AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోవిడ్ గురించి భయపడకండి, నిర్భయంగా ఓటు వేయండి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

కోవిడ్ గురించి భయపడరాదని, నిర్భయంగా ఈ ఎన్నికల్లో ఓటు వేయాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోవిడ్ రోగులను ఉద్దేశించి అన్నారు. మీరు సంకోచం లేకుండా పోలింగ్ కేంద్రాలకు..

కోవిడ్ గురించి భయపడకండి, నిర్భయంగా ఓటు వేయండి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
Umakanth Rao
| Edited By: |

Updated on: Apr 26, 2021 | 10:26 AM

Share

కోవిడ్ గురించి భయపడరాదని, నిర్భయంగా ఈ ఎన్నికల్లో ఓటు వేయాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోవిడ్ రోగులను ఉద్దేశించి అన్నారు. మీరు సంకోచం లేకుండా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయండి.. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించాం అన్నారు. ‘కరోనా వైరస్ గురించి భయపడకండి.. నేను మీ వాచ్ మన్ ని’ అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రచార కార్యక్రమాల కన్నా తాను కోవిడ్ మీటింగ్స్ ఎక్కువగా నిర్వహిస్తున్నానని ఆమె ముర్షీదాబాద్ జిల్లా బెర్హం పూర్లో జరిగిన వర్చ్యువల్ మీటింగ్ లో పేర్కొన్నారు. ప్రధాని మోదీ కేవలం ప్రసంగాలు మాత్రమే చేస్తారని, ఈ పాండమిక్ ని హ్యాండిల్ చేయలేకపోతున్నారని, పైగా దేశంలో ఆక్సిజన్ కొరతకు కేంద్రానిదే బాధ్యత అని ఆమె ఆరోపించారు. ప్రధాని ‘మన్ కీ బాత్’ చేస్తున్నారు. దీనిపై ఎవరికి  ఆసక్తి ఉంది ? మనకు కోవిడ్ కీ బాత్ అవసరం.. అన్నారామె.. బెంగాల్ కి రావలసిన ఆక్సిజన్ ని ఉత్తరప్రదేశ్ కి మళ్లిస్తున్నారని ఆమె అన్నారు. ఈ పాటికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని  పెద్ద ఎత్తున చేపట్టి ఉంటే పరిస్థితి ఇంత తీవ్రంగా ఉండేది కాదని, ఈ ప్రధాని 80 దేశాలకు ఉచితంగా వ్యాక్సిన్ పంపించారని మమతా బెనర్జీ నిప్పులు కక్కారు.

కేంద్రానికి ఎదురొడ్డి నిలిచేది బెంగాల్ మాత్రమేనని, అందువల్లే ఈ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయని ఆమె చెప్పారు. వీటిని మొత్తం దేశమంతా చూస్తోందన్నారు. యూపీ, గుజరాత్ రాష్ట్రాలకు ఎక్కువగా ఆక్సిజన్ వెళ్తోందని ఆమె ఆరోపించారు. ఇందులోనూ వివక్ష చూపుతున్నారని విమర్శించారు. యూపీ, అస్సాం, త్రిపుర వంటి రాష్ట్రాలు అంత్యక్రియల స్థలాల చుట్టూ గోడలు నిర్మిస్తున్నాయని, కానీ బెంగాల్ లో ఇలాంటి ‘అడ్డాలు’ లేవని దీదీ చెప్పారు. వన్ నేషన్, వన్ లీడర్ అని ప్రధాని అంటున్నారు.. మరి వ్యాక్సిన్ కి ఒకే ధర ఎందుకు ఉండరాదు అని ఆమె ప్రశ్నించారు. కేంద్రానికి ఓ ధర, రాష్ట్రాలకు మరో ధర ఏమిటన్నారు. కాగా…  బెంగాల్ లో ఏడో దశ  పోలింగ్  మంగళవారం, ఈ నెల 29 న తుది దశ పోలింగ్ జరగనుంది. మే 2 న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు.

ఫ్లాట్లు కట్టిస్తామని డబ్బులు తీసుకున్నారు.. చివరకు ఏం జరిగిందంటే
ఫ్లాట్లు కట్టిస్తామని డబ్బులు తీసుకున్నారు.. చివరకు ఏం జరిగిందంటే
మబ్బుల మధ్య రైల్వే స్టేషన్… ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైనది..!
మబ్బుల మధ్య రైల్వే స్టేషన్… ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైనది..!
అదృష్టం అంటే ఇదేనేమో..1 లక్ష పెట్టుబడి రూ.12.50 లక్షలుగా మారింది
అదృష్టం అంటే ఇదేనేమో..1 లక్ష పెట్టుబడి రూ.12.50 లక్షలుగా మారింది
హై లెవెల్‌ బ్యాంకింగ్‌ కమిటీ ఏర్పాటు చేయనున్న కేంద్రం! ఎందుకంటే..
హై లెవెల్‌ బ్యాంకింగ్‌ కమిటీ ఏర్పాటు చేయనున్న కేంద్రం! ఎందుకంటే..
టీజీ లాసెట్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
టీజీ లాసెట్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
డాక్టర్ల చేతిలో ఏఐ ఆయుధం.. సిక్ కేర్ నుండి హెల్త్‌కేర్ వైపు..
డాక్టర్ల చేతిలో ఏఐ ఆయుధం.. సిక్ కేర్ నుండి హెల్త్‌కేర్ వైపు..
రోజుకు రూ.7తో 2.6జీబీ డేటా.. అద్బుతమైన ఆఫర్
రోజుకు రూ.7తో 2.6జీబీ డేటా.. అద్బుతమైన ఆఫర్
నోటి పూత తరచూ ఎందుకు వస్తుందో తెలుసా..? ప్రమాదకర వ్యాధుల సంకేతమా
నోటి పూత తరచూ ఎందుకు వస్తుందో తెలుసా..? ప్రమాదకర వ్యాధుల సంకేతమా
మీకో సవాల్.. ఈ చిత్రంలో దాగి ఉన్న కుక్కను గుర్తిస్తే.. మీరే తోపు
మీకో సవాల్.. ఈ చిత్రంలో దాగి ఉన్న కుక్కను గుర్తిస్తే.. మీరే తోపు
అవకాశం ఇస్తే పవన్‌ కల్యాణ్‌ను కలిసి ఆధారాలు ఇస్తా: హర్షవీణ
అవకాశం ఇస్తే పవన్‌ కల్యాణ్‌ను కలిసి ఆధారాలు ఇస్తా: హర్షవీణ