పెద్ద మనుసు చాటుకున్న చిన్నారి! ఇండియన్ ఆర్మీ కోసం విరాళం..
తమిళనాడులోని కరూర్కు చెందిన ఎనిమిది ఏళ్ల బాలుడు తన పొదుపు డబ్బును భారత సైన్యానికి విరాళంగా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. పది నెలలుగా తన పాకెట్ మనీ, ఇతరుల నుండి వచ్చిన డబ్బును దాచుకుని, కలెక్టర్ కార్యాలయంలో విరాళం అందించాడు. ఈ చిన్నారి దేశభక్తి, సహాయపడే మనస్సు అందరినీ ప్రభావితం చేసింది. ఈ ఘట్టం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

చిన్న పిల్లలు చాక్లెట్లు, బిస్కెట్లు కావాలని అల్లరి చేయడమే కాదు.. కొంతమంది ఇలా చిన్న వయసులోనే పెద్ద మనసు చాటుకుంటారు. తమిళనాడులోని కరూర్కు చెందిన ఎనిమిదేళ్ల విద్యార్థి తన కిట్టీ బ్యాంక్లో దాచుకున్న డబ్బుని భారత సైన్యానికి విరాళంగా ఇచ్చాడు. గత 10 నెలలుగా రెండవ తరగతి విద్యార్థి తన పాకెట్ మనీ, కుటుంబ సభ్యుల ఇచ్చిన డబ్బును దాచుకుంటున్నాడు. ఇప్పుడా డబ్బులను ఇండియన్ ఆర్మీకి విరాళాలను అందజేశాడు. చిన్నారి చేసిన ఈ పనికి అంతా ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం విరాళం అందిస్తున్న ఆ చిన్నారి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కరూర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్వయంగా విరాళం అందించాడు. బాలుడు నాణేలు, నోట్లతో నిండిన వాటర్ ట్యాంక్ ఆకారపు డబ్బు బ్యాంకును మోసుకెళ్లాడు. ‘నేను రెండవ తరగతి చదువుతున్నాను. మమ్మల్ని రక్షించే వారికి సహాయం చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను ఆర్మీ సైనికులకు ఇవ్వడానికి నా డబ్బునంతా దాచుకున్నాను’ అని బాలుడు కలెక్టర్ కార్యాలయం వెలుపల మీడియాతో చెప్పాడు. కలెక్టర్ కార్యాలయంలోని అధికారులు విరాళం మొత్తాన్ని బహిరంగంగా వెల్లడించలేదు, కానీ రసీదును అందించి, చిన్నారిని ప్రశంసించారు.
🚨 INSPIRING: An 8-year-old boy from a government school donates his savings of 10 months to the Indian Army! 🪖
This is not just a donation—it’s a salute from the heart of a child. 🫡
True patriotism has no age. 🥹 Respect beyond words.
#ceasefirevoilation #NuclearLeak pic.twitter.com/dqAXoh8uXr
— Hinduism_and_Science (@Hinduism_sci) May 13, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




