AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharastra: అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా ఊహించని షాక్.. లేచి కూర్చున్న యువకుడు.. దెబ్బకు జనం భయంతో పరార్

గుడి మెట్ల దగ్గర ఆ యువకుడి పాడెను ఉంచారు. కొద్దిసేపటికి  పాడే మీద ఉన్న వ్యక్తి నిద్ర నుంచి లేచి నట్లు నిద్ర లేచాడు. ఈ విచిత్ర ఘటన మహారాష్ట్రలోని అకోలాలో చోటుచేసుకుంది .

Maharastra: అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా ఊహించని షాక్.. లేచి కూర్చున్న యువకుడు.. దెబ్బకు జనం భయంతో పరార్
Akola Man Alive After Death
Surya Kala
|

Updated on: Oct 27, 2022 | 1:40 PM

Share

ఓ యువకుడు గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. అతని ఆరోగ్యం క్షీణిస్తూనే ఉంది. డాక్టర్ అతని పల్స్  చూసి..  ఆ యువకుడు చనిపోయినట్లు ప్రకటించాడు. దీంతో ఆ యువకుడిని అంతిమ యాత్రకు తీసుకుని వెళ్తున్నారు. శ్మశాన వాటికకు వెళ్లే దారిలో ‘రామ్‌ నామ్‌ సత్య హై…’ అంటూ నినాదాలు చేశారు. అప్పుడు ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురై సమీపంలోని గ్రామంలోని ఆలయానికి చేరుకున్నారు. గుడి మెట్లపై  ఆ యువకుడి పాడెను ఉంచారు. కొద్దిసేపటికి  పాడే మీద ఉన్న వ్యక్తి నిద్ర నుంచి లేచి నట్లు నిద్ర లేచాడు. ఈ విచిత్ర ఘటన మహారాష్ట్రలోని అకోలాలో చోటుచేసుకుంది .

ఈ ఘటన అకోలా జిల్లా పాటూర్ తాలూకా వివ్రా గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఆ యువకుడి పేరు ప్రశాంత్ మేష్రే. ప్రశాంత్ మేష్రే హోంగార్డు. కొద్ది రోజులుగా అనారోగ్య కారణాలతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. బుధవారం ప్రశాంత్ ఆరోగ్యం మరింత విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

ప్రశాంత్ మేష్రే నాడి కొట్టుకోవడం ఆగిపోయింది. దీంతో వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు. ప్రశాంత్ మేష్రే వయసు కేవలం 25 ఏళ్లు. చిన్న వయసులో మరణించడంతో అతని కుటుంబసభ్యులు కన్నీరుమునీరుగా విలపించారు. అంత్యక్రియలకు సన్నాహాలు ప్రారంభించారు. ప్రశాంత్ ను శ్మశానికి తీసుకుని వెళ్తుండగా.. శరీరంలో ఒక్కసారిగా కదలికలు ఏర్పడ్డాయి. ముందుగా గ్రామస్థులకు ఏమీ అర్థం కాలేదు. తర్వాత భయాందోళనకు గురైన వారు సమీపంలోని గ్రామంలోని ఆలయానికి చేరుకున్నారు.  ప్రశాంత్ నిద్ర లేచినట్లు పాడే మీద నుంచి లేచాడు.

ఇవి కూడా చదవండి

గ్రామస్తులు ఇంతకు ముందెన్నడూ ఇలాంటి అద్భుతాన్ని చూడలేదు. ప్రశాంత్ బతికి ఉన్నాడన్న వార్త కొద్దిసేపటికే ఊరంతా వ్యాపించింది. ఈ దృశ్యాన్ని చూసేందుకు ఊరంతా గుడి దగ్గర గుమిగూడారు. జనాన్ని అదుపు చేసేందుకు పోలీసులను పిలిపించాల్సి వచ్చేలా జనం గుమిగూడారు. ఇలా ప్రశాంత్ బతకడానికి కారణం.. అతని శరీరంలోకి దేవత వచ్చిందని ఊరంతా చర్చ మొదలైంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఏనుగుల దినోత్సవం.. ఇంత తెలివైనవా? అచ్చం మనుషుల్లానే చేస్తాయా
ఏనుగుల దినోత్సవం.. ఇంత తెలివైనవా? అచ్చం మనుషుల్లానే చేస్తాయా
దేవుడి ముందు ప్రార్థిస్తున్నప్పుడు చెడు ఆలోచనలు ఎందుకు వస్తాయి?..
దేవుడి ముందు ప్రార్థిస్తున్నప్పుడు చెడు ఆలోచనలు ఎందుకు వస్తాయి?..
ఏయిర్‌ పోర్టులో అనుమానంగా కనిపించిన ప్రయాణికుడు.. ఆపి చెక్‌ చేయగా
ఏయిర్‌ పోర్టులో అనుమానంగా కనిపించిన ప్రయాణికుడు.. ఆపి చెక్‌ చేయగా
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
2026లో భారత్‌లో అత్యధిక జీతాలు అందించే టాప్ 10 ఉద్యోగాలు..
2026లో భారత్‌లో అత్యధిక జీతాలు అందించే టాప్ 10 ఉద్యోగాలు..
కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది..
కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది..
సామాన్యులకు రైల్వేశాఖ బిగ్ రిలీఫ్..
సామాన్యులకు రైల్వేశాఖ బిగ్ రిలీఫ్..
16 సోమవారాల వ్రతానికి శ్రావణ మాసమే ఎందుకు ప్రత్యేకం? దీని వెనుక..
16 సోమవారాల వ్రతానికి శ్రావణ మాసమే ఎందుకు ప్రత్యేకం? దీని వెనుక..
తెలంగాణ తరహాలో స్టైఫండ్ ఇవ్వాలని జూనియర్ డాక్టర్ల డిమాండ్
తెలంగాణ తరహాలో స్టైఫండ్ ఇవ్వాలని జూనియర్ డాక్టర్ల డిమాండ్
కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు.. మారనున్న రూపురేఖలు..
కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు.. మారనున్న రూపురేఖలు..