AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Border: భారత సరిహద్దు వెంబడి చైనా కుటిల యత్నాలు.. పుట్టగొడుగుల్లా సైనిక గ్రామాలు!

డ్రాగన్‌ కంట్రీ కంత్రి పనులకు అడ్డుకట్ట పడటంలేదు. ఎప్పుడూ ఏదో ఒక రూపంలో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన క్రియేట్‌ చేస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోని అనేక దేశాలు చైనాపై గూఢచర్యం, హ్యాకింగ్ ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. మరోవైపు అరుణాచల్‌పై అడపాదడపా వాతం పట్టుకుని, మూర్ఛరోగిలా గిలాగిలా కొట్టుకోవడం చైనాకు అలవాటే పోయింది.

India Border: భారత సరిహద్దు వెంబడి చైనా కుటిల యత్నాలు.. పుట్టగొడుగుల్లా సైనిక గ్రామాలు!
India China Border
Balaraju Goud
|

Updated on: May 29, 2024 | 1:34 PM

Share

డ్రాగన్‌ కంట్రీ కంత్రి పనులకు అడ్డుకట్ట పడటంలేదు. ఎప్పుడూ ఏదో ఒక రూపంలో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన క్రియేట్‌ చేస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోని అనేక దేశాలు చైనాపై గూఢచర్యం, హ్యాకింగ్ ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. మరోవైపు అరుణాచల్‌పై అడపాదడపా వాతం పట్టుకుని, మూర్ఛరోగిలా గిలాగిలా కొట్టుకోవడం చైనాకు అలవాటే పోయింది. నైన్టీన్ ఫిఫ్టీస్ తర్వాత హిందీ-చీనీ భాయీభాయీ అంటూ చాచానెహ్రూ ఇచ్చిన నినాదం.. ఆ తర్వాత వన్‌సైడ్‌ లవ్వుగా మిగిలిపోయింది.

రెండు దేశాల మధ్య 3500 కిలోమీటర్ల సరిహద్దు వివాదం కారణంగా 1962లో చైనాతో నేరుగా యుద్ధమే చెయ్యాల్సి వచ్చింది. టిబెట్‌తోపాటు అరుణాచల్ కూడా తమదే అంటూ తమ ఇంటర్నేషనల్ మ్యాపుల్ని చూపించేది. ఇక్కడ భారత దేశంలోనే అతిపెద్ద బౌద్ధ మందిరం ఉన్న తవాంగ్‌ ఉత్తర భాగం కూడా తమదేనని చెప్పుకునేది చైనా. 1962 యుద్ధంలో గెలిచినా తవాంగ్‌ నుంచి వెనక్కు వెళ్లిపోయింది చైనా. ఆ తర్వాత భారత్ ఈ ప్రాంతంపై పూర్తిగా పట్టు సాధించింది.

అయితే తాజాగా భారత్‌తో సరిహద్దుకు సమీపంలో డ్యూయల్ యూజ్ గ్రామాలను నిర్మించడంలో చైనా బిజీగా ఉంది. ఇది కాకుండా, సైనిక సౌకర్యాల నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది కంత్రీ కంట్రీ. నిర్జనమైన, ఎవరు చేరుకోలేని హిమాలయాలలో, చైనా భారతదేశంతో తీవ్ర వివాదాస్పద సరిహద్దులో వందలాది గ్రామాలను నిర్మిస్తోందని వాషింగ్టన్ థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ (CSIS) మే 16న ఒక కొత్త నివేదిక పేర్కొంది. జియోస్పేషియల్ డేటా ప్రొవైడర్ సెంటినెల్ హబ్ నుండి వచ్చిన ఉపగ్రహ చిత్రాలు 2022 – 2024 మధ్య దాని విస్తరణను చూపుతున్నాయి న్యూస్‌వీక్ పేర్కొంది.

