AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హరీష్ రాణా కన్నుమూత.. కారుణ్య మరణం అనుమతి పొందిన తొలి భారతీయుడి కథ!

సుదీర్ఘకాలం పాటు కోమాలో ఉన్న హరీష్ రాణా మరణం భారతదేశ వైద్య మరియు న్యాయ చరిత్రలో ఒక కీలక ఘట్టంగా నిలిచిపోతుంది. 13 ఏళ్ల క్రితం నాలుగో అంతస్తు నుండి పడిపోయిన హరీష్, అప్పటి నుండి పర్సిస్టెంట్ వెజిటేటివ్ స్టేట్ (PVS) లోనే ఉన్నారు. తన కుమారుడి బాధను చూడలేక, గౌరవప్రదమైన మరణాన్ని ప్రసాదించాలని అతని తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు 'రైట్ టు డై విత్ డిగ్నిటీ' (గౌరవంగా మరణించే హక్కు) పై దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

హరీష్ రాణా కన్నుమూత.. కారుణ్య మరణం అనుమతి పొందిన తొలి భారతీయుడి కథ!
Harish Rana
Jyothi Gadda
|

Updated on: Mar 24, 2026 | 7:10 PM

Share

భారతదేశంలో ‘కారుణ్య మరణం’ (Euthanasia) పై దశాబ్దాలుగా జరుగుతున్న చర్చకు హరీష్ రాణా కేసు ఒక ముగింపు పలికింది. 13 ఏళ్ల పాటు అచేతన స్థితిలో ఉండి, చివరకు కోర్టు ద్వారా గౌరవప్రదమైన మరణానికి అనుమతి పొందిన హరీష్ రాణా మృతి చెందారు. సుదీర్ఘకాలం పాటు కోమాలో ఉన్న హరీష్ రాణా మరణం భారత వైద్య, న్యాయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఈ కేసు వివరాలు, దీని వెనుక ఉన్న చట్టపరమైన అంశాలను ఇక్కడ చూద్దాం.

సుదీర్ఘకాలం పాటు కోమాలో ఉన్న హరీష్ రాణా మరణం భారతదేశ వైద్య, న్యాయ చరిత్రలో ఒక కీలక ఘట్టంగా నిలిచిపోతుంది. ఢిల్లీ సమీపంలోని గాజియాబాద్‌కు చెందిన 32 ఏళ్ల హరీశ్‌ రాణా (Harish Rana) 2013లో పంజాబ్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ చదువుతున్న సమయంలో ప్రమాదవశాత్తు నాలుగో అంతస్తు నుండి కింద పడిపోయారు. అప్పటి నుండి ఆయన మెదడు పనితీరు దెబ్బతిని, ఎవరినీ గుర్తించలేని, మాట్లాడలేని స్థితికి చేరుకున్నారు. తన కుమారుడి పరిస్థితి చూసి తల్లడిల్లిన తల్లిదండ్రులు, అతడిని ఈ నరకం నుండి విముక్తి చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు.

చాలామందికి కారుణ్య మరణం అనగానే విషపు ఇంజక్షన్ ఇవ్వడం (Active Euthanasia) అని భావిస్తారు. కానీ అది భారత్‌లో చట్టవిరుద్ధం. అయితే, నిష్క్రియ కారుణ్య మరణం అనేది భిన్నమైనది. ఇది రోగి ప్రాణాలను నిలిపి ఉంచే కృత్రిమ శ్వాస (Ventilator) లేదా ఫీడింగ్ ట్యూబ్‌లను తొలగించే ప్రక్రియ. సుప్రీంకోర్టు 2018లో ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు ప్రకారం, కోలుకునే అవకాశం లేని రోగులకు ఈ హక్కు ఉంటుంది.

ఢిల్లీ హైకోర్టు చారిత్రాత్మక అనుమతి: హరీష్ రాణా కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా, హరీష్ కోలుకునే అవకాశం సున్నా అని నిర్ధారించి, అతడికి నిష్క్రియ కారుణ్య మరణం అమలు చేయడానికి అనుమతినిచ్చింది. భారతదేశంలో ఒక వ్యక్తికి ఇలాంటి అనుమతి లభించడం ఇదే తొలిసారి. ఈ తీర్పు అనంతరం మార్చి 14న రాణాను గాజియాబాద్‌లోని ఇంటి నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. అప్పటి నుంచి వైద్యులు కోర్టు తీర్పు ప్రక్రియ అమలులో భాగంగా చికిత్సను దశలవారీగా తగ్గించారు. ఈ క్రమంలోనే అతడు తుదిశ్వాస విడిచాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us