AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్రానికి షాక్ : ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కీలక నిర్ణయం..

జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీం కోర్టు సోమవారం విచారణ జరిపింది. అక్కడ తీవ్ర విపత్కర పరిస్థితులు నెలకొని ఉన్నాయన్న పిటిషనర్ల వాదనకు స్పందించింది. ఈ కేసులో స్వయంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ రంజన్ గొగోయ్ జమ్ము కశ్మీర్‌లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు తన కుటుంబాన్ని కలుసుకునేందుకు అనుమతించాలని పిటిషన్ వేసిన కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌కు కోర్టు అనుమతి ఇచ్చింది. […]

కేంద్రానికి షాక్ : ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కీలక నిర్ణయం..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 16, 2019 | 1:03 PM

Share

జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీం కోర్టు సోమవారం విచారణ జరిపింది. అక్కడ తీవ్ర విపత్కర పరిస్థితులు నెలకొని ఉన్నాయన్న పిటిషనర్ల వాదనకు స్పందించింది. ఈ కేసులో స్వయంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ రంజన్ గొగోయ్ జమ్ము కశ్మీర్‌లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు తన కుటుంబాన్ని కలుసుకునేందుకు అనుమతించాలని పిటిషన్ వేసిన కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌కు కోర్టు అనుమతి ఇచ్చింది. అలాగే నాలుగు జిల్లాల్లో పర్యటించేందుకు కూడా అనుమతిని మంజూరు చేసింది.

అయితే ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్‌లో పరిస్థితి బాగానే ఉందంటూ కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చిన నేపథ్యంలో అక్కడి పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయంటూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ నేత గులాం నబీతో పాటు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా మరో పిటిషన్ దాఖలు చేశారు. కశ్మీర్ లోయ ప్రాంతంలో చిన్నారులను బయటకు రానివ్వడం లేదంటూ దాఖలైన పిటిషన్‌పై .. ఈ విషయంపై సుప్రీం సీరియస్ అయ్యింది. నిజంగా ఇందులో నిజమెంతో తెలుసుకోవాలని అనుకుంటున్నట్టుగా వ్యాఖ్యానించింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత నెలకొన్న పరిస్థితులపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారించి ఈ నిర్ణయం తీసుకుంది.