AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘సుప్రీం’కు దిశ నిందితుల కుటుంబాలు.. రూ.50లక్షలు ఇవ్వాలంటూ..!

ఎన్‌కౌంటర్‌లో మరణించిన దిశ నిందితుల మృతదేహాలకు ఇంకా అంత్యక్రియలు పూర్తి కాలేదు. దీనిపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో నిందితుల అంత్యక్రియలకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో ఎన్‌కౌంటర్‌పై దిశ నిందితుల కుటుంబాలు సుప్రీంను ఆశ్రయించాయి. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని వారు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు నిందితులను నకిలీ ఎన్‌కౌంటర్ చేశారని.. వారిపై చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇక కోర్టు వేసిన […]

'సుప్రీం'కు దిశ నిందితుల కుటుంబాలు.. రూ.50లక్షలు ఇవ్వాలంటూ..!
Ravi Kiran
|

Updated on: Dec 20, 2019 | 5:56 AM

Share

ఎన్‌కౌంటర్‌లో మరణించిన దిశ నిందితుల మృతదేహాలకు ఇంకా అంత్యక్రియలు పూర్తి కాలేదు. దీనిపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో నిందితుల అంత్యక్రియలకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో ఎన్‌కౌంటర్‌పై దిశ నిందితుల కుటుంబాలు సుప్రీంను ఆశ్రయించాయి. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని వారు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.

పోలీసులు నిందితులను నకిలీ ఎన్‌కౌంటర్ చేశారని.. వారిపై చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇక కోర్టు వేసిన విచారణ కమిషన్‌కు అందించే సాక్ష్యాలు తారుమారు చేయకుండా సీపీ సజ్జనార్ సహా తెలంగాణ ప్రభుత్వాన్ని నియంత్రించాలని పిటిషనర్లు కోరారు. అలాగే సీపీ సజ్జనార్ సహా ఎన్ కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై విచారణ కమిషన్ ఆధ్వర్యంలో సీబీఐ దర్యాప్తు జరిపించాలని వారు న్యాయస్థానానికి విన్నవించారు. అంతేకాకుండా ఒక్కో కుటుంబానికి పరిహారంగా 50 లక్షలు ఇవ్వాలని నిందితుల కుటుంబాలు తమ పిటిషన్‌లో పేర్కొనడం గమనర్హం.

Follow Us
'మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు..' NEET రీటెస్ట్‌కు మరో ఇద్దరు బలి
'మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు..' NEET రీటెస్ట్‌కు మరో ఇద్దరు బలి
వెయిటింగ్‌లో హిట్ డైరెక్టర్స్‌... మహేష్‌ ప్లానేంటి?
వెయిటింగ్‌లో హిట్ డైరెక్టర్స్‌... మహేష్‌ ప్లానేంటి?
వారికి కూడా తల్లికి వందనం పథకం కింద డబ్బులు.. ప్రభుత్వం నిర్ణయం
వారికి కూడా తల్లికి వందనం పథకం కింద డబ్బులు.. ప్రభుత్వం నిర్ణయం
పోర్టల్, SMS పనిచేయకపోయినా ఇలా పీఎస్ బ్యాలెన్స్ చెక్‌ చేసుకోండి
పోర్టల్, SMS పనిచేయకపోయినా ఇలా పీఎస్ బ్యాలెన్స్ చెక్‌ చేసుకోండి
నేను కావాలని చేయలేదు..! ఆ రెండేళ్లు తిండి కూడా తినలేదు..
నేను కావాలని చేయలేదు..! ఆ రెండేళ్లు తిండి కూడా తినలేదు..
ఆర్జీవీ మరో సంచలనం! ఆ పవర్ ఫుల్ పోలీస్ జీవితం ఆధారంగా సినిమా
ఆర్జీవీ మరో సంచలనం! ఆ పవర్ ఫుల్ పోలీస్ జీవితం ఆధారంగా సినిమా
శుక్రవారం ఈ ఒక్క వస్తువు దానం చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గుతుందా?
శుక్రవారం ఈ ఒక్క వస్తువు దానం చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గుతుందా?
రూ.120 టికెట్‌తో తిరుమల శ్రీవారి మొదటి గడప దర్శనం
రూ.120 టికెట్‌తో తిరుమల శ్రీవారి మొదటి గడప దర్శనం
రూ.400 కోట్లు దాటినా తగ్గేదే లేదు.. భన్సాలీ ‘లవ్ అండ్ వార్’
రూ.400 కోట్లు దాటినా తగ్గేదే లేదు.. భన్సాలీ ‘లవ్ అండ్ వార్’
TG EAPCET 2026: ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందాలంటే ఇవి ఉండాల్సిందే
TG EAPCET 2026: ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందాలంటే ఇవి ఉండాల్సిందే