Kejriwal: గుజరాత్‌ ఎన్నికలపై ఆమ్ ఆద్మీ ఫోకస్.. భారీ ఉచిత తాయిలం ప్రకటించిన కేజ్రీవాల్

Gujarat Elections 2022: ఉత్తరప్రదేశ్‌లో గత వారం జరిగిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ సందర్భంగా రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అర్వింద్ కేజ్రీవాల్ భారీ ఉచితాన్ని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Kejriwal: గుజరాత్‌ ఎన్నికలపై ఆమ్ ఆద్మీ ఫోకస్.. భారీ ఉచిత తాయిలం ప్రకటించిన కేజ్రీవాల్
Arvind Kejriwal (File Photo)Image Credit source: TV9 Telugu
Follow us

|

Updated on: Aug 16, 2022 | 5:53 PM

Gujarat Polls 2022: ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉన్న అమ్ ఆద్మీ పార్టీ(AAP) తన నెక్ట్స్ ఫోకస్‌ను గుజరాత్‌కు షిఫ్ట్ చేసింది. డిసెంబరులో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సన్నద్ధవుతోంది. గత నెల రోజుల్లో రెండోసారి ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) రెండోసారి గుజరాత్‌లో పర్యటించారు. గురువారంనాడు సూరత్‌లో ప్రజలనుద్దేశించి మాట్లాడిన ఆయన.. ఎన్నికల ప్రచార పర్వాన్ని మరింత వేడెక్కిస్తూ కీలక ప్రకటన చేశారు. గుజరాత్ ఓటర్లకు భారీ ఉచిత తాయిలాన్ని ప్రకటించారు. ఆ రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే గృహ అవసరాలకు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఉత్తరప్రదేశ్‌లో గత వారం జరిగిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ సందర్భంగా రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ అర్వింద్ కేజ్రీవాల్ భారీ ఉచితాన్ని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

గుజరాత్‌లో ఆప్ అధికారంలోకి వస్తే 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించి తీరుతుందన్న కేజ్రీవాల్.. ఆ మేరకు ఆప్ కన్వీనర్‌గా తాను ప్రజలకు హామీ ఇస్తున్నట్లు చెప్పారు. కోతలు లేని నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తామన్నారు. అలాగే 2021 డిసెంబరు 31కి ముందు జారీ చేసిన అన్ని విద్యుత్ బిల్లులను మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. 27 ఏళ్ల బీజేపీ పాలనపై గుజరాత్ ప్రజలు విసిగిపోయారని.. గుజరాత్ రాష్ట్రాభివృద్ధికి ఆప్ దగ్గరున్న సమగ్ర ప్రణాళికలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. కేజ్రీవాల్ చేసిన ఈ ప్రకటనలో.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆప్ మరిన్ని ఉచిత తాయిలాలను ప్రకటించొచ్చని తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి

Latest Articles
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం