బావిలో దొరికిన మృతదేహానికి అంత్యక్రియలు.. మూడు రోజులకు ప్రాణాలతో తిరిగి వచ్చిన యువకుడు!
ఛత్తీస్గఢ్లోని సూరజ్పూర్ జిల్లాలో ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబం చనిపోయిందని భావించి అప్పటికే దహనం చేసిన కొడుకు, మూడు రోజుల తర్వాత సజీవంగా ఇంటికి తిరిగి వచ్చాడు. మూడవ రోజు, కుటుంబం దహన సంస్కారాల స్థలంలో అతని బూడిదను సేకరిస్తుండగా, అకస్మాత్తుగా వారి ముందు ప్రత్యక్షమయ్యాడు.

ఛత్తీస్గఢ్లోని సూరజ్పూర్ జిల్లాలో ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబం చనిపోయిందని భావించి అప్పటికే దహనం చేసిన కొడుకు, మూడు రోజుల తర్వాత సజీవంగా ఇంటికి తిరిగి వచ్చాడు. మూడవ రోజు, కుటుంబం దహన సంస్కారాల స్థలంలో అతని బూడిదను సేకరిస్తుండగా, అకస్మాత్తుగా వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఈ సంఘటన చంద్రపూర్ జిల్లాలో జరిగింది.
పురుషోత్తం అనే యువకుడు మూడు రోజులుగా కనిపించకుండా పోయాడు. అతని కుటుంబ సభ్యులు అతని కోసం విస్తృతంగా వెతికారు. కానీ అతని జాడ దొరకలేదు. తరువాత, వారు పోలీసులకు వ్యక్తి తప్పిపోయాడంటూ ఫిర్యాదు చేశారు. ఇంతలో, నవంబర్ 1వ తేదీన, గ్రామస్తులు బావిలో గుర్తు తెలియని మృతదేహాన్ని కనుగొన్నారు. వారు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం బాగా కుళ్ళిపోయి, గుర్తించడం కష్టంగా మారింది.
మృతదేహాన్ని గుర్తించడానికి పోలీసులు పురుషోత్తం కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. మృతదేహంపై లభించిన దుస్తుల ఆధారంగా, కుటుంబ సభ్యులు అది పురుషోత్తందేనని గుర్తించారు. పోస్ట్మార్టం తర్వాత, మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించారు. ఆ రోజు గ్రామంలో శోకసంద్ర వాతావరణం మధ్య మృతదేహాన్ని దహనం చేశారు.
కానీ కథ అకస్మాత్తుగా మలుపు తిరిగింది. మూడవ రోజు, కుటుంబం బూడిదను సేకరించడానికి దహన సంస్కారాల స్థలం వద్దకు వచ్చారు. అయితే పురుషోత్తం సజీవంగా గ్రామానికి తిరిగి వచ్చాడు. అతన్ని చూసి అందరూ షాక్ అయ్యారు. గ్రామంలో గందరగోళం నెలకొంది. అప్పటికే అంత్యక్రియలు పూర్తి చేశామసుకున్న యువకుడు అక్కడే కళ్ల ముందు నిలబడి ఉన్నాడు. అయితే ఇంతకీ చనిపోయింది ఎవరు? అన్న ప్రశ్న తలెత్తింది.
పురుషోత్తం మూడు రోజులుగా అంబికాపూర్లోని తన బంధువుల ఇంట్లో ఉన్నానని, తన గ్రామంలో ఇంత ముఖ్యమైన సంఘటన జరిగిందని తనకు తెలియదని అన్నారు. “దొరికిన మృతదేహం నా కొడుకుది కాదని మాకు తెలియదు. నా కొడుకు సజీవంగా తిరిగి వచ్చినప్పుడు, దేవుడు అతన్ని తిరిగి ఇచ్చినట్లు నాకు అనిపించింది” అని పురుషోత్తం తల్లి మన్కున్వర్ అన్నారు.
అంత్యక్రియలు జరిగిన ఆ మృతదేహం ఎవరిది?
ఇప్పుడు కొత్త సమస్య తలెత్తింది. ఇంతకీ ఎవరి మృతదేహాన్ని దహనం చేశారో పోలీసులకు తెలియడం లేదు. చంద్రపూర్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ విమలేష్ దూబే దీనిపై స్పందించారు. “పురుషోత్తం కుటుంబం అతని దుస్తుల ఆధారంగా మృతదేహాన్ని గుర్తించింది. అయితే ఇప్పుడు అతను సజీవంగా తిరిగి వచ్చాడు. బావిలో ఎవరి మృతదేహం దొరికిందో తెలుసుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాము” అని పోలీస్ అధికారి విమలేష్ దూబే అన్నారు.
మరిన్ని హ్యమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




