AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake Risk: భారత్‌లోని ఈ ప్రాంతాల్లో భారీ భూకంపం వచ్చే సంకేతాలు.. భూగర్భశాస్త్రవేత్తల హెచ్చరిక!

టర్కీ, సిరియాల్లో భూకంప తీవ్రతను చూసిన తర్వాత ఇంతకీ భారత్‌ సేఫేనా అనే డౌట్‌ వస్తోంది. దాదాపు 8 వేల మందిని బలిగొన్న ఘోర భూకంపం యావత్‌ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దీనిపై భూగర్భశాస్త్ర నిపుణులు స్పందిస్తూ.. భారత్‌లో దాదాపు 59 శాతం భూభాగం వివిధ కారణాల రిత్య తరచూ భూకంపాలకు..

Earthquake Risk: భారత్‌లోని ఈ ప్రాంతాల్లో భారీ భూకంపం వచ్చే సంకేతాలు.. భూగర్భశాస్త్రవేత్తల హెచ్చరిక!
Earthquake
Srilakshmi C
|

Updated on: Feb 08, 2023 | 2:46 PM

Share

టర్కీ, సిరియాల్లో భూకంప తీవ్రతను చూసిన తర్వాత ఇంతకీ భారత్‌ సేఫేనా అనే డౌట్‌ వస్తోంది. దాదాపు 8 వేల మందిని బలిగొన్న ఘోర భూకంపం యావత్‌ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దీనిపై భూగర్భశాస్త్ర నిపుణులు స్పందిస్తూ.. భారత్‌లో దాదాపు 59 శాతం భూభాగం వివిధ కారణాల రిత్య తరచూ భూకంపాలకు గురవుతుంది. ముఖ్యంగా దక్షిణ భారత్‌ కన్నా ఉత్తర భారత్‌లోని ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో భూకంపాలు సంభవించే ప్రమాదం ఉంది. దేశంలోని సీస్మిక్ జోనింగ్ మ్యాప్ ప్రకారం.. మొత్తం ప్రాంతాన్ని నాలుగు సీస్మిక్ జోన్‌లుగా వర్గీకరించినట్లు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్‌ 2021 జులైలో లోక్‌సభలో తెలిపారు. జోన్ 5 అత్యంత తీవ్రమైన భూకంపాలు సంభవించే జోన్‌గా ఆయన పేర్కొన్నారు. దేశం వైశాల్యంలో దాదాపు 11% జోన్ 5లో, 18% జోన్ 4లో, 30% జోన్ 3లో మిగిలినవి జోన్ 2లో ఉన్నట్లు మంత్రి తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత తీవ్రత కలిగిన భూకంపాలు సంభవించే ప్రాంతాల్లో నార్త్‌ ఇండియాలోని హిమాలయాలు ఒకటి.

1934లో బీహార్-నేపాల్‌లో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 8.2గా నమోదైంది. ఈ ప్రమాదంలో దాదాపు పది వేల మంది మరణించారు. 1991లో ఉత్తరకాశీలో 6.8 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 800 మందికి పైగా మరణించారు. 2005లో కాశ్మీర్‌లో 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 80,000 మంది మరణించారు. 2016నాటి అధ్యయనాల ప్రకారం మధ్య హిమాలయాల ప్రాంతంలో టెక్టోనిక్ పీడనం ఎక్కువగా ఉందని, ఇండో-ఆస్ట్రేలియన్, ఆసియా టెక్టోనిక్ ప్లేట్ల కలయిక భాగంలో భూకంప తీవ్రత అధికంగా ఉన్నట్లు భూకంప శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. హిమాలయాల్లో గత 50 ఏళ్లుగా భారీ భూకంపం ఏదీ రాలేదు. కానీ భూమి లోపల ఫలకాల కదలిక జరుగుతూనే ఉంది. అందువల్ల పుట్టిన పీడనం బయటకు రాకుండా లోపలే ఉండటం వల్ల వచ్చే పదేళ్లలో ఎప్పుడైనా భూకంపం సంభవించే అవకాశం ఉన్నట్లు భూకంప పరిశోధనా కేంద్రం చీఫ్‌ సైంటిస్ట్‌ పూర్ణ చంద్రరావు తెలిపారు.

జోన్‌ 5లోని ఉన్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, అస్సాం, మణిపూర్, నాగాలాండ్, జమ్మూ అండ్‌ కశ్మీర్, అండమాన్ అండ్‌ నికోబార్‌ ప్రాంతాల్లో భూకంపాలు ఓ క్షణానైనా సంభవించవచ్చనినేషనల్ సిస్మోలజీ సెంటర్‌ హెచ్చరిస్తోంది. ఢిల్లీని అత్యంత ప్రమాదకర ప్రాంతంగా నిపుణులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
సమస్య పరిష్కారానికి వినూత్న నిరసన.. ఏం చేశారో చూడండి
సమస్య పరిష్కారానికి వినూత్న నిరసన.. ఏం చేశారో చూడండి
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
మతిపోగోడుతున్న మహేష్ మేనకోడలు.. జాన్వీ లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
మతిపోగోడుతున్న మహేష్ మేనకోడలు.. జాన్వీ లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
వేసిన కాసేపటికే ఆరిపోతున్న వీధి లైట్‌లు.. ఎన్ని సార్లు వేసినా..
వేసిన కాసేపటికే ఆరిపోతున్న వీధి లైట్‌లు.. ఎన్ని సార్లు వేసినా..
శుక్రుడి గ్రహ మార్పు.. ఇక లగ్జరీ జీవితం మీ సొంతం!
శుక్రుడి గ్రహ మార్పు.. ఇక లగ్జరీ జీవితం మీ సొంతం!
రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య అయితే మంచి ఫ్రెండ్ మాత్రం ఆ హీరోనే
రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య అయితే మంచి ఫ్రెండ్ మాత్రం ఆ హీరోనే
ఇంట్లో టికెట్ మర్చిపోయినా ట్రైన్లో ప్రయాణించవచ్చు.. ఎలా అంటే..?
ఇంట్లో టికెట్ మర్చిపోయినా ట్రైన్లో ప్రయాణించవచ్చు.. ఎలా అంటే..?
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే దాహం దాహం
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే దాహం దాహం
గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినే పకోడీ
గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినే పకోడీ
సిగరెట్ అలవాటు మానేయడం కష్టమా? చాలా మంది ఎందుకు ఫెయిల్‌ అవుతారంటే
సిగరెట్ అలవాటు మానేయడం కష్టమా? చాలా మంది ఎందుకు ఫెయిల్‌ అవుతారంటే