AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఓ దోషి పాలిట శాపంగా మారింది.. బెయిల్ వచ్చినా మూడేళ్లు జైళ్లోనే..

జైలు అధికారులు కోర్టు పంపిన ఆర్డర్ కాపీలను మెయిల్‌లో ఓపెన్ చేయలేదనే విషయం బయటపడింది. దీనికారణంగా చందన్ ఠాకూర్‌ అదనంగా మూడేళ్లపాటు జైల్లో మగ్గిపోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని కోర్టు సీరియస్‌గా తీసుకుంది. జైలు అధికారుల నిర్లక్ష‍్యానికి రూ.లక్ష రూపాయల జరిమానా విధించింది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఓ దోషి పాలిట శాపంగా మారింది.. బెయిల్ వచ్చినా మూడేళ్లు జైళ్లోనే..
Court Order
Jyothi Gadda
|

Updated on: Sep 27, 2023 | 9:49 PM

Share

నేరస్థుడిగా ఉన్న వ్యక్తికి 2020లోనే గుజరాత్ హైకోర్టులో బెయిల్ వచ్చింది. ఆయనకు బెయిల్‌ వచ్చిందన్న వార్త హైకోర్టు రిజిస్ట్రీ నుంచి జైలుకు సంబంధించిన ఈమెయిల్‌కు కూడా చేరింది. అయితే ఈ బెయిల్ ఆర్డర్ పీడీఎఫ్ కాపీని జైలు అధికారులు తెరవలేకపోయారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది..దీంతో రోజులు గడిచిపోయాయి. సరిగ్గా మూడేళ్లు గడిచిన తర్వాత నిందితుడు బెయిల్ కోసం మళ్లీ కోర్టును ఆశ్రయించడంతో ఈ కేసు మళ్లీ కోర్టు దృష్టికి వచ్చింది. ఈసారి అధికారులు తమ సమాధానం చెప్పారు. నిర్లక్ష్యానికి పాల్పడినందుకు జైలు అధికారులను మందలించిన కోర్టు.. దోషికి రూ.లక్ష పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.

హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 27 ఏళ్ల దోషి చందన్‌ జీ ఠాకోర్ సెప్టెంబర్ 29, 2020న అతని శిక్షను తాత్కాలికంగా నిలిపివేసింది. హైకోర్టు రిజిస్ట్రీ వెంటనే ఈ నిర్ణయాన్ని జైలు అధికారులకు ఇమెయిల్ ద్వారా తెలియజేసింది. అయితే, కోవిడ్-19 మహమ్మారి కారణంగా, అటాచ్‌మెంట్‌ను తెరవడంలో అసమర్థత కారణంగా, ఆర్డర్ అమలు చేయబడలేదు. బెయిల్‌ కోసం అతడు మరోమారు కోర్టును ఆశ్రయించగా.. విషయం వెలుగులోకి వచ్చింది. జైలు అధికారులు కోర్టు పంపిన ఆర్డర్ కాపీలను మెయిల్‌లో ఓపెన్ చేయలేదనే విషయం బయటపడింది. దీనికారణంగా చందన్ ఠాకూర్‌ అదనంగా మూడేళ్లపాటు జైల్లో మగ్గిపోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని కోర్టు సీరియస్‌గా తీసుకుంది. జైలు అధికారుల నిర్లక్ష‍్యానికి రూ.లక్ష రూపాయల జరిమానా విధించింది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

అతడి బెయిల్ గురించి హైకోర్టు రిజిస్ట్రీ నుంచి ఈ-మెయిల్ ద్వారా జైలు అధికారులకు సమాచారం అందింది. కానీ కోవిడ్ -19 మహమ్మారి కారణంగా, ఇ-మెయిల్ జైలు అధికారులు ఓపెన్ చేయలేకపోవటంతో.. కోర్టు ఆదేశాలను వారు అమలు చేయలేకపోయారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా అవసరమైన చర్యలు తీసుకోలేకపోయామని, ఈమెయిల్ వచ్చినప్పటికీ పీడీఎఫ్ తెరవలేకపోయామని జైలు అధికారులు కోర్టుకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

వివిధ కారణాల వల్ల బెయిల్ మంజూరైనా కస్టడీలో ఉన్న ఖైదీల వివరాలను సేకరించాలని అన్ని జిల్లా న్యాయ సేవల అధికారులను (డిఎల్‌ఎస్‌ఎ) కోర్టు ఆదేశించింది. ఆదేశాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని అక్టోబర్ 18న విచారణకు లిస్ట్ చేస్తున్నప్పుడు కోర్టు అధికారులకు అదే విధంగా ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని  జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
పిస్తా vs పల్లీలు.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..? నిపుణుల నిజాలు ఇవే
పిస్తా vs పల్లీలు.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..? నిపుణుల నిజాలు ఇవే
తీవ్ర విషాదం.. ముగ్గురు సజీవదహనం!
తీవ్ర విషాదం.. ముగ్గురు సజీవదహనం!
రూ.7,500 తగ్గిన బంగారం ధర.. తాజాగా హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..!
రూ.7,500 తగ్గిన బంగారం ధర.. తాజాగా హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..!
బ్యాంక్ లోన్ కావాలా? ఇకపై సిబిల్ ఒక్కటి సరిపోదు.. ఇవి మ్యాండేటరీ
బ్యాంక్ లోన్ కావాలా? ఇకపై సిబిల్ ఒక్కటి సరిపోదు.. ఇవి మ్యాండేటరీ
సోమవతి అమావాస్య రోజు ఈ తప్పులు చేయొద్దు.. లేదంటే లక్ష్మీదేవి..
సోమవతి అమావాస్య రోజు ఈ తప్పులు చేయొద్దు.. లేదంటే లక్ష్మీదేవి..
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా