AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో రెండు రోజుల్లో ప్రకాశ్ రాజ్‌ను చంపేస్తాం.. మరో 14 మందిని కూడా..

ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ను హతమారుస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆయనతో పాటుగా మరో 14మందిని కూడా చంపేస్తామని బెంగళూరులోని బెళగావిలోని నిజగుణానందస్వామి మఠానికి ఓ లేఖ వచ్చింది. ప్రకాశ్ రాజ్‌తో పాటుగా.. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, బృందా కారత్‌, నిజాగుణానంద స్వామి, యాక్టర్‌ చేతన్‌ కుమార్‌, భజరంగ్‌ దళ్‌ నాయకుడు మహేంద్రకుమార్‌, జర్నలిస్ట్‌ అగ్ని శ్రీధర్‌ పేర్లు కూడా ఉన్నాయి. గతకొద్ది రోజులుగా సంఘ్‌ పరివార్‌ను విమర్శిస్తున్న నిజగుణానందస్వామికి ఈ బెదిరింపు […]

మరో రెండు రోజుల్లో ప్రకాశ్ రాజ్‌ను చంపేస్తాం.. మరో 14 మందిని కూడా..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 27, 2020 | 11:52 AM

Share

ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ను హతమారుస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆయనతో పాటుగా మరో 14మందిని కూడా చంపేస్తామని బెంగళూరులోని బెళగావిలోని నిజగుణానందస్వామి మఠానికి ఓ లేఖ వచ్చింది. ప్రకాశ్ రాజ్‌తో పాటుగా.. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, బృందా కారత్‌, నిజాగుణానంద స్వామి, యాక్టర్‌ చేతన్‌ కుమార్‌, భజరంగ్‌ దళ్‌ నాయకుడు మహేంద్రకుమార్‌, జర్నలిస్ట్‌ అగ్ని శ్రీధర్‌ పేర్లు కూడా ఉన్నాయి. గతకొద్ది రోజులుగా సంఘ్‌ పరివార్‌ను విమర్శిస్తున్న నిజగుణానందస్వామికి ఈ బెదిరింపు లేఖ వచ్చింది. కన్నడలో రాసి ఉన్న ఆ లేఖలో.. ధర్మ ద్రోహులు, దేశద్రోహులను ఈ జనవరి 29న హతమార్చేందుకు ముహూర్తం పెట్టాంమంటూ పేర్కొన్నారు. మీ చివరి ప్రయాణానికి సిద్ధంగా ఉండండని.. నిజగుణానందస్వామీని ఉద్దేశిస్తూ.. మీరే కాకుండా మీతో పాటు మరో పన్నెండు మంది కూడా వారి లాస్ట్ జర్నీకి ఇక రెడీగా ఉండండంటూ లేఖలో పేర్కొన్నారు. ఈ బెదిరింపు లేఖను చూసి ఆందోళనకు గురైన ఆశ్రమవాసులు… లేఖను బెళగావి జిల్లా ఎస్పీకి అందజేశారు. దీంతో పోలీసులు ఆశ్రమానికి అదనపు భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. అయితే అందుకు ఆశ్రమ మఠాధిపతి తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తనకూ బెదిరింపులు వచ్చాయంటూ కుమారస్వామి కూడా శనివారం వరుస ట్వీట్లు చేశారు.