Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైతుల కష్టాలను పట్టించుకోరా ? మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఫైర్, ఇది మొండి సర్కార్ అని వ్యాఖ్య

రైతుల ఆందోళన ఆదివారం నాటికి 39 వ రోజుకు చేరుకుంది. ఇన్నాళ్లుగా వారు నిరసన తెలియజేస్తున్నా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వారి కష్టాలను పట్టించుకోకుండా మొండిగా వ్యవహరిస్తోందని...

రైతుల కష్టాలను పట్టించుకోరా ? మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఫైర్, ఇది మొండి సర్కార్ అని వ్యాఖ్య
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Jan 03, 2021 | 9:05 PM

రైతుల ఆందోళన ఆదివారం నాటికి 39 వ రోజుకు చేరుకుంది. ఇన్నాళ్లుగా వారు నిరసన తెలియజేస్తున్నా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వారి కష్టాలను పట్టించుకోకుండా మొండిగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆరోపించారు. అన్నదాతలు కోరుతున్నట్టు వివాదస్పద చట్టాలను మూడింటినీ వెంటనే రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యమంటే రైతులు, కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించడమేనని, ఈ శీతాకాలంలో వర్షాలు పడుతుండగా..ఢిల్లీలో ఇన్ని రోజులుగా రైతులు నిరసన చేస్తున్నారని ఆమె అన్నారు. వారి దుస్థితి ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రభుత్వ మొండి వైఖరి కారణంగా 50 మందికి పైగా అన్నదాతలు మరణించారని, పలువురు ఆత్మహత్యలు చేసుకున్నారని సోనియా గాంధీ విచారం వ్యక్తం చేశారు. అయినా మోదీ ప్రభుత్వం గానీ, మంత్రులు గానీ కించిత్ విచారాన్ని ప్రకటించలేదని,, కనీసం సానుభూతిని కూడా తెలియజేయలేదని ఆమె పేర్కొన్నారు.

పైగా రైతుల ఆందోళనను కించ పరిచేట్టుగా బీజేపీ నేతలు రకరకాల  వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రౌండ్‌లో ప్రేయసి.. హాఫ్ సెంచరీతో చెలరేగిన ప్రియుడు.. కట్‌చేస్తే
గ్రౌండ్‌లో ప్రేయసి.. హాఫ్ సెంచరీతో చెలరేగిన ప్రియుడు.. కట్‌చేస్తే
పెట్టుబడులే లక్ష్యంగా దూసుకెళ్తోన్న తెలంగాణ సర్కార్!
పెట్టుబడులే లక్ష్యంగా దూసుకెళ్తోన్న తెలంగాణ సర్కార్!
తలనొప్పి ఎందుకు వస్తుంది..? ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్ అంట
తలనొప్పి ఎందుకు వస్తుంది..? ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్ అంట
కంచ గచ్చిబౌలి భూవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
కంచ గచ్చిబౌలి భూవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
IPL 2025: ప్లేఆఫ్స్ నుంచి చెన్నై ఔట్.. షాకిస్తోన్న సమీకరణాలు?
IPL 2025: ప్లేఆఫ్స్ నుంచి చెన్నై ఔట్.. షాకిస్తోన్న సమీకరణాలు?
స్టార్ హీరోయిన్ సమంత రిజక్ట్ చేసిన సినిమాలు ఇవే!
స్టార్ హీరోయిన్ సమంత రిజక్ట్ చేసిన సినిమాలు ఇవే!
ఓవర్ త్రోతో పాక్ ఓపెనర్ దవడ ఫ్రాక్చర్‌! గాయంతో కుప్పకూలిన ప్లేయర్
ఓవర్ త్రోతో పాక్ ఓపెనర్ దవడ ఫ్రాక్చర్‌! గాయంతో కుప్పకూలిన ప్లేయర్
బిగ్‌బాస్‌లోకి 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్‌! వీడియో వైరల్
బిగ్‌బాస్‌లోకి 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్‌! వీడియో వైరల్
ప్రాణాల మీదకు వచ్చిన రీల్ షూట్..!
ప్రాణాల మీదకు వచ్చిన రీల్ షూట్..!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.. 97 మంది మావోయిస్టుల లొంగుబాటు..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.. 97 మంది మావోయిస్టుల లొంగుబాటు..