India-China: లడఖ్‌లో ప్రతిష్టంభన తర్వాత తొలిసారిగా ఢిల్లీకి చైనా విదేశాంగ మంత్రి.. మరికాసేపట్లో కేంద్రమంత్రితో భేటీ

చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ గురువారం భారత్‌కు వచ్చారు. శుక్రవారం విదేశాంగ మంత్రి డాక్టర్ S జైశంకర్ () NSA అజిత్ దోవల్‌తో సమావేశమవుతారు.

India-China: లడఖ్‌లో ప్రతిష్టంభన తర్వాత తొలిసారిగా ఢిల్లీకి చైనా విదేశాంగ మంత్రి.. మరికాసేపట్లో కేంద్రమంత్రితో భేటీ
India China
Follow us

|

Updated on: Mar 25, 2022 | 9:33 AM

India-China talks: చైనా విదేశాంగ మంత్రి(Chinese Foreign Minister) వాంగ్ యీ(Wang Yi ) గురువారం భారత్‌కు వచ్చారు. శుక్రవారం విదేశాంగ మంత్రి డాక్టర్ S జైశంకర్ (External Affairs Minister S Jaishankar) జాతీయ భద్రతా సలహాదారు (National Security Advisor ) అజిత్ దోవల్‌తో సమావేశమవుతారు.. మే 2020లో తూర్పు లడఖ్‌లో ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతల తర్వాత చైనా సీనియర్ నాయకుడు భారత్‌కు రావడం ఇదే తొలిసారి. ప్రయాణ ప్రతిపాదన చైనా నుండి వచ్చింది. వాంగ్ యీ తన నాలుగు దేశాల పర్యటనలో భాగంగా నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్‌లను కూడా వెళ్లనున్నారు. ఇందులో భాగంగా రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం వాంగ్ మార్చి 26న నేపాల్ రాజధానికి చేరుకోనున్నట్లు నేపాల్ ‘ఖాట్మండు పోస్ట్’ పేర్కొంది. అంతకుముందు, పాకిస్తాన్‌లో జరిగిన ఓఐసీ సమావేశంలో జమ్మూ కాశ్మీర్‌పై చైనా చేసిన ప్రకటనలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది.

గత ఒకటిన్నర సంవత్సరాల్లో, తూర్పు లడఖ్‌లో ఉద్రిక్తతలను తగ్గించడానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, వాంగ్ యీ ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మాస్కో , దుషాన్‌బేలో అనేక రౌండ్ల చర్చలు జరిపారు. సెప్టెంబరు 2020లో జైశంకర్, వాంగ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) శిఖరాగ్ర సమావేశం సందర్భంగా మాస్కోలో విస్తృతమైన చర్చలు జరిపారు. ఈ సమయంలో వారు తూర్పు లడఖ్ సరిహద్దు ప్రతిష్టంభనను పరిష్కరించడానికి ఐదు పాయింట్ల ఒప్పందానికి వచ్చారు. దళాలను ముందస్తుగా ఉపసంహరించుకోవడం, ఉద్రిక్తత పెంచే చర్యలను నివారించడం, సరిహద్దు నిర్వహణపై అన్ని ఒప్పందాలు, ప్రోటోకాల్‌లకు కట్టుబడి ఉండటం, వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంట శాంతిని పునరుద్ధరించే చర్యలు ఇందులో ఉన్నాయి.

సరిహద్దు రేఖపై దృష్టి సారించిన మరో SCO సమావేశం సందర్భంగా ఇరు దేశాల విదేశాంగ మంత్రులు గత ఏడాది జూలైలో తజికిస్తాన్ రాజధాని నగరం దుషాన్‌బేలో ద్వైపాక్షిక సమావేశాన్ని కూడా నిర్వహించారు. వారు సెప్టెంబర్‌లో దుషాన్‌బేలో మళ్లీ కలుసుకున్నారు. ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర అభివృద్ధికి వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వెంబడి శాంతి చాలా ముఖ్యమైనదని భారతదేశం స్థిరంగా నొక్కి చెబుతోంది. గత వారం, విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా మరోసారి ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

మన సంబంధాల అభివృద్ధికి సరిహద్దు ప్రాంతాల్లో శాంతి అవసరమని చైనాకు స్పష్టం చేశామని ష్రింగ్లా చెప్పారు. భారతదేశం చైనా సంబంధాల అభివృద్ధి పరస్పర గౌరవం, పరస్పర సున్నితత్వం, పరస్పర ఆసక్తిపై ఆధారపడి ఉండాలి. ఇదే అంశానికి సంబంధించి ఈ నెల ప్రారంభంలో, వాంగ్ అమెరికాకు పరోక్ష సూచన చేశారు. చైనా భారతదేశం మధ్య ఉద్రిక్తత సృష్టించడానికి కొన్ని శక్తులు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. మార్చి 11న, తూర్పు లడఖ్ ప్రాంతంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి భారత్ చైనా 15వ రౌండ్ ఉన్నత స్థాయి సైనిక చర్చలను నిర్వహించాయి.

అంతకుముందు, పాకిస్తాన్‌లో జరిగిన ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) సమావేశంలో జమ్మూ మరియు కాశ్మీర్‌పై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి చేసిన ప్రకటనను భారత్ తీవ్రంగా ఖండించింది. అదే సమయంలో, జమ్మూ కశ్మీర్‌కు సంబంధించిన అంశాలు పూర్తిగా దేశ అంతర్గత వ్యవహారాలని భారత్ పేర్కొంది. ఓఐసీ సమావేశంలో వాంగ్ జమ్మూ కాశ్మీర్ ప్రస్తావనకు సంబంధించి విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మాట్లాడుతూ, ప్రారంభ సెషన్‌లో ప్రసంగం సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారతదేశం గురించి అనవసరంగా ప్రస్తావించడాన్ని మేము తిరస్కరిస్తున్నామన్నారు. జమ్మూ కశ్మీర్ విషయంలో ఇతర దేశాల జోక్యాన్ని ఏమాత్రం సహించబోమన్నారు.

Read Also… Danger Fish video: కోనసీమలో విషపూరిత చేప ప్రత్యక్షం.. దీని యాక్టింగ్‌ చూస్తే షాక్‌ అవుతారు.!(వీడియో)

నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!