AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మే 2 న విజేతలైన అభ్యర్థుల విజయోత్సవాలపై ఎన్నికల కమిషన్ నిషేధం,

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మే 2 న ప్రకటించనున్నారు. అయితే దేశంలో కోవిద్ మహమ్మారి  దృష్ట్యా  ఆరోజున గానీ, ఓట్ల లెక్కింపు తరువాత గానీ విజేతలైన అభ్యర్థుల విజయోత్సవాలపై ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది

మే 2 న విజేతలైన అభ్యర్థుల విజయోత్సవాలపై  ఎన్నికల కమిషన్ నిషేధం,
Ec Bans All Victory Processions
Umakanth Rao
| Edited By: |

Updated on: Apr 27, 2021 | 12:58 PM

Share

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మే 2 న ప్రకటించనున్నారు. అయితే దేశంలో కోవిద్ మహమ్మారి  దృష్ట్యా  ఆరోజున గానీ, ఓట్ల లెక్కింపు తరువాత గానీ విజేతలైన అభ్యర్థుల విజయోత్సవాలపై ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. ఎన్నిక ఫలితం అనంతరం గెలుపు సర్టిఫికెట్ ను అందుకునే విజేత (అభ్యర్థి) వెంట ఇద్దరికి మించి వ్యక్తులు  ఉండరాదని ఈసీ  తన ఉత్తర్వుల్లో పేర్కొంది. దేశంలో కొన్ని రోజులుగా రోజూ 2 వేలకు  కరోనా రోగులు మరణిస్తున్నారు.   కేసుల సంఖ్య 3 లక్షలకు పైగా   దాటిపోయింది. బెంగాల్ లో అన్ని రోడ్  షోలను,బైక్ ర్యాలీలను  బ్యాన్ చేస్తూ  ఈసీ ఇటీవల నిర్ణయం తీసుకుంది. కాగా- ఇండియాలో కోవిడ్ కేసులు పెరిగి పోవడానికి ఎన్నికల కమిషన్ పూర్తిగా బాధ్యత వహించాలని మద్రాస్ హైకోర్టు నిన్న తీవ్రంగా వ్యాఖ్యానించింది. అత్యంత బాధ్యతాయుతమైన ఈ సంస్థ కోవిడ్ వ్యాప్తికి బాధ్యత వహించాలని, దీని అధికారులపై  హత్యాభియోగాలు మోప వచ్చునని కూడా  పేర్కొంది. మే 2 న ఓట్ల  సమయంలో  కోవిడ్  ప్రొటొకాల్స్ పాటించేలా చూడాలంటూ  తమిళనాడు రవాణా  శాఖ మంత్రి విజయభాస్కర్ దాఖలు పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. శుక్రవారం నాటికీ తమ ప్లాన్ ఏమిటో  తమకు సమర్పించాలని ఈసీ ని కోర్టు ఆదేశించింది. లేని పక్షంలో మే 2 న ఎన్నికల ఫలితాల ప్రకటనను నిలిపివేస్తామని  హెచ్చరించింది.

అటు-మిగిలిన  ఎన్నికల దశలను కలిపి నిర్వహించాలన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అభ్యర్థనను ఈసీ తిరస్కరించింది. రాష్ట్రంలో కోవిద్ కేసులు అత్యధికంగా ఉన్న దృష్ట్యా   ఈ చర్య తీసుకోవాలన్న  దీదీ కోర్కెను నిరాకరించింది. ఇక ఓట్ల లెక్కింపు  రోజున కోవిడ్   నిబంధనలను కచ్చితంగా పాటించేలా చూసేందుకు ఎన్నికల కమిషన్   సరికొత్త ప్రణాలికను రూపొందించే పనిలో నిమగ్నమైంది.

మరిన్ని ఇక్కడ చూడండి: నా కుటుంబానికి ఇది అత్యంత కష్టసమయం.. కరోనా పాజిటివ్ వచ్చింది.. డాక్టర్ల సలహాలను పాటిస్తున్నా.. నటి హీనా ఖాన్..

అకస్మాత్తుగా రెండు ముక్కలైన రోలర్ కోస్టర్.. 200 మీటర్ల ఎత్తులో చిక్కుకున్న జనాలు.. షాకింగ్ దృశ్యాలు.!

Follow Us
800 ఫోర్లు కొట్టిన మొట్టమొదటి ప్లేయర్‌గా కోహ్లీ రికార్డు
800 ఫోర్లు కొట్టిన మొట్టమొదటి ప్లేయర్‌గా కోహ్లీ రికార్డు
ఉదయాన్నే కాఫీ, టీకి బదులు మజ్జిగ తాగి చూడండి.. మీకు తిరుగుండదు!
ఉదయాన్నే కాఫీ, టీకి బదులు మజ్జిగ తాగి చూడండి.. మీకు తిరుగుండదు!
నెటిజన్స్ కామెంట్స్ మాత్రం.. అబ్బో..!!
నెటిజన్స్ కామెంట్స్ మాత్రం.. అబ్బో..!!
బుమ్రా, సూర్యకుమార్‌లపై వేటు? హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం..!
బుమ్రా, సూర్యకుమార్‌లపై వేటు? హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం..!
నీట్‌ యూజీ 2026 పరీక్ష రూల్స్ ఇవే.. ఈ తప్పులు చేస్తే మీకే నష్టం!
నీట్‌ యూజీ 2026 పరీక్ష రూల్స్ ఇవే.. ఈ తప్పులు చేస్తే మీకే నష్టం!
వెండి కొంటున్నారా? జాగ్రత్త! ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారట
వెండి కొంటున్నారా? జాగ్రత్త! ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారట
భార్యను తిట్టిన భర్త.. తననే దూషించారనుకొని పక్కింటి మహిళ దాడి!
భార్యను తిట్టిన భర్త.. తననే దూషించారనుకొని పక్కింటి మహిళ దాడి!
ఈ నెలాఖరులోగా పదో ఫలితాలు 2026 విడుదల.. తాజా అప్ డేట్
ఈ నెలాఖరులోగా పదో ఫలితాలు 2026 విడుదల.. తాజా అప్ డేట్
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? తులం ధర ఎంత?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? తులం ధర ఎంత?
CBSE రెండో విడత 2026 పరీక్షలు.. ఆ సబ్జెక్టుకే అత్యధిక దరఖాస్తులు!
CBSE రెండో విడత 2026 పరీక్షలు.. ఆ సబ్జెక్టుకే అత్యధిక దరఖాస్తులు!