AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీకి ఎన్నికల గుర్తు కేటాయించిన ఎలక్షన్ కమిషన్

ఎన్నికల కమిషన్ జన్ సూరజ్ పార్టీకి ఎన్నికల గుర్తును కేటాయించింది. ప్రశాంత్ కిషోర్ పార్టీకి కమిషన్ 'స్కూల్ బ్యాగ్' ఎన్నికల గుర్తును ఇచ్చింది. బీహార్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారత ఎన్నికల సంఘం అధికారికంగా జన్ సూరజ్ పార్టీకి ఎన్నికల గుర్తు "స్కూల్ బ్యాగ్"ను కేటాయించింది. బీహార్‌లోని 243 సీట్లలో జన్ సూరజ్ పార్టీ అభ్యర్థులు ఈ గుర్తుపై పోటీ చేయనున్నారు.

ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీకి ఎన్నికల గుర్తు కేటాయించిన ఎలక్షన్ కమిషన్
Prashant Kishor's Jan Suraaj Party Symbol
Balaraju Goud
|

Updated on: Jun 25, 2025 | 6:51 PM

Share

ఎన్నికల కమిషన్ జన్ సూరజ్ పార్టీకి ఎన్నికల గుర్తును కేటాయించింది. ప్రశాంత్ కిషోర్ పార్టీకి కమిషన్ ‘స్కూల్ బ్యాగ్’ ఎన్నికల గుర్తును ఇచ్చింది. బీహార్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారత ఎన్నికల సంఘం అధికారికంగా జన్ సూరజ్ పార్టీకి ఎన్నికల గుర్తు “స్కూల్ బ్యాగ్”ను కేటాయించింది. బీహార్‌లోని 243 సీట్లలో జన్ సూరజ్ పార్టీ అభ్యర్థులు ఈ గుర్తుపై పోటీ చేయనున్నారు. ఎన్నికల కమిషన్ నిర్ణయం పట్ల పార్టీ నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణాత్మక విధానం, సమ్మిళిత అభివృద్ధి ద్వారా సంస్కరణ, సామాజిక అభ్యున్నతిని తీసుకురావాలనే లక్ష్యంతో ఈ చిహ్నం ప్రతిధ్వనిస్తుందని పేర్కొన్నారు.

బీహార్‌లో మార్పుకు నాంది పలికాలని జాన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ విద్య, ఉపాధిపై దృష్టి పెట్టారు. ఈ హామీతో, ఆపార్టీ అభ్యర్థులు బీహార్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం వారికి స్కూల్ బ్యాగ్ ను ఎన్నికల చిహ్నంగా కేటాయించింది.

గత రెండేళ్లుగా బీహార్‌లో పాదయాత్ర చేస్తున్న పీకే, గత ఏడాది అక్టోబర్ 2న జాన్ సూరజ్‌ను రాజకీయ పార్టీగా మారుస్తున్నట్లు బహిరంగ ప్రకటించారు. అదే సందర్భంలో, దేశంలోని టాప్ 10 రాష్ట్రాలలో బీహార్‌ను చేర్చడమే తన సంకల్పమని అన్నారు. ఇందు కోసం, విద్య, ఉపాధి రంగంలో విస్తృతమైన కృషి అవసరం, దీని కోసం పార్టీ కట్టుబడి ఉందన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..