Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇప్పుడు ఈ స్టార్ హీరోలకు.. ఏపీ ప్రభుత్వమే దిక్కా

ఇప్పుడు ఈ స్టార్ హీరోలకు.. ఏపీ ప్రభుత్వమే దిక్కా

Phani CH

|

Updated on: Dec 28, 2024 | 11:20 AM

హైదరాబాద్‌లో సంధ్య థియేటర్‌ ఘటన, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, లేటెస్టుగా తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డితో టాలీవుడ్‌ పెద్దల భేటీ తర్వాత, బెనిఫిట్‌ షోలు, టికెట్‌ రేట్ల పెంపు ఉండదనే విషయంలో క్లియర్‌ కట్‌ క్లారిటీ వచ్చేసింది. అసెంబ్లీలో చెప్పినదానికే తాను కట్టుబడి ఉన్నానని, సినీ పెద్దలతో జరిగిన భేటీలో ముఖ్యమంత్రి రేవంత్‌ స్పష్టం చేశారు.

ఆ తర్వాత బడా నిర్మాత, తెలంగాణ FDC చైర్మన్‌ దిల్‌ రాజు మాట్లాడుతూ.. టికెట్ ధరలు, బెనిఫిట్ షోల అంశం చాలా చిన్నదన్నారు. దాని మీద చర్చ జరగలేదని తేల్చేశారు. ఇండస్ట్రీ అభివృద్ధి అన్నది తమ ముందున్న అతి పెద్ద లక్ష్యమని దిల్‌ రాజు వివరించారు. దీంతో సంక్రాంతి సినిమాలకు పెద్ద చిక్కే వచ్చిపడిందన్న కామెంట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఏపీనే ఇప్పుడు పెద్ద దిక్కన్న కామెంట్ కూడా సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఇక సంక్రాంతి రేసులో 3 భారీ సినిమాలు. ఈ సంక్రాంతి రేసులో 3 బడా సినిమాలు పోటీ పడుతున్నాయి. బాలయ్య హీరోగా బాబీ డైరెక్షన్‌లో డాకు మహారాజ్‌ వస్తోంది. రామ్‌చరణ్ హీరోగా శంకర్‌ డైరెక్షన్‌లో గేమ్‌ ఛేంజర్‌ రానుంది. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో “సంక్రాంతికి వస్తున్నాం” మూవీ విడుదల కానుంది. తెలంగాణలో టికెట్‌ రేట్ల పెంపు లేదు, బెనిఫిట్‌ షోలకు నో ఛాన్స్‌ అని తేటతెల్లంగా తెలిసిపోయింది. మరి ఈ బడా సినిమాల పరిస్థితేంటి.? దానిపైనే నిర్మాతలు మల్లగుల్లాలు పడుతున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sonu Sood: CM చేస్తానంటూ ఓ పార్టీ ఆఫరిచ్చింది.. ఒక్క మాటతో షాకిచ్చిన సోనూ సూద్‌

TOP 9 ET News: దూసుకుపోతున్న పుష్ప2.. ఏకంగా బాహుబలి రికార్డ్‌ గల్లంతయ్యే ఛాన్స్‌

బీచ్‌లో ఫుడ్‌బాల్‌ అదరగొట్టిన శునకం.. వీడియో వైరల్

ఇంత వైల్డ్‌ ఏంటి అక్క.. ప్రియుడు వేరే పెళ్లి చేసుకుంటున్నాడని షాకిచ్చిన యువతి..

ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే ??