AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

న్యూయార్క్ లో అయోధ్యా రాముని ‘చిత్ర ప్రదర్శనలు’

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి బుధవారం భూమిపూజ జరిగిన సందర్భంగా న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ ప్రాంతం కళకళలాడింది.  ఇక్కడి అతి పెద్ద డిజిటల్ బోర్డుపై ఆలయ నమూనాతో బాటు రాముని నిలువెత్తు 3 డీ పోర్ట్రైట్ ను ప్రదర్శించారు.

న్యూయార్క్ లో అయోధ్యా రాముని 'చిత్ర ప్రదర్శనలు'
Umakanth Rao
| Edited By: |

Updated on: Aug 06, 2020 | 11:07 AM

Share

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి బుధవారం భూమిపూజ జరిగిన సందర్భంగా న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ ప్రాంతం కళకళలాడింది.  ఇక్కడి అతి పెద్ద డిజిటల్ బోర్డుపై ఆలయ నమూనాతో బాటు రాముని నిలువెత్తు 3 డీ పోర్ట్రైట్ ను ప్రదర్శించారు. 17 వేల చదరపు అడుగుల ఎత్తయిన ఈ బిల్ బోర్డుపై ఏ ఈవెంట్ నైనా ప్రదర్శించాలనుకుంటే భారీ చార్జీలను చెలించాల్సి ఉంటుంది. అమెరికన్ ఇండియా పబ్లిక్ అఫైర్స్ కమిటీ అధ్యక్షుడు జగదీశ్ సెహ్వానీ ఆధ్వర్యాన ఈ నగరంలో అయోధ్య కార్యక్రమాలను భారీ స్క్రీన్లపై ప్రదర్శించారు. నగరమంతా శోభాయమానంగా అలంకరించారు.అయోధ్యలో  ప్రధాని మోడీ కనువిందుగా భూమిపూజను నిర్వహించిన సంగతి తెలిసిందే. న్యూయార్క్ నగరంలో పలుచోట్ల మోదీ పోస్టర్లను కూడా ఏర్పాటు చేశారు. టైమ్స్ స్క్వేర్ వద్ద చేరి న వేలాది భారతీయులు ఆసక్తిగా ఈ బిల్ బోర్డుపై ప్రదర్శించిన ‘విశేషాలను’ తిలకించారు.