బుద్ధి మారని పాక్.. ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించాలని ఆర్మీకి భారత్ కీలక ఆదేశాలు!
భారతదేశం-పాకిస్తాన్ మధ్య మూడు రోజుల నిరంతర ఘర్షణ తర్వాత శనివారం(మే 10) కాల్పుల విరమణ ప్రకటించారు. అయితే, దీని తరువాత కూడా, బుద్ధి మారని పాకిస్తాన్ తన కార్యకలాపాలను మానుకోలేదు. కాల్పుల విరమణ తర్వాత కూడా పాకిస్తాన్ సరిహద్దులోని ఎల్వోసీ అనేక ప్రాంతాల్లో కాల్పులు జరిపింది.

భారతదేశం-పాకిస్తాన్ మధ్య మూడు రోజుల నిరంతర ఘర్షణ తర్వాత శనివారం(మే 10) కాల్పుల విరమణ ప్రకటించారు. అయితే, దీని తరువాత కూడా, బుద్ధి మారని పాకిస్తాన్ తన కార్యకలాపాలను మానుకోలేదు. కాల్పుల విరమణ తర్వాత కూడా పాకిస్తాన్ సరిహద్దులోని ఎల్వోసీ అనేక ప్రాంతాల్లో కాల్పులు జరిపింది. అలాగే, నియంత్రణ రేఖ వెంబడి అనేక భారతీయ నగరాలపై డ్రోన్ దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.
పాకిస్తాన్ కాల్పుల ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించిందని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. విరమణ ఒప్పందంద జరిగిన కొన్ని గంటల్లోనే ఎల్వోసీ దగ్గర పాక్ కాల్పులు జరిపిందని విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. భారత సరిహద్దు వెంబడి, కొన్ని గంటలుగా కాల్పుల విరమణ ఉల్లంఘిస్తోందన్నారు. డీజీఎంవో మధ్య జరిగిన ఒప్పందం ఉల్లంఘించడం సరికాదన్నారు. అయితే, తాజా పరిణామాలను ఆర్మీ నిశితంగా గమనిస్తోందన్నారు. సైనికులు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించకుండా.. పాకిస్తాన్ చర్యలు తీసుకోవాలని విక్రమ్ మిస్రీ సూచించారు. కాల్పుల విరమణ ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించాలని భారత ఆర్మీకి ఆదేశాలు ఇచ్చామని విక్రమ్ మిస్రీ వెల్లడించారు.
ఇంతలో, శ్రీనగర్లో పెద్ద పేలుడు జరిగిందనే వార్తలు స్పష్టంగా నిరాధారమైనవని, తప్పుదారి పట్టించేవని భారత ఆర్మీ ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ఏదైనా పేలుడు జరిగిందనే వార్తలను భారత సైన్యం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఖండించారు. ‘శ్రీనగర్లో ఎటువంటి పేలుడు జరగలేదని స్పష్టం చేస్తున్నాను’ అని భారత సైన్యం తెలిపింది. కొన్ని డ్రోన్లు వచ్చిన మాట వాస్తవమేనని, అయితే కొంత సమయం తర్వాత తిరిగి వెళ్లిపోయినట్లు వెల్లడించింది. నియంత్రణ రేఖ వద్ద ప్రస్తుతం ఎలాంటి కాల్పులు లేవని ఆర్మీ ప్రకటన మరింత స్పష్టం చేసింది.
గత కొన్ని రోజులుగా జరుగుతున్న సైనిక చర్యను ఆపడానికి భారతదేశం-పాకిస్తాన్ DGMO ల మధ్య ఈ సాయంత్రం ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని పాకిస్తాన్ గత కొన్ని గంటలుగా ఉల్లంఘిస్తోంది. ఈ సరిహద్దు చొరబాటును భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంటుందని, దాన్ని ఎదుర్కొంటుందని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ చొరబాటు తీవ్రంగా ఖండించిన భారత్, దీనికి పాకిస్తాన్ బాధ్యత వహించాలని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ అన్నారు. పాకిస్తాన్ ఈ పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకుని, చొరబాట్లను ఆపడానికి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..