AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Terrorists: నవరాత్రి, రామ్‌లీలా ఉత్సవాలే ఉగ్రవాదుల టార్గెట్.. అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ అలర్ట్స్

ఢిల్లీ, యూపీ, ఇతర రాష్ట్రాల్లో జరిపిన సోదాల్లో జాన్‌ మహ్మద్‌ షేక్‌ అలియాస్‌ సమీర్, ఒసామా, మూల్‌చంద్, జేషన్‌ ఖమర్, మహ్మద్‌ అబూ బకర్, మొహ్మద్‌ అమీర్‌ జావెద్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Terrorists: నవరాత్రి, రామ్‌లీలా ఉత్సవాలే ఉగ్రవాదుల టార్గెట్.. అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ అలర్ట్స్
Terrorists
Ram Naramaneni
|

Updated on: Sep 15, 2021 | 7:41 AM

Share

ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ సెల్‌ ఉగ్రవాాదులకు సంబంధించి కీలక సమాచారం సేకరించింది. పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాద కుట్రను భగ్నం చేసింది. పాక్‌– ఐఎస్‌ఐ వద్ద ట్రైనింగ్ తీసుకున్న ఇద్దరు టెర్రరిస్టులతో సహా ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నవరాత్రి, రామ్‌లీలా ఉత్సవాలను టార్గెట్ చేసుకొని దేశవ్యాప్తంగా పలు పేలుళ్లకు వీరు కుట్ర పన్నారని పోలీసులు వెల్లడించారు. ఢిల్లీ, యూపీ, ఇతర రాష్ట్రాల్లో జరిపిన సోదాల్లో జాన్‌ మహ్మద్‌ షేక్‌ అలియాస్‌ సమీర్, ఒసామా, మూల్‌చంద్, జేషన్‌ ఖమర్, మహ్మద్‌ అబూ బకర్, మొహ్మద్‌ అమీర్‌ జావెద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒసామా, ఖమర్‌లు ఐఎస్‌ఐ వద్ద ట్రైనింగ్ తీసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు.

ఢిల్లీ, యూపీల్లో ఐఈడీ(పేలుడు పదార్థం) ఉంచేందుకు సరైన ప్లేసులను వెతకడానికి వీరిని నియమించినట్లు వివరించారు. వీరి అరెస్టుతో పాక్‌– ఐఎస్‌ఐ– టెర్రరిస్టుల సంబంధం బయటపడిందని,  అండర్‌వరల్డ్‌ సహకారంతో ఢిల్లీ, యూపీ, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లో పలు పేలుళ్లు జరిగే ప్రమాదాన్ని నివారించినట్లయిందని స్పెషల్‌ సెల్‌ డీసీపీ ప్రమోద్‌ సింగ్‌ వెల్లడించారు. అలహాబాద్‌లో జరిపిన సోదాల్లో పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఉగ్రకుట్రలో వివిధ పనులు చేసేందుకు వీరిని నియమించినట్లు గుర్తించారు. అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం సోదరుడు అనీస్‌ ఇబ్రహీంకు సమీర్‌ దగ్గరి వాడని పోలీసులు తెలిపారు. పాక్‌లో ఉంటున్న అనీస్‌ ఆదేశాల మేరకు పేలుడు పదార్థాలను, ఆధునిక ఆయుధాలను, గ్రెనేడ్లను ఇండియాలోని వివిధ ప్రాంతాల్లోని ఉగ్రవాదులకు అందించేందుకు సమీర్‌ తయారయ్యాడన్నారు.

ఇక ఢిల్లీలో అరెస్టయిన ఉగ్రవాది జాన్‌ మహ్మద్‌ షేక్‌ ఫ్యామిలీ మెంబర్స్‌ను ముంబై పోలీసులు, ఏటీఎస్‌ అధికారులు విచారించారు. షేక్‌ ఇంట్లో సోదాలు సైతం నిర్వహించినట్లు పోలీసులు వివరించారు. సెంట్రల్‌ ముంబైలో షేక్‌ కుటుంబం ఉంటోంది. కొన్నేళ్లుగా ఇక్కడే షేక్‌ నివాసముంటున్నాడని, అతనికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారని పోలీసులు వివరించారు.  జాన్‌ గురించి ఇరుగుపొరుగును కూడా పోలీసులు విచారించారు. జాన్‌కు టెర్రరిస్టులతో ఎలా సంబంధం ఏర్పడిందన్న విషయమై ఆరాతీశారు.

Also Read: సైదాబాద్‌ నిందితుడి ఆచూకీ చెబితే రూ.10 లక్షల రివార్డు.. వివరాలు గోప్యంగా ఉంచుతామన్న సీపీ

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్