శిష్యుడి మూవీపై సుకుమార్ సూపర్ హ్యాపీ..!
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ని హీరోగా పరిచయం చేస్తూ బుచ్చిబాబు సన తెరకెక్కించిన చిత్రం ఉప్పెన. కరోనా రాకపోయి ఉంటే రెండు నెలల క్రితమే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది.
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ని హీరోగా పరిచయం చేస్తూ బుచ్చిబాబు సన తెరకెక్కించిన చిత్రం ‘ఉప్పెన’. కరోనా రాకపోయి ఉంటే రెండు నెలల క్రితమే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది. అయితే అనుకోకుండా కరోనా రావడం, లాక్డౌన్ విధించడంతో ఈ మూవీ విడుదల వాయిదా పడింది. ఇక లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా ఈ నెల నుంచి షూటింగ్లు జరుపుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. మరోవైపు థియేటర్లు కూడా జూలై లేదా ఆగష్టులో తెరిచే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం ఉప్పెన చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో ఉప్పెన అవుట్పుట్ను చూసిన సుకుమార్.. కొన్ని అనవసర సీన్లకు కత్తెర వేసి, సలహాల కోసం చిరంజీవి దగ్గరకు పంపారట. ఇక ఈ అవుట్పుట్పై సుకుమార్ చాలా హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది. రొమాంటిక్ ప్రేమ కథగా బుచ్చిబాబు ఈ సినిమాను బాగా తెరకెక్కించాడని లెక్కల మాస్టార్ తన శిష్యుడికి కితాబిచ్చినట్లు సమాచారం. దీంతో ఈ యువ దర్శకుడు కూడా సంతోషం వ్యక్తం చేసినట్లు టాక్. కాగా ఉప్పెనలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి నటించగా.. విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన రెండు పాటలు సినీ ప్రేమికులను ఆకట్టుకోగా.. ఉప్పెనపై టాలీవుడ్లో మంచి అంచనాలు ఉన్నాయి.
Read This Story Also: తెలంగాణలో పదోతరగతి పరీక్షలపై విచారణ మళ్లీ వాయిదా..!