విదేశీ మారకంపై ఇకపై అదనపు పన్ను.. రేపట్నించే అమలు

|

Sep 30, 2020 | 5:55 PM

విదేశాల్లో మీ పిల్లలు చదువుకుంటున్నారా? వారికి డబ్బు పంపాలా ? ఇప్పటి వరకు లేని కొత్త పన్ను అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతోంది. విదేశాల నుంచి డబ్బు వచ్చినా...

విదేశీ మారకంపై ఇకపై అదనపు పన్ను.. రేపట్నించే అమలు
Follow us on

Five percent additional tax on foreign exchange: విదేశాల్లో మీ పిల్లలు చదువుకుంటున్నారా? వారికి డబ్బు పంపాలా ? ఇప్పటి వరకు లేని కొత్త పన్ను అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతోంది. విదేశాల నుంచి డబ్బు వచ్చినా.. ఇక్కడ్నించి మనం విదేశాల్లో వున్న వారికి డబ్బు పంపినా అదనంగా 5 శాతం పన్ను విధించాలన్న రిజర్వు బ్యాంకు ఆదేశాలు అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. దీంతో విదేశీ చదువు మరింత భారం కాబోతోంది. ఎందుకంటే విదేశీ మారకంపై అదనంగా 5 శాతం పన్ను వసూలు చేయాలని రిజర్వు బ్యాంకు నిర్ణయించింది.

అక్టోబర్ 1వ తేదీ నుంచి దేశంలో పలు బ్యాంకింగ్ మార్పులు రాబోతున్నాయి. విదేశాల్లో క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వాడాలన్నా.. విదేశాల నుంచి ఆన్ లైన్ లావాదేవీలు జరపాలన్న ఇకపై ముందస్తుగా ఆ ఖాతాదారులు సంబంధిత బ్యాంకులో నమోదు చేసుకుని వుండాల్సిన అవసరం వుంది. అంటే తమ కార్డులు కేవలం డొమెస్టిక్ పర్పసా లేక ఇంటర్నేషనల్‌గా వినియోగించుకోవాలా అన్నది ముందుగా సంబంధిత బ్యాంకులో నమోదు చేసుకోవాల్సి వుంటుంది. ఈ మేరకు ఆర్బీఐ మార్పులు చేసింది.

ఇదే విధంగా విదేశాలకు పంపే డబ్బుపైన కూడా ఇకపై అదనంగా 5 శాతం పన్ను వసూలు చేయాలని బ్యాంకులను ఆదేశించింది రిజర్వు బ్యాంకు. ఈ పన్ను విధింపు అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. లక్ష రూపాయలు పంపితే.. అదనంగా 5 వేల రూపాయలు పన్ను రూపంలో బ్యాంకులు కట్ చేసుకునే అవకాశాన్ని రిజర్వు బ్యాంకు కలిపిస్తోంది. ఈరకంగా ప్రజల నెత్తిన అదనపు భారం అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతోంది.

Also read:  ఏపీలో నవశకం.. ఎరువుల పంపిణీలో కొత్త సిస్టమ్

Also read:   ఈ దివ్యాంగుని పాట.. కరోనా రోగులకు ఊరట

Also read:    క్రెడిట్ డెబిట్ కార్డుల వినియోగంపై ఆంక్షలు.. రేపట్నించే అమలు

Also read:    ఏపీతోపాటే కేంద్రానికి ధీటుగా సమాధానం.. యాక్షన్ ప్లాన్‌పై కేసీఆర్ కసరత్తు

Also read:    బ్రహ్మోస్ ప్రయోగం సక్సెస్.. రేంజ్ తెలిస్తే షాకే!