AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా పాజిటివ్ మహిళపై దర్యాప్తుకు ఆదేశించిన సీఎం.. ఎందుకంటే!

కరోనా పరీక్ష చేయించుకోకుండా ఎగ్గొట్టిన ఓ మహిళపై విచారణకు ఆదేశించారు గోవా సీఎం ప్రమోద్ సావంత్. పక్క రాష్ట్రాల నుంచి గోవాకు వస్తోన్న వారు కచ్చితంగా కరోనా

కరోనా పాజిటివ్ మహిళపై దర్యాప్తుకు ఆదేశించిన సీఎం.. ఎందుకంటే!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 05, 2020 | 10:30 PM

Share

కరోనా పరీక్ష చేయించుకోకుండా ఎగ్గొట్టిన ఓ మహిళపై విచారణకు ఆదేశించారు గోవా సీఎం ప్రమోద్ సావంత్. పక్క రాష్ట్రాల నుంచి గోవాకు వస్తోన్న వారు కచ్చితంగా కరోనా పరీక్షలు చేయించుకోవాలంటూ గోవా ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల్లో, రైల్వే స్టేషన్‌లో, ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల శాంపిల్స్‌ని కలెక్ట్ చేస్తున్నారు. అయితే ఇటీవల ముంబయి నుంచి గోవాకు చేరుకున్న ఓ మహిళ పరీక్ష చేయించుకోకుండా తప్పించుకుంది. ఈ విషయం తెలిసిన సీఎం, ఆమెపై విచారణకు ఆదేశించారు.

వివరాల్లోకి వెళితే.. ఉత్తర గోవాలోని కలంగూట్‌ నగరంలో నివసిస్తున్న ఓ మహిళకు గురువారం కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమెకు కరోనా ఎలా సోకిందన్న దానిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఆమె ఇటీవల ముంబయి నుంచి వచ్చినట్లు తేలింది. అయితే ఆ సమయంలో ఆమె పరీక్షలు చేయించుకోలేదని సీఎం సావంత్ పేర్కొన్నారు. ”పరీక్ష చేయించుకోకుండానే ఆ మహిళ రాష్ట్రంలోకి వచ్చింది. ప్రస్తుతం ఆమె కరోనా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. దీనిపై విచారణ జరుగుతోంది. రోజూ రాష్ట్రంలోకి 3వేల మంది వస్తున్నారు. ఆమె పరీక్ష చేయించుకోకుండా ఎలా ఎగ్గొట్టిందో తెలుసుకోవడం కొంచెం కష్టమే” అని సావంత్ అన్నారు. కాగా గోవాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 166కు చేరుకోగా.. అందులో 109 మందికి ప్రస్తుతం చికిత్స జరుగుతోంది. 57 మంది కరోనాను జయించారు.

Read This Story Also: శిష్యుడి మూవీపై సుకుమార్ సూపర్ హ్యాపీ..!