BS Yediyurappa: రాష్ట్ర ముఖ్యమంత్రిగా యెడియూరప్పే… బీజేపీ కర్ణాటక వ్యవహారాల ఇన్చార్జి అరుణ్ సింగ్…
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీఎస్ యెడియూరప్ప కొనసాగుతారని బీజేపీ స్పష్టం చేసింది. ఈ మేరకు బీజేపీ కర్ణాటక వ్యవహారాల ఇన్చార్జి అరుణ్ సింగ్ మీడియాతో...
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీఎస్ యెడియూరప్ప కొనసాగుతారని బీజేపీ స్పష్టం చేసింది. ఈ మేరకు బీజేపీ కర్ణాటక వ్యవహారాల ఇన్చార్జి అరుణ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. కాగా గతకొద్ది రోజులుగా కర్ణాటకలో ప్రభుత్వ పెద్ద మార్పు తప్పదని చర్చలు జోరుగా సాగాయి. అయితే వాటన్నింటికి అరుణ్ సింగ్ చెక్ పెట్టారు. యెడియూరప్ప మన సీఎం అని నేను పలుసార్లు చెప్పాను. ఇక ముందు ఆయన సీఎంగా కొనసాగుతారు. ఆయన సారథ్యంలోనే మేం ముందుకు వెళుతున్నాం. యెడియూరప్ప సొసైటీలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం పట్ల చర్యలు తీసుకుంటున్నారు. పార్టీలోని ప్రముఖ నేతల్లో ఆయన ఒకరు అని తెలిపారు. పార్టీకి సంబంధించిన అంశాలపై బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని పార్టీ నేతలను అరుణ్ సింగ్ కోరారు. ఊహాజనిత ప్రశ్నలకు తాను సమాధానం చెప్పబోనని అరుణ్ సింగ్ వ్యాఖ్యానించారు. కేంద్రంలో 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సీఎంలు, కేంద్ర మంత్రులను 75 ఏండ్లు పూర్తయిన తర్వాత తప్పించడం అప్రకటిత విధానంగా కొనసాగుతున్నది.