AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Azadi Ka Amrit Mahotsav: ఆగస్టు 15న ఏ సమయంలో జెండా ఎగురవేయాలి?.. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలివే..

దేశ రాజధాని ఢిల్లీలో ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఉత్సాహంతో, దేశభక్తి పెంపొదించే మార్గంలో జరుపుకుంటారు. ఈ రోజున రాజధాని మొత్తం త్రివర్ణపతాకంలో..

Azadi Ka Amrit Mahotsav: ఆగస్టు 15న ఏ సమయంలో జెండా ఎగురవేయాలి?.. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలివే..
Indian Flag
Jyothi Gadda
|

Updated on: Aug 14, 2022 | 8:07 PM

Share

Azadi Ka Amrit Mahotsav: 15 ఆగస్టు 2022న జెండా ఎగురవేసే సమయం:భారత దేశ స్వాతంత్ర్య దినోత్సవంను ఏటా ఆగష్టు 15న దేశం యావత్తు జరుపుకుంటుంది.అందుకే ఆగస్టు 15 జాతీయ సెలవుదినం. 2022 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, దేశంలోని వివిధ ప్రాంతాలలో జాతీయ జెండా ఎగురవేసి, కవాతులు, సాంస్కృతిక కార్యక్రమాలతో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారత ప్రధాని ఎర్రకోట ప్రాకారంపై జాతీయ జెండా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు..అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అయితే ఈ సారి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్రహోం మంత్రిత్వ శాఖ ఆయా రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు సూచనలు చేసింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల మార్గదర్శకాలు విడుదల చేసింది.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, రాష్ట్ర రాజధానులు/జిల్లా ప్రధాన కార్యాలయం/సబ్ డివిజన్లు/బ్లాక్‌లు/గ్రామ పంచాయతీలు/గ్రామాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు/జాతీయ జెండాను ఎగురవేసే ప్రక్రియ ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం కావాలి.

ఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఎర్రకోట వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఏటా ఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు చాలా ఘనంగా ఉత్సాహంగా ప్రారంభం అవుతాయి. కేంద్రం జారీ చేసిన గైడ్‌లైన్స్ ప్రకారం ఎర్రకోట వద్ద వేడుకల షెడ్యూల్ ఇలాగుంది. * సాయుధ బలగాలు మరియు ఢిల్లీ పోలీసుల నుంచి ప్రధాన మంత్రి మోదీ గౌరవ వందనం స్వీకరిస్తారు * ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించడం జరుగుతుంది. ఆ తర్వాత 21 తుపాకులతో గౌరవ వందనం చేయడం జరుగుతుంది * భారత వైమానిక దళానికి చెందిన హెలికాఫ్టర్లతో పూల వర్షం కురిపిస్తారు * ప్రధాన మంత్రి ప్రసంగం ఉంటుంది. ఆ వెంటనే జాతీయ గీతం ఆలపిస్తారు. ఆ తర్వాత చివరిగా మూడు రంగుల బెలూన్లను గాల్లోకి వదులుతారు.

ఇవి కూడా చదవండి

దేశ రాజధాని ఢిల్లీలో ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఉత్సాహంతో, దేశభక్తి పెంపొదించే మార్గంలో జరుపుకుంటారు. ఈ రోజున రాజధాని మొత్తం త్రివర్ణపతాకంలో అలక. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎర్రకోటలో ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఇలా జరగనున్నాయి.

  • సాయుధ బలగాలు, ఢిల్లీ పోలీసుల నుంచి ప్రధాన మంత్రి మోడీ గౌరవ వందనం స్వీకరిస్తారు
  • జాతీయ జెండాను ఎగురవేయడంతో పాటు జాతీయ గీతం ఆలపించడం జరుగుతుంది. ఆ తర్వాత 21 గన్ సెల్యూట్ నిర్వహిస్తారు.
  • భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్లు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో విన్యాసాలు చేయనున్నాయి. జాతీయ జెండాపై పూల వర్షం కురిపిస్తారు.
  • అనంతరం ప్రధానమంత్రి ప్రసంగం ఉంటుంది. ప్రధాని ప్రసంగం ముగిసిన వెంటనే జాతీయ గీతం ప్లే చేయబడి, చివరగా త్రివర్ణ బెలూన్‌లను గాల్లోకి వదులుతారు.

హోమ్ ఫంక్షన్ ‘ఎట్ హోమ్’ కార్యక్రమం సాయంత్రం (ఐదు తర్వాత) గవర్నర్/ఎల్‌జీ హౌస్‌లో ప్రారంభం కావచ్చు. ఈ వేడుకకు ఆహ్వానితులను సాధారణ ప్రోటోకాల్ ఆధారంగా హాజరుకానున్నారు.

‘హర్ ఘర్ తిరంగ’ ప్రచారం పౌరులు తమ ఇళ్లలో జాతీయ జెండాను ఎగురవేయడాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం హర్ ఘర్ త్రివర్ణ ప్రచారాన్ని ప్రారంభించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కింద హర్ ఘర్ త్రివర్ణ ప్రచారం ప్రజల హృదయాలలో దేశభక్తి భావాన్ని నింపడం, దేశ నిర్మాణం కోసం అవిశ్రాంతంగా పనిచేసిన వారి సహకారాన్ని గుర్తు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రచారంలో భాగంగా,.. ఆగష్టు 13 నుంచి 15 వరకు దేశ పౌరులందరూ త్రివర్ణ పతాకాన్ని తమ ఇళ్లపై ఎగురవేసేలా ప్రోత్సహించాలని కేంద్రం పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి