న కొత్త తుఫాన్! తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!
ముంచుకొస్తున్న కొత్త తుఫాన్! తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!
థియేటర్లను షేక్ చేసిన సినిమా.. ఇప్పటికీ తగ్గని డిమాండ్..
థియేటర్లను షేక్ చేసిన సినిమా.. ఇప్పటికీ తగ్గని డిమాండ్..
వినాయకచవితి ప్రసాదం.. కిలో బియ్యంతో టేస్టీ టొమాటో రైస్ ఇలా చేయండి
వినాయకచవితి ప్రసాదం.. కిలో బియ్యంతో టేస్టీ టొమాటో రైస్ ఇలా చేయండి
గణేశుడిని విందుకు పిలిచిన కుబేరుడు.. ఆ తర్వాత జరిగినది ఊహించలేరు!
గణేశుడిని విందుకు పిలిచిన కుబేరుడు.. ఆ తర్వాత జరిగినది ఊహించలేరు!
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
మీరు Flipkartలో ఎక్కువగా షాపింగ్‌ చేస్తారా? మీకో భారీ గుడ్‌న్యూస్
మీరు Flipkartలో ఎక్కువగా షాపింగ్‌ చేస్తారా? మీకో భారీ గుడ్‌న్యూస్
సౌందర్య ఇంటి ఎంట్రన్స్ లో అది చూడగానే తట్టుకోలేకపోయా..
సౌందర్య ఇంటి ఎంట్రన్స్ లో అది చూడగానే తట్టుకోలేకపోయా..
గణేష్ మండపాల నిర్వాహకులకు గుడ్ న్యూస్.. డీజేలపై ఏపీ సర్కార్ కీలక
గణేష్ మండపాల నిర్వాహకులకు గుడ్ న్యూస్.. డీజేలపై ఏపీ సర్కార్ కీలక
రైతన్నలకు బిగ్‌ అలర్ట్.. ఇలా చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు రానట్టే
రైతన్నలకు బిగ్‌ అలర్ట్.. ఇలా చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు రానట్టే