AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆస్ట్రేలియా వెళ్లిన ఎయిర్‌ ఇండియా ఫైలట్‌కు కరోనా పాజిటివ్

ఢిల్లీ నుంచి ఆస్ట్రేలియాలోని సిడ్నీకి వెళ్లిన ఎయిర్‌ ఇండియా పైలట్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఫ్లైట్ ఎక్కే ముందు జరిపిన పరీక్షల్లో అతడికి నెగిటివ్‌గా ఉన్నప్పటికీ..

ఆస్ట్రేలియా వెళ్లిన ఎయిర్‌ ఇండియా ఫైలట్‌కు కరోనా పాజిటివ్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 23, 2020 | 2:47 PM

Share

ఢిల్లీ నుంచి ఆస్ట్రేలియాలోని సిడ్నీకి వెళ్లిన ఎయిర్‌ ఇండియా పైలట్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఫ్లైట్ ఎక్కే ముందు జరిపిన పరీక్షల్లో అతడికి నెగిటివ్‌గా ఉన్నప్పటికీ.. ఆ తరువాత పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ల్యాండ్ అయిన తరువాత పైలట్‌తో పాటు కాక్ పిట్‌లో ఉన్న మరో ఇద్దరు సిబ్బందిని అధికారులు క్వారంటైన్‌కు తరలించారు.

ఈ విషయంపై ఎయిర్ ఇండియా సంస్థ మాట్లాడుతూ.. విమానయానానికి సిద్ధమయ్యే పైలట్‌లకు తాము ముందుగానే పరీక్షలు చేస్తామని, ఆ క్రమంలో ఈ నెల 16న జరిపిన పరీక్షల్లో అతడికి నెగిటివ్‌గా వచ్చిందని తెలిపారు. దాంతో విమానాన్ని నడిపేందుకు ఈ నెల 20న సదరు పైలట్‌కు అవకాశం ఇచ్చామని అన్నారు. అంతేకాకుండా ఆ పైలట్ మామూలుగా లాగోస్‌కి వెళ్లాలని కానీ సిడ్నీకి వెళ్లే పైలట్‌కి బాలేకపోవడంతో.. లాగోస్‌కి వెళ్లాల్సిన ఈ పైలట్‌ని సిడ్నీకి పంపినట్లు తెలిపారు. అయితే ఎయిర్‌ ఇండియాలో ఇలా జరగడం ఇది రెండో సారి. గత నెల 30న ఢిల్లీ నుంచి మాస్కోకు వెళ్లిన పైలట్‌కు కరోనా వచ్చిందని తెలీడంతో.. మార్గమాధ్యమంలోనే అతడు వెనక్కి రావాల్సి వచ్చిన విషయం తెలిసిందే.

Read This Story Also: వారందరికి నూటికి నూరు శాతం ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాల్సిందే: సీఎం జగన్