Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guntur: కొడుకును ట్రెన్ ఎక్కించి ఇంటి వచ్చి చూడగా మైండ్ బ్లాంక్..

ఆ వ్యాపారి ఊరికి వెళ్తున్నాడని ముందుగానే సమాచారం తెలుసుకున్నట్లు ఉన్నారు. పక్కాగా స్కెచ్ వేసి ఇంటికి కన్నం వేశారు. కేజీల కొద్దీ వెండి, బంగారం దోచుకెళ్లిపోయారు.

Guntur: కొడుకును ట్రెన్ ఎక్కించి ఇంటి వచ్చి చూడగా మైండ్ బ్లాంక్..
Theft
Follow us
T Nagaraju

| Edited By: Ram Naramaneni

Updated on: Jul 06, 2023 | 9:41 AM

గుంటూరులోని కొత్తపేటకు చెందిన నరసింహారావు పండ్ల మార్కెట్ లో కమీషన్ వ్యాపారిగా పని చేస్తున్నాడు. బుధవారం సాయంత్రం అతని కొడుకు అమెరికా నుండి వచ్చి వైజాగ్ వెళ్ళేందుకు సిద్దమయ్యాడు. దీంతో అతన్ని వందేభారత్ ట్రెన్ ఎక్కించేందుకు విజయవాడ వెళ్ళారు. కుటుంబ సభ్యులంతా విజయవాడ వెళ్ళారు. ఈ విషయాన్ని పసిగట్టిన దొంగ రాత్రి ఏడు గంటల సమయంలో కొత్తపేటలోని నరసింహారావు ఇంటికి వెళ్ళాడు. నరసింహారావు మొదటి అంతస్థులో ఉంటాడు. ఇంటికి వెళ్ళిన దొంగ తాళం తొలగించి లోపలికి వెళ్ళాడు. అనుమానం రాకుండా కర్టెన్ వేశాడు. ఇంటి లోపల ఉన్న బీరువాలు పగులకొట్టాడు.

మూడు కేజీల బంగారు ఆభరణాలు, రెండు కేజీల వెండి ఆభరణాలు, రెండు లక్షల రూపాయల నగదు తీసుకొని కిందకు వచ్చాడు. అదే సమయంలో కింద ఉన్న వాళ్ళు ఎవరని ప్రశ్నించగా పై ఇంటికొచ్చామని చెప్పుకుంటూ వెళ్ళి పోయాడు. విజయవాడ నుండి తిరిగి వచ్చిన నరసింహారావు కుటుంబం తలుపు తీసి ఉండటంతో హడావుడిగా లోపలికి వెళ్ళారు. అప్పటికే దొంగలు పడినట్లు అర్థమైంది. పోలీసులుకు సమాచారం ఇచ్చారు.

అంత విలువైన ఆభరణాలు ఇంటిలో ఎందుకు పెట్టుకున్నారని నరసింహారావు కుటుంబాన్ని ప్రశ్నించగా బ్యాంక్ లాకర్ కేటాయించడంలో జాప్యం జరిగిందని అందుకే ఇంటిలో ఉంచామని చెప్పారు. దీంతో తెలిసిన వాళ్ళే దొంగతనానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సాంకేతిక ఆధారాల సాయంతో కేసు చేధించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.