AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీలో కాల్పుల కలకలం.. మార్నింగ్ వాక్ చేసి ఇంటికి వెళ్తున్న వ్యాపారిని కాల్చి చంపిన దుండగులు

ఢిల్లీలో దారుణం జరిగింది. మార్నింగ్ వాకింగ్ కోసం బయటకు వచ్చిన వ్యాపారి సునీల్ జైన్. బైక్‌పై వచ్చిన దుండగులు వ్యాపారిని లక్ష్యంగా చేసుకుని 6 - 7 రౌండ్లు కాల్పులు జరిపారు.

ఢిల్లీలో కాల్పుల కలకలం.. మార్నింగ్ వాక్ చేసి ఇంటికి వెళ్తున్న వ్యాపారిని  కాల్చి చంపిన దుండగులు
Delhi Gun Fire
Balaraju Goud
|

Updated on: Dec 07, 2024 | 11:00 AM

Share

దేశ రాజధాని ఢిల్లీలో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. షహదారాలోని విశ్వాస్ నగర్‌లో ఓ వ్యాపారిని దుండగులు కాల్చిచంపారు. వ్యాపారవేత్తలు ఉదయం మార్నింగ్ వాక్ కోసం బయటకు వెళ్లారు. ఇంతలో బైక్‌పై వచ్చిన దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. కాల్పుల్లో వ్యాపారి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్పందించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ సంఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

52 ఏళ్ల సునీల్ జైన్ యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో మార్నింగ్ వాక్ చేసి, స్కూటీపై తన ఇంటికి వెళ్తుండగా కాల్పులు జరిగాయి. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు సునీల్‌పై కాల్పులు జరిపినట్లు సమాచారం. ప్రస్తుతం సీసీటీవీ ద్వారా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బైక్‌పై వెళ్తున్న దుండగులు వ్యాపారిని లక్ష్యంగా చేసుకుని 6 – 7 రౌండ్లు కాల్పులు జరిపారు. బుల్లెట్ కారణంగా వ్యాపారి తీవ్రంగా గాయపడి రోడ్డుపై కుప్పకూలిపోయాడు. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.

కాల్పుల ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళన నెలకొంది. ఘటనపై స్థానికుల నుంచి పోలీసులు సమాచారం సేకరించారు. మృతుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. మృతుడి కుటుంబ సభ్యులను పోలీసులు విచారించారు. వ్యాపారికి ఎవరితోనైనా పాత వివాదాలు ఉన్నాయా అని ఆరా తీశారు. వ్యాపారవేత్త మొబైల్‌లోని కాల్ వివరాలను కూడా విశ్లేషించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
రెంట్‌కు బాయ్‌ఫ్రెండ్..? ఇండియాలో కొత్త ట్రెండ్‌
రెంట్‌కు బాయ్‌ఫ్రెండ్..? ఇండియాలో కొత్త ట్రెండ్‌
రైల్వేశాఖ కీలక నిర్ణయం.. అన్ని రైల్వే స్టేషన్లలో..
రైల్వేశాఖ కీలక నిర్ణయం.. అన్ని రైల్వే స్టేషన్లలో..
కాకినాడ చిన్నారి మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్.. 3రోజు తర్వాత..
కాకినాడ చిన్నారి మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్.. 3రోజు తర్వాత..
చేసింది అన్నీ విలన్ పాత్రలే.. అయినా క్రేజ్ ఎక్కువే..
చేసింది అన్నీ విలన్ పాత్రలే.. అయినా క్రేజ్ ఎక్కువే..
ఫ్రెండ్స్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారా..? ఐటీ రూల్స్ ఇవే..
ఫ్రెండ్స్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారా..? ఐటీ రూల్స్ ఇవే..
సిండికేట్ ఉచ్చులో రొయ్య సాగు.. దిక్కుతోచని స్థితిలో ఆక్వా రైతు
సిండికేట్ ఉచ్చులో రొయ్య సాగు.. దిక్కుతోచని స్థితిలో ఆక్వా రైతు
చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లోడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..
చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లోడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన..
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన..
జీలకర్ర నీరు లేదా వాము నీరు.. ఖాళీ కడుపుతో తాగేందుకు ఏది బెస్ట్..
జీలకర్ర నీరు లేదా వాము నీరు.. ఖాళీ కడుపుతో తాగేందుకు ఏది బెస్ట్..
ఆరోగ్యంగా ఉండటానికి ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలంటే!
ఆరోగ్యంగా ఉండటానికి ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలంటే!