జమ్ముకశ్మీర్‌లో డ్రోన్ కలకలం

జమ్మూకశ్మీర్‌ కిష్టావర్‌ జిల్లాలో హై సెక్యూరిటీ జైలు వద్ద తిరుగుతున్న ఓ డ్రోన్‌ను అధికారులు గుర్తించారు. మంగళవారం రాత్రి ఈ డ్రోన్‌ జైలు పరిసర ప్రాంతాల్లో తిరిగినట్లు గుర్తించారు. అయితే దానిని క్రాష్ చేసి సీజ్ చేశారు. డ్రోన్‌కు సంబంధించిన వివరాల కోసం విచారణ కొనసాగుతోందని పోలీసు అధికారులు తెలిపారు. సోమవారం కేశ్వాన్‌ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గుర్తించేందుకు ఈ డ్రోన్‌ను ఎవరైనా ఉపయోగించి ఉంటారని అనుమానిస్తున్నామని తెలిపారు. అయితే గతంలో తనిఖీల చేయడానికి ఉపయోగించిన […]

జమ్ముకశ్మీర్‌లో డ్రోన్ కలకలం
Follow us

| Edited By:

Updated on: Jul 03, 2019 | 9:57 PM

జమ్మూకశ్మీర్‌ కిష్టావర్‌ జిల్లాలో హై సెక్యూరిటీ జైలు వద్ద తిరుగుతున్న ఓ డ్రోన్‌ను అధికారులు గుర్తించారు. మంగళవారం రాత్రి ఈ డ్రోన్‌ జైలు పరిసర ప్రాంతాల్లో తిరిగినట్లు గుర్తించారు. అయితే దానిని క్రాష్ చేసి సీజ్ చేశారు. డ్రోన్‌కు సంబంధించిన వివరాల కోసం విచారణ కొనసాగుతోందని పోలీసు అధికారులు తెలిపారు. సోమవారం కేశ్వాన్‌ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గుర్తించేందుకు ఈ డ్రోన్‌ను ఎవరైనా ఉపయోగించి ఉంటారని అనుమానిస్తున్నామని తెలిపారు. అయితే గతంలో తనిఖీల చేయడానికి ఉపయోగించిన ఓ డ్రోన్‌ను సాంకేతిక కారణాలతో కోల్పోయామని ఓ అధికారి వెల్లడించారు. ప్రస్తుతం జైలు వద్ద స్వాధీనం చేసుకున్న డ్రోన్‌ కూడా దాని మాదిరిగానే ఉందని అన్నారు.