AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విషమించిన అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి

గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమించినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆగస్టు 9 నుంచి ఆయన ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. గురువారం ఆయనకు డయాలసిస్ చేశారు. ఆగస్టు 10 నుంచి జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి హైల్త్ బులిటెన్ విడుదల చేయలేదు. 20 వతేదీన ఆయనకు వెంటిలేటర్‌ను అమర్చారు. ఇప్పటివరకు జైట్లీని పరామర్శించిన వారిలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, […]

విషమించిన అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 24, 2019 | 3:33 AM

Share

గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమించినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆగస్టు 9 నుంచి ఆయన ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. గురువారం ఆయనకు డయాలసిస్ చేశారు. ఆగస్టు 10 నుంచి జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి హైల్త్ బులిటెన్ విడుదల చేయలేదు. 20 వతేదీన ఆయనకు వెంటిలేటర్‌ను అమర్చారు.

ఇప్పటివరకు జైట్లీని పరామర్శించిన వారిలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్ర మంత్రు రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, జితేంద్ర సింగ్, రామ్‌విలాస్ పాశ్వాన్, అమిత్‌షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ నేతలు అభిషేక్ మను సింఘ్వీ, జ్యోతిరాధిత్య సింథియా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తదితరులు జైట్లీని పరామర్శించారు.

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అరుణ్ జైట్లీ తన అనారోగ్య సమస్య వల్ల పోటీ చేయలేదు. ఈ ఏడాది మే నెలలో ఆయన మూత్రపిండ మార్పిడి చికిత్స నిమిత్తం ఎయిమ్స్‌లో చేరారు. సెప్టెంబర్ 2014లో జైట్లీ బెరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారు. 2018 మే నెల నుంచి రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఆర్థిక శాఖ నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.