AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుట్టింటికి వచ్చిన వివాహితను గర్భం చేశాడు.. చివరికి ఊహించని ట్విస్ట్

ఉత్తరప్రదేశ్‌లోని మేరట్‌లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి పెళ్లైన మహిళకు గర్భం చేసి.. హత్య చేయడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే మేరట్‌లోని ఓ మహిళకు 2015లో పెళ్లి జరిగింది. ఆ తర్వాత ఆమె భర్తతో తనకు తరచుగా గొడవలు జరగుతుండేవి. ఈ గొడవలను ఆమె భరించలేకపోయింది.

పుట్టింటికి వచ్చిన వివాహితను గర్భం చేశాడు.. చివరికి ఊహించని ట్విస్ట్
Lovers
Aravind B
|

Updated on: Jul 06, 2023 | 1:03 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని మేరట్‌లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి పెళ్లైన మహిళకు గర్భం చేసి.. హత్య చేయడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే మేరట్‌లోని ఓ మహిళకు 2015లో పెళ్లి జరిగింది. ఆ తర్వాత ఆమె భర్తతో తనకు తరచుగా గొడవలు జరగుతుండేవి. ఈ గొడవలను ఆమె భరించలేకపోయింది. పెళ్లైన ఏడాదికే తన పుట్టింటికి వచ్చేసింది. అప్పటినుంచి తన ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన ఆదేశ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. దీంతో వాళ్లిద్దరు శారీరకంగా కూడా కలుసుకున్నారు. అయితే కొనాళ్లకు ఆమె గర్భం దాల్చింది. ఈ విషయాన్ని ఆదేశ్‌కు చెప్పింది. తనను పెళ్లి చేసుకోవాలంటూ కోరింది. కానీ ఆదేశ్ మాత్రం ఇందుకు ఒప్పుకోలేదు. ఆమెను ఒదిలించుకోవడం కోసం తప్పించుకుంటూ తిరిగేవాడు.

కానీ ఆ మహిళ మాత్రం వెనక్కి తగ్గలేదు. తనను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేసింది. దీంతో ఆదేశ్ ఆమెను చంపేందుకు ప్లాన్ చేశాడు. తన స్నేహితులతో కలిసి ఆమె హత్య చేసేలా పథకం వేశాడు. ఇందులో భాగంగానే ఓ రోజు ఆమెతో మాట్లాడాడు. తన ఇంటికి రావాలంటూ పిలిచాడు. అతడ్ని నమ్మిన ఆమె వాళ్ల ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత అతడు తన స్నేహితులతో కలిసి పెద్ద బండరాయితో ఆమెపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఆమెను అక్కడే వదిలేసి నిందితులు పారిపోయారు. 3 రోజుల తర్వాత దగ్గర్లోని పొలంలో ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. తన బిడ్డను హత్య చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితులు ఆదేశ్, దీపక్‌, ఆర్యన్‌, సందీప్‌, రోహిత్‌లను అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి
Follow Us
పాక్ 7 వికెట్లు పీకేస్తే.. టీమిండియా 8 మందిని పక్కన పెట్టింది
పాక్ 7 వికెట్లు పీకేస్తే.. టీమిండియా 8 మందిని పక్కన పెట్టింది
మనిషి అనుకుని చాట్‌జీపీటీతో బామ్మ ముచ్చట్లు.. వీడియో చూస్తే..
మనిషి అనుకుని చాట్‌జీపీటీతో బామ్మ ముచ్చట్లు.. వీడియో చూస్తే..
పదో తరగతి పరీక్షల్లో మార్కుల కుమ్మరింత.. మూల్యాంకనంపై విమర్శలు!
పదో తరగతి పరీక్షల్లో మార్కుల కుమ్మరింత.. మూల్యాంకనంపై విమర్శలు!
గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు
గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం నుంచి ఊరట..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం నుంచి ఊరట..
చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే 'చికెన్ ఫ్రై'..
చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే 'చికెన్ ఫ్రై'..
ఓనం వేళ..అమెరికాలో ఇద్దరి హత్య!వారితో కలిసుండే మహిళే నిందితురాలు!
ఓనం వేళ..అమెరికాలో ఇద్దరి హత్య!వారితో కలిసుండే మహిళే నిందితురాలు!
వాటర్ ట్యాంక్ పక్కన తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు.. అనుమానం వచ్చి
వాటర్ ట్యాంక్ పక్కన తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు.. అనుమానం వచ్చి
అమౌంట్ రాశాక చివరిలో ‘Only’ అనే పదం ఎందుకు ఉపయోగిస్తారు..?
అమౌంట్ రాశాక చివరిలో ‘Only’ అనే పదం ఎందుకు ఉపయోగిస్తారు..?
RRR రికార్డ్‌ బద్దలు..కుప్పలు తెప్పలుగా కలెక్షన్స్
RRR రికార్డ్‌ బద్దలు..కుప్పలు తెప్పలుగా కలెక్షన్స్