AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

School Education: ఆ రాష్ట్రంలోకి స్కూల్స్‌లో పాఠ్యాంశాలుగా భగవద్గీత, రామాయణం, మహాభారత సారాంశాలు

సీఎం  ఇంకా మాట్లాడుతూ.. "మానవులను మానవులుగా జీవించేలా చేసేది విద్య. ప్రతి ఒక్కరికీ నైతిక విద్య,  ఆధ్యాత్మిక విద్య అవసరమని  స్వామి వివేకానంద చెప్పారు... ఈ విద్యలను ప్రతి ఒక్కరికీ చిన్నతనం నుంచే అందించే ప్రయత్నం చేస్తుందన్నారు. 

School Education: ఆ రాష్ట్రంలోకి స్కూల్స్‌లో పాఠ్యాంశాలుగా భగవద్గీత, రామాయణం, మహాభారత సారాంశాలు
School Education In Mp
Surya Kala
|

Updated on: Jan 24, 2023 | 11:39 AM

Share

మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. భగవద్గీత, రామాయణం, మహాభారతం సహా ఇతర మత గ్రంథాలోని సారాంశాలను ఇక నుంచి పాఠశాలల్లో బోధించనున్నట్లు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. “రామాయణం, మహాభారతం, వేదాలు, ఉపనిషత్తులు, శ్రీమద్ భగవద్గీత మన అమూల్యమైన పుస్తకాలు.. ఈ పుస్తకాలు మనిషి నైతికంగా జీవించేలా చేస్తాయని.. మనిషిని పరిపూర్ణ వ్యక్తిగా మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. కనుక మన మత గ్రంధాల బోధన ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయబడుతుందన్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివ రాజ్ సింగ్ చౌహన్.

“ఈ పవిత్ర పుస్తకాలను పాఠశాలల్లో బోధించడం ద్వారా.. మన పిల్లలను నైతికంగా ..  పరిపూర్ణంగా మారుస్తాము,” అన్నారాయన. సీఎం  ఇంకా మాట్లాడుతూ.. “మానవులను మానవులుగా జీవించేలా చేసేది విద్య. ప్రతి ఒక్కరికీ నైతిక విద్య,  ఆధ్యాత్మిక విద్య అవసరమని  స్వామి వివేకానంద చెప్పారు… ఈ విద్యలను ప్రతి ఒక్కరికీ చిన్నతనం నుంచే అందించే ప్రయత్నం చేస్తుందన్నారు.

“చెప్పడానికి బాధగా ఉంది కానీ దేశంలో మన సంస్కృతి, సంప్రదాయం, జీవన తత్వశాస్త్రం, మహానుభావులు, ఆధ్యాత్మికత, మతాన్ని విమర్శిస్తూ ఆనందించే వారు కొందరు ఉన్నారు. అలాంటి వారికి ఈ గ్రంథాల ప్రాముఖ్యత తెలియదు. వీటిని పక్కన పెట్టడం వలన  హాని తెలియదు. రాముడు లేకుండా ఈ దేశం లేదు. శ్రీ రాముడు మనలో ప్రతిచోటా ఉంటాడు. ఈ దేశంలో సుఖం ఉన్నప్పుడు రాముడి పేరు ఉచ్ఛరిస్తారు, దుఃఖం వచ్చినప్పుడు రాముడి పేరు ఉచ్ఛరిస్తారు. అలాంటిది కొందరు మహానుభావులను అవమానిస్తారు. ఇలా చేస్తే సహించేది లేదు’’ అని ఎంపీ సీఎం పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

అయితే ఇప్పటికే ఉత్తరాఖండ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే భగవద్గీత, రామాయణం, మహాభారతం అంశాలను పాఠ్యంశాలుగా విద్యార్థులకు అందిస్తున్న సంగతి తెలిసిందే..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..