భారత్‌ విషయంలో చైనా తన దమననీతిని ప్రదర్శిస్తునే ఉంది. ఇటీవల విడుదల చేసిన 2023 ప్రామాణిక మ్యాప్‌లో మొత్తం అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రం, అక్సాయ్‌ చిన్‌ ప్రాంతమంతా తమ భూభాగమని చైనా ప్రకటించుకుంది. ఆగస్టు 28న విడుదల చేసిన ఈ మ్యాప్‌లో అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాన్ని దక్షిణ టిబెట్‌గా పేర్కొంది. 1962 యుద్ధంలో ఆక్రమించుకున్న అక్సాయ్‌ చిన్‌ ప్రాంతం తమదని చైనా పేర్కొంది. అంతే కాదు తైవాన్‌, వివాదాస్పద దక్షిణ చైనా సముద్రాన్ని కూడా తమ భూభాగమేనని మ్యాప్‌ ద్వారా చైనా చూపింది. చైనా సర్వేయింగ్‌, మ్యాపింగ్‌ పబ్లిసిటీ డే వేడుకల్లో భాగంగా చైనా ఈ మ్యాప్‌ విడుదల చేసింది. మరో వైపు అరుణాచల్‌ ప్రదేశ్‌ ఎప్పుడూ తమ భూభాగమేనని, అది ఎప్పటికీ అలాగే ఉంటుందని అనేక సందర్భాల్లో భారత్‌ స్పష్టం చేసింది.

కానీ తాజాగా CSIS నివేదిక ప్రకారం అరుణాచల్ ప్రదేశ్ సమీపంలోని నాలుగు వేర్వేరు ప్రదేశాలలో సైనిక, ద్వంద్వ వినియోగ గ్రామ మౌలిక సదుపాయాల విస్తరణను చేపట్టినట్లు వెల్లడించింది. ఇది యారోతో పాటు జువాంగ్నాన్, మజిదున్‌కున్, కుయికియోంగ్‌మెన్‌లలో సైనిక సౌకర్యాలను విస్తరించినట్లు వెల్లడించింది. అరుణాచల్ భారతదేశంలో అంతర్భాగమైన ప్రాంతం. అయితే చైనా దానిని తమ భూభాగంగా పేర్కొంటోంది. గ్రేజోన్ వ్యూహంతో సరిహద్దులో చైనా గ్రామాలను నిర్మిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు రహస్యంగా దూకుడు సైనిక దళాలను ఈ ప్రాంతంలో మోహరించవచ్చని హెచ్చరించారు.

సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ 2018 – 2022 మధ్య, చైనా 624 ‘జియోకాంగ్’ గ్రామాలను నిర్మించిందని, ఇక పనులు కొనసాగుతున్నాయని తెలిపింది. భారత సరిహద్దులో సైనికుల మధ్య ఘర్షణ జరగడంతో ఉద్రిక్తత కొనసాగుతోంది. డిసెంబర్ 2020లో చైనా, భారత్ సైనికుల మధ్య యుద్ధం జరిగింది. 1962లో సరిహద్దు విషయంలో ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగింది. గత మూడేళ్లుగా ఘర్షణలు కూడా పెరుగుతున్నాయి. సరిహద్దు వివాదానికి స్పష్టమైన పరిష్కారం లభించలేదని నిపుణులు చెబుతున్నారు. పెరుగుతున్న సైనికీకరణ కారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకుంటోంది.

సరిహద్దు దగ్గర వేగంగా అభివృద్ధి చెందడం చైనా మౌలిక సదుపాయాల కల్పనకు నిదర్శనం. గతేడాది యారావో సమీపంలో కొత్త రోడ్డు, రెండు హెలిప్యాడ్‌లు కూడా నిర్మించారు. 3,900 మీటర్ల ఎత్తులో ఉన్న యారావోలో కఠినమైన వాతావరణ పరిస్థితులు ఉన్నందున, చైనా 2022 డిసెంబర్ నాటికి కొత్త భవనాలను నిర్మించగలిగిందని నివేదిక పేర్కొంది. టిబెటన్, హాన్ జనాభా కలయికతో చైనా సరిహద్దు ప్రాంతాలలో జనాభాను కూడా మారుస్తోందని నిపుణులు అంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..