PM Modi: ప్రధాని నరేంద్ర మోడీకి నోబెల్‌ బహుమతి ఇవ్వాలంటోన్న బీఎస్ఈ చీఫ్‌.. ఎందుకో తెలుసా?

కొవిడ్‌ మహమ్మారి కాలంలో ఉచిత రేషన్‌ పథకంతో కోట్లాది మంది పేదల కడుపు నింపిన ప్రధాని నరేంద్ర మోడీ (PM NarendraModi) నోబెల్‌ బహుమతి ఇవ్వాలని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ చీఫ్ ఆశిష్ కుమార్‌ చౌహాన్ (Ashishkumar Chauhan) అభిప్రాయపడ్డారు.

PM Modi: ప్రధాని నరేంద్ర మోడీకి నోబెల్‌ బహుమతి ఇవ్వాలంటోన్న బీఎస్ఈ చీఫ్‌.. ఎందుకో తెలుసా?
Pm Narendra modi
Follow us

|

Updated on: Apr 30, 2022 | 1:16 PM

కొవిడ్‌ మహమ్మారి కాలంలో ఉచిత రేషన్‌ పథకంతో కోట్లాది మంది పేదల కడుపు నింపిన ప్రధాని నరేంద్ర మోడీ (PM NarendraModi) నోబెల్‌ బహుమతి ఇవ్వాలని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ చీఫ్ ఆశిష్ కుమార్‌ చౌహాన్ (Ashishkumar Chauhan) అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో అతిపెద్ద ఉచిత ఆహార పథకాన్ని విజయవంతంగా అమలుచేసిన మోడీ ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి అన్ని విధాలా అర్హుడని ఆశిష్‌ తెలిపారు. ఐఐఎం- కలకత్తాలో జరిగిన విద్యార్థుల కాన్వొకేషన్‌ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ కరోనా మహమ్మారి కాలంలో సుమారు 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్‌ పథకాన్ని విజయవంతంగా అమలు చేశారు ప్రధాని మోడీ. మిగతా దేశాలతో పోల్చితే ఈ సంఖ్య చాలా ఎక్కువ. ఇందులో 14 శాతం మందికి మాత్రమే అంటే కేవలం11.5 కోట్ల మందికి ఉచిత ఆహారం అందించినందుకు ఐక్యరాజ్యసమితి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ (WFP)కి 2020లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. మరి ఉచిత రేషన్‌ పథకాన్ని మరింత అద్భుతంగా నిర్వహించి కోట్లాది మంది కడుపునింపిన మోడీని అభినందించాల్సిందే. ఆయన నోబెల్‌ పురస్కారానికి అన్ని విధాలా అర్హుడు. మోడీతో పాటు సామాజిక కార్యకర్తలు, వైద్యులు, ఇతర ఫ్రంట్‌లైన్ల వర్కర్ల సహాయంతో భారతదేశం కొవిడ్‌ సంక్షోభాన్ని సమర్థంగా అధిగమించింది’ అని BSE చీఫ్‌ పేర్కొన్నారు.

కాగా కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభం కారణంగా ప్రజలెవరూ ఆకలితో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన(PMGKAY) పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. 2020 ఏప్రిల్‌ నుంచి మొదలైన ఈ ఉచిత రేషన్‌ పంపిణీ పథకాన్ని కేంద్రం దశల వారీగా పొడిగిస్తూ వస్తోంది. ఈ పథకం కింద అర్హులైన ప్రతిఒక్కరికీ నెలకు అదనంగా 5కిలోల చొప్పున ఆహార ధాన్యాలను కేంద్రం పంపిణీ చేస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Traffic Challans: వాహనదారులకు పోలీసుల వార్నింగ్‌.. పెండింగ్‌ చలానాలు క్లియర్‌ చేయకపోతే ఇక అంతే సంగతులు..

CJI NV Ramana: కోర్టు ఆదేశాలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.. కోర్టు ధిక్కరణ కేసులు పెరిగిపోతున్నాయి: సీజేఐ ఎన్వీరమణ

Acharya Movie: మెగాస్టార్‌ సినిమాలో నటించి మెప్పించిన ఈ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ ఎవరో తెలుసా?

Latest Articles
పాము కాటుతో మృతిచెందిన అతని శవాన్ని తీసుకెళ్లి....
పాము కాటుతో మృతిచెందిన అతని శవాన్ని తీసుకెళ్లి....
తక్కువ ధరలో సూపర్ కార్స్ ఇవే.. భద్రత విషయంలో నో రాజీ
తక్కువ ధరలో సూపర్ కార్స్ ఇవే.. భద్రత విషయంలో నో రాజీ
జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..
జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..
ఏపీలో పోలింగ్‎కు ఏర్పాట్లు పూర్తి.. ఈసీ కీలక విషయాలు వెల్లడి..
ఏపీలో పోలింగ్‎కు ఏర్పాట్లు పూర్తి.. ఈసీ కీలక విషయాలు వెల్లడి..
టీ 20 ప్రపంచకప్ జట్టులో మార్పులు! ఆ ప్లేయర్లకు చిగురిస్తోన్న ఆశలు
టీ 20 ప్రపంచకప్ జట్టులో మార్పులు! ఆ ప్లేయర్లకు చిగురిస్తోన్న ఆశలు
గుండెపోటు వచ్చిన వారికి అందించాల్సిన ప్రాథమిక చికిత్స ఇదే..
గుండెపోటు వచ్చిన వారికి అందించాల్సిన ప్రాథమిక చికిత్స ఇదే..
కారు బీమాతో ఎంతో ధీమా.. క్లెయిమ్ చేసే సమయంలో ఆ జాగ్రత్తలు మస్ట్
కారు బీమాతో ఎంతో ధీమా.. క్లెయిమ్ చేసే సమయంలో ఆ జాగ్రత్తలు మస్ట్
ఓట్స్‌తో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు..
ఓట్స్‌తో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు..
ఎండాకాలంలో అమృతమే.. చెరుకు రసం ఎందుకు తాగాలో తెలుసా..?
ఎండాకాలంలో అమృతమే.. చెరుకు రసం ఎందుకు తాగాలో తెలుసా..?
ఇదెక్కడి మాస్ రా మావా..!! డ్యూయల్ రోల్‌లో అల్లు అర్జున్..
ఇదెక్కడి మాస్ రా మావా..!! డ్యూయల్ రోల్‌లో అల్లు అర్జున్..