AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liquor Bottle: మందు పార్టీలో మిగిలిపోయిన మద్యం బాటిల్స్‌ తీసుకెళ్లిన ఫ్రెండ్.. అక్కసుతో హత్య చేసిన స్నేహితుడు

ఓ వ్యక్తి తన స్నేహితులందరినీ పిలిచి గ్రాండ్‌గా మందు పార్టీ ఇచ్చాడు. ఈ తర్వాత పార్టీలో మిగిలిన మద్యం బాటిల్స్‌ను అతని ఫ్రెండ్స్‌లో ఓ వ్యక్తి తనతోపాటు తీసుకెళ్లాడు. దీనిపై ఆగ్రహించిన మరో స్నేహితుడు అదను చూసి అతడిని దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన గోవాలో వారం క్రితం చోటు చేసుకోగా బుధవారం (జులై 3) వెలుగులోకి..

Liquor Bottle: మందు పార్టీలో మిగిలిపోయిన మద్యం బాటిల్స్‌ తీసుకెళ్లిన ఫ్రెండ్.. అక్కసుతో హత్య చేసిన స్నేహితుడు
Friend Kills Man For Liquor
Srilakshmi C
|

Updated on: Jul 04, 2024 | 7:18 PM

Share

పనాజీ, జులై 4: ఓ వ్యక్తి తన స్నేహితులందరినీ పిలిచి గ్రాండ్‌గా మందు పార్టీ ఇచ్చాడు. ఈ తర్వాత పార్టీలో మిగిలిన మద్యం బాటిల్స్‌ను అతని ఫ్రెండ్స్‌లో ఓ వ్యక్తి తనతోపాటు తీసుకెళ్లాడు. దీనిపై ఆగ్రహించిన మరో స్నేహితుడు అదను చూసి అతడిని దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన గోవాలో వారం క్రితం చోటు చేసుకోగా బుధవారం (జులై 3) వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే..

దక్షిణ గోవాలోని కోర్టాలిమ్ గ్రామంలో మంగళవారం అర్థరాత్రి నిర్మాణంలో ఉన్న ఓ స్థలంలో ఒక వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని లియోనెల్ లోబో (32)గా గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించగా.. అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వారం రోజుల క్రితం జరిగిన ఓ మందు పార్టీలో మిగిలిపోయిన మద్యం బాటిల్‌లను లియోనెల్ లోబో తనతోపాటు తీసుకెళ్లాడట. దీంతో ఆగ్రహించిన తోటి స్నేహితుడు కౌటిన్హో.. లియోనెల్ లోబో (32) నిర్మాణంలో ఉన్న స్థలంలో నిద్రిస్తున్న సమయంలో హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఘటనలో నిందితుడు కౌటిన్హోని పోలీసులు అరెస్టు చేశారు.

అనంతరం నిందితుడ్ని పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా ఫ్రెండ్‌ను తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. గత వారం జరిగిన మందు పార్టీలో మిగిలిన మద్యం బాటిల్స్‌ను స్నేహితుడు తీసుకెళ్లడంతో ఆగ్రహానికి గురైనట్లు కౌటిన్హో పోలీసులకు తెలిపాడు. మంగళవారం రాత్రి నిద్రిస్తున్న లోబో తలపై సిమెంట్‌ దిమ్మతో కొట్టి హత్య చేసినట్లు పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించాడు. అంతేకాకుండా నిందితుడు అలెక్స్ దుస్తులపై మృతుడి రక్తం మరకలు ఉన్నట్లు ఫోరెన్సిక్ పరీక్ష ద్వారా నిర్ధారనైంది. ఈ నేపథ్యంలో జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ కోడ్ భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) కింద కేసు నమోదు చేసి నిందితుడ్ని అరెస్ట్‌ చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ (సౌత్) సునీతా సావంత్ బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

వాంఖడే సాక్షిగా చరిత్ర సృష్టించిన సూర్య..కోహ్లీ రికార్డ్ బ్రేక్
వాంఖడే సాక్షిగా చరిత్ర సృష్టించిన సూర్య..కోహ్లీ రికార్డ్ బ్రేక్
మద్యం మత్తులో దారుణం.. పెట్రోల్‌ పోసి యువకుడి హత్య!
మద్యం మత్తులో దారుణం.. పెట్రోల్‌ పోసి యువకుడి హత్య!
వాలెంటైన్స్ డే.. భారీగా హోటల్‌ రూమ్‌ బుకింగ్స్‌!
వాలెంటైన్స్ డే.. భారీగా హోటల్‌ రూమ్‌ బుకింగ్స్‌!
టీమిండియా వరల్డ్ రికార్డ్.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ సంచలనం
టీమిండియా వరల్డ్ రికార్డ్.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ సంచలనం
ఓటీటీలో రవితేజ సంక్రాంతి హిట్ సినిమా.. ' స్ట్రీమింగ్ డేట్ ఇదే
ఓటీటీలో రవితేజ సంక్రాంతి హిట్ సినిమా.. ' స్ట్రీమింగ్ డేట్ ఇదే
ప్రేమపెళ్లి చేసుకుని తప్పుచేశా.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి సూసైడ్
ప్రేమపెళ్లి చేసుకుని తప్పుచేశా.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి సూసైడ్
టాప్‌-10 బెస్ట్‌ సెల్లింగ్‌ బైక్‌లు, స్కూటర్లు.. ధర ఎంతో తెలుసా?
టాప్‌-10 బెస్ట్‌ సెల్లింగ్‌ బైక్‌లు, స్కూటర్లు.. ధర ఎంతో తెలుసా?
జీతాల పెంపు కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్‌!
జీతాల పెంపు కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్‌!
హోమ్‌వర్క్‌ చేయలేదనీ.. 2వ తరగతి పిల్లాడిని చితకబాదిన టీచర్‌!
హోమ్‌వర్క్‌ చేయలేదనీ.. 2వ తరగతి పిల్లాడిని చితకబాదిన టీచర్‌!
కేవలం 300 సెకన్లలో రూ.2700 కోట్ల చారిత్రాత్మక డీల్ చేశారట..!
కేవలం 300 సెకన్లలో రూ.2700 కోట్ల చారిత్రాత్మక డీల్ చేశారట..!