Crime news: తనపై అత్యాచారం చేసిన వాడే చెల్లినీ వేధించాడు.. విషయం తెలుసుకున్న అక్క ఏం చేసిందంటే

చదువుకునే రోజుల్లో ఓ ఉపాధ్యాయుడి చేతిలో అత్యాచారానికి (Rape) గురైంది ఓ బాలిక. ఈ విషయం ఇంట్లో తెలిస్తే పరువు పోతుందని భావించి ఎవరికీ ఏమీ చెప్పలేదు. దీన్ని అలుసుగా తీసుకున్న ఆ కామాంధుడు బాలికపై మరోసారి...

Crime news: తనపై అత్యాచారం చేసిన వాడే చెల్లినీ వేధించాడు.. విషయం తెలుసుకున్న అక్క ఏం చేసిందంటే
Student Harassment
Follow us

|

Updated on: Mar 15, 2022 | 3:25 PM

చదువుకునే రోజుల్లో ఓ ఉపాధ్యాయుడి చేతిలో అత్యాచారానికి (Rape) గురైంది ఓ బాలిక. ఈ విషయం ఇంట్లో తెలిస్తే పరువు పోతుందని భావించి ఎవరికీ ఏమీ చెప్పలేదు. దీన్ని అలుసుగా తీసుకున్న ఆ కామాంధుడు బాలికపై మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన బాలిక.. చదువు మానేసి తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు ఓ సంచలన విషయం తెలిసింది. తనపై అత్యాచారం చేసిన వాడే తన సోదరిని లైంగికంగా వేధిస్తున్నాడని తెలిసి తీవ్ర కోపంతో రగిలిపోయింది. వెంటనే తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వారి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజస్థాన్(Rajasthan)​ నాగౌర్​ జిల్లాకు చెందిన ఓ బాలిక 2018లో తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలో హరిరామ్​అనే వ్యక్తి చేతిలో అత్యాచారానికి గురైంది. ఖాళీగా ఉన్న ఓ తరగతి గదిలో బాలికను తీసుకెళ్లి అతడు ఈ దురాగతానికి పాల్పడ్డాడు. పదో తరగతి చదివే సమయంలోనూ మరోసారి అత్యాచారం చేశాడు. అప్పటి నుంచి తీవ్ర భయాందోళనకు గురైన బాధిత బాలిక..మానసిక క్షోభను అనుభవిస్తూ ఇంట్లోనే తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది.

ఈ క్రమంలో.. ఈ ఏడాది మార్చి 5న అదే ఉపాధ్యాయుడు బాధితురాలి సోదరిని లైంగికంగా వేధించాడు. దీంతో తీవ్ర భావోద్వేగానికి గురైన బాలిక.. గతంలో తనకు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పింది. బంధువులతో కలిసి నాగౌర్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also  Read

AP Politics: ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. యాభై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లు గల్లంతేనా? సీఎం నిఘాలో ఉన్నదెవరు?

ఆమ్నా షరీఫ్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్

IPL 2022: ఐపీఎల్ టీమ్స్ కు అలెర్ట్.. కొత్త నిబంధనలు ప్రకటించిన బీసీసీఐ.. పూర్తి వివరాలివే..