అయిల్ కంపెనీలకు సర్కార్ షాక్.. లీటర్కు రూ. 2 చొప్పున పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ పెంపు!
పెట్రోల్ , డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీని రూ.2 పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన ధరలు సోమవారం(ఏప్రిల్ 7) అర్ధరాత్రి 12 గంటల నుంచి అమల్లోకి వస్తాయి. అయితే ఎక్సైజ్ సుంకం ఆయిల్ కంపెనీలే భరిస్తాయని, పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సామాన్యుడిపై ఎలాంటి భారం ఉండదని తెలిపింది.

పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ పెంచింది కేంద్రం. పెట్రోల్ , డీజిల్ ధరలను లీటర్కు రెండు రూపాయల చొప్పున పెంచారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ , డీజిల్ సుంకాన్ని పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ , డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీని రూ.2 పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన ధరలు ఇవాళ సోమవారం(ఏప్రిల్ 7) అర్ధరాత్రి 12 గంటల నుంచి అమల్లోకి వస్తాయి. అయితే ఎక్సైజ్ సుంకం ఆయిల్ కంపెనీలే భరిస్తాయని, పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సామాన్యుడిపై ఎలాంటి భారం ఉండదని తెలిపింది.
దేశవ్యాప్తంగా అయిల్ కంపెనీలకు షాకిచ్చింది కేంద్ర సర్కార్. ప్రజలపై మళ్లీ పెట్రోల్ బాంబు పడింది. పెట్రోల్ , డీజిల్ ధరలను లీటర్కు రెండు రూపాయల చొప్పున పెంచారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ , డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.2 పెంచింది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు సోమవారం(ఏప్రిల్ 7) అర్ధరాత్రి 12 గంటల నుంచి వర్తిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం , భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు విధించిన తరువాత కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఎక్సైజ్ సుంకం నేరుగా సామాన్యుడి జేబుపై భారం పడదని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర తగ్గింది. దీని దృష్ట్యా ప్రభుత్వం భారత్ పెట్రోలియం, రిలయన్స్, హిందూస్తాన్ పెట్రోలియం వంటి పెట్రోలియం కంపెనీలపై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.2 పెంచింది. ఇప్పుడు ఆ దేశ చమురు కంపెనీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిందా లేదా ప్రస్తుత ధరలకే ప్రజలకు పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తూనే ఉందా అనేది చూడాలి.
PSU Oil Marketing Companies have informed that there will be no increase in retail prices of #Petrol and #Diesel, subsequent to the increase effected in Excise Duty Rates today.#MoPNG
— Ministry of Petroleum and Natural Gas #MoPNG (@PetroleumMin) April 7, 2025
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర గత కొన్ని రోజులుగా 15 శాతం తగ్గింది. ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్లో 1 బ్యారెల్ ముడి చమురు ధర $63.34, ఇది దాని అత్యల్ప స్థాయి. అటువంటి పరిస్థితిలో, దేశంలో పెట్రోల్, డీజిల్ సరఫరా చేసే కంపెనీల లాభాలు పెరిగాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకోవాలని నిర్ణయించింది. పెట్రోల్ ,డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.2 పెంచింది.
చమురు కంపెనీలు చివరిసారిగా మార్చి 15న పెట్రోల్, డీజిల్ ధరలను మార్చాయి. ఆ సమయంలో, దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్, డీజిల్ ధరలను రూ.2 తగ్గించారు. అప్పటి నుండి, దేశంలోని నాలుగు మెట్రో నగరాలలో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.2 తగ్గాయి. ప్రస్తుతం ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.100 కంటే తక్కువగా ఉంది. చెన్నై, కోల్కతా, ముంబైలలో పెట్రోల్ ధర రూ.100 కంటే ఎక్కువగా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